Tuesday, 23 December 2025
5th Gurukula Entrance Material Distribution on the occasion of National Farmer's Day 2025 at MPPS Uppununthala Boys
National Mathematics Day 2025 Programme at MPPS Uppununthala Boys
ఘనంగా జాతీయ గణిత దినోత్సవం:
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో గొప్ప గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రామానుజన్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు, అనంతరం ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు చందన లు మాట్లాడుతూ రామానుజన్ గారు గణితం పైన మక్కువతో సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, గణిత విశ్లేషణ వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచారు, 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించారు, కానీ 1729 వంటి సంఖ్యల ద్వారా చిరస్మరణీయులయ్యారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల పైనా నేటికీ ఎందరో పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వారి స్పూర్తితో విద్యార్థులు గణితం తో పాటు అన్ని విషయాలు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
Saturday, 20 December 2025
International Meditation Day Programme 2025 at MPPS Uppununthala Boys
డిసెంబర్ 21 రేపు ఆదివారం కావడంతో ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
Nutritious Food Festival at MPPS Uppununthala Boys in the PTM
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పిటిఎం) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేయడానికి పోషక ఆహారోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పౌష్టికాహారం అందించాలని, పౌష్టికాహారం అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే పదార్థాలు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. స్థూల పోషకాలు అయిన పిండి పదార్థాలు 60%, మాంసకృత్తులు 15%, క్రొవ్వులు 25% తీసుకోవాలని, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి అని తెలియజేశారు. దీన్నే సమతుల ఆహారంగా చెప్తారు. పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలకు వారానికి మూడు గుడ్లు, రాగి జావ, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు జంక్ ఫుడ్ తినకుండా, ఇంట్లో చేసిన తాజా ఆహారం తీసుకోవాలి అని సూచించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేసుకొని వచ్చిన పోషకాలు కలిగిన, రుచికరమైన వంటకాలను ప్రదర్శించి,వాటి తయారీ విధానం, ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Saturday, 6 December 2025
Babasaheb Dr BR Ambedkar's 69th death anniversary programme at MPPS Uppununthala Boys
Thursday, 4 December 2025
Indian Navi Day Celebrations at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అద్యక్షతన భారత దేశ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ భారత దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలైన సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళాల్లో నావికా దళం ప్రధానమైనదని ఇది భారత దేశ తీర ప్రాంతం గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 11 వేల 98 కిలోమీటర్ల మేర దేశాన్ని శత్రు దేశాల నుంచి నిత్యం కాపాడుతుంది అని భారత దేశ పటాన్ని చూపిస్తూ వివరించడం జరిగింది.
పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విజయం సాధించడంలో 1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణ కోసం నావికా దళంలో పనిచేసిన సైనికుల త్యాగాలను గౌరవించాలని సూచించారు. వారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Wednesday, 3 December 2025
World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.
బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Tuesday, 2 December 2025
National Pollution Control Day 2025 at MPPS Uppununthala Boys
ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు పాఠశాల ప్రహరీ గోడ వెంబడి మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తరగతి వారిగా విద్యార్థులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మూడు రకాల కాలుష్యాలు వాటి నియంత్రణ మార్గాలను విద్యార్థులకు వివరిస్తూ భూమి కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాయు కాలుష్య నివారణకు మొక్కలు పెంచాలని, జల కాలుష్య నివారణకు వ్యర్థ పదార్థాలను నీటిలో కలుపొద్దని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని మనకు అవసరం అయ్యే ఆక్సిజన్ ను ఇస్తాయని, వర్షాలు కురవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయని వివరించారు. అందుకే చెట్లను నరుకొద్దని, వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలియజేశారు. కాలుష్యం నుంచి ప్రకృతి ని రక్షించి భావి తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని, అందరూ పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
Saturday, 29 November 2025
Spell bee competition conducts on 29/11/2025, Saturday
ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఆలూరి శ్రీజ గ్రూప్ సభ్యులు బొల్లె చక్రవర్తి, మధనాగుల ప్రవీణ్, మధనాగుల మీనాక్షి, మధనాగుల శ్రుతి, బొల్గం మినీశ్వర్, పాత్కుల ఆర్య మొదటి బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అభినందనలు తెలియజేసి, పెన్సిల్ లు బహుమతిగా అందజేశారు. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Friday, 28 November 2025
Mahathma Jyothi Rao Phule's 135th death anniversary programme at MPPS Uppununthala Boys
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే గారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి కి చదువు నేర్పి, ఆమెతో కలిసి 1848 వ సంవత్సరం నుంచి బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి, ఎన్నో అవమానాలను, అడ్డంకులను, కుట్రలను ఎదుర్కొని విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, వారు 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని, గులాం గిరీ పుస్తకం రచించి అత్యధిక ప్రజలు మానసిక బానిసత్వం నుండి విముక్తి కావాలని అందుకు విద్యను ఆయుధంగా తీసుకోవాలి అన్నారు. వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Tuesday, 25 November 2025
Constitution Day 2025 Celebrations at MPPS Uppununthala Boys
ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి రాజ్యాంగ పీఠిక ను పఠనం చేయడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 2 సం.రాల 11 నెలల 18 రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించడం జరిగిందని, ఇది నవంబర్ 26, 1949 లో ఆమోదించడం జరిగిందని, ఆ సందర్భంగా ఈ రోజు రాజ్రాయాంగం దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు. అదేవిధంగా రాజ్యంగ పీఠిక లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, జాతీయ సమగ్రత పదాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా దేశ పౌరులు అందరూ సమానంగా ఎదిగే విధంగా, సమాన గౌరవం పొందే విధంగా అన్ని రంగాల్లో అందరూ భాగస్వామ్యం అయ్యే విధంగా భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కులు, దేశ భక్తి ని, దేశాభివృద్ధి లో పౌరుల భాద్యతలను తెలిపే ప్రాధమిక విధులను, అందరికీ ఆర్థికంగా, సామాజిక న్యాయం అందించడానికి ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగిందని, ప్రస్తుతం రాజ్యాంగం మొత్తం 470 ఆర్టికల్ లు, 12 షెడ్యూల్, 25 భాగాలుగా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది అని తెలియజేశారు. రాజ్యాంగం స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని హక్కులు ఉపయోగించుకొని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
Monday, 17 November 2025
Dual desks donation to MPPS Uppununthala Boys by Tr. Vijay Kumar sir, BTF state leader
డ్యుయల్ డెస్క్ లు అందించిన విజయ్ కుమార్ సార్ కి సన్మానం
Friday, 14 November 2025
PTM and National Children's Day 2025 celebrations at MPPS Uppununthala Boys
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ,వర్కు పుస్తకాలు, కృత్రిమ మేదతో డిజిటల్ తరగతులు మొ.న అంశాలను వివరించారు .
అనంతరం ఆనందకరమైన బాల్యాన్ని అందించడం అనే అంశం పైన చర్చించడం జరిగింది. పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు, నైతిక విలువలు అందించే కథలు అంటే చాలా ఇష్టం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వేచ్ఛపూరిత వాతావరణంలో, భయం లేకుండా ఆనందకరమైన బాల్యాన్ని గడిపిన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఉత్తమ పౌరులుగా తమ బాధ్యతను నిర్వహిస్తారు కాబట్టి వారి బాల్యాన్ని ఆనందకరంగా తీర్చిదిద్ది వారికి భరోసానిస్తూ వారు సంపూర్ణ మూర్తిమత్వ వికాసం పొందే లాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం కృషి చేయాలని సూచించారు. చాచా నెహ్రూ గారి జీవితాన్ని పూర్తిగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అనంతరం కేక్ కోసీ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, ఏఏపిసీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు , విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు
Tuesday, 11 November 2025
National Education Day Celebrations 2025
ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, సంగీత లు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి జైలు జీవితం కూడా గడిపారని, స్వాతంత్య్ర భారత దేశంలో మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా 11 సం.రాలు పని చేసి అందరికీ విద్యను అందించడానికి, విద్యా వ్యాప్తికి విశిష్ట సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్య మనిషికి మూడో నేత్రం లాంటిది. ప్రతి వ్యక్తి విద్య ద్వారానే జ్ఞానాన్ని పొందుతాడని, వాస్తవాలను తెలుసుకోవడం, విషయ పరిజ్ఞానం, విలువలు, విజ్ఞానం వల్ల వ్యక్తిలోని అజ్ఞానం, మూఢనమ్మకాలు తొలగిపోయి పరిపూర్ణ వ్యక్తిగా మారుతారని, సమాజాన్ని సరైన విధంగా అవగాహన చేసుకొంటారని, జీవితంలో సౌకర్యవంతమైన గొప్ప స్థాయికి ఎదుగుతారని, సమాజంలో గౌరవం పొందుతారని తెలియజేశారు.
Condolences Programme of great Poet and write Ande Sri 2025
అందెశ్రీ గారి మృతికి సంతాపంగా ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ముందుగా వారికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 ని.లు విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారని, సమాజంలోని విషయాలు, ప్రకృతిలోని విషయాలపైన ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నో పాటలు రాశారని, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఇటీవల రూ.కోటి పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య, ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట అని, 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వచ్చిందని, 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారని, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్న అందెశ్రీ
ఉదయం 7:25 గం.లకి గాంధీ ఆసుపత్రిలో అమరుడైనారని తెలియజేశారు. ఆయన మన నుంచి భౌతికంగా దూరమైనా ఆయన రచనలు, పాటలు మనల్ని నిత్యం చైతన్యం చేస్తాయని వారి స్పుర్థితో బాగా చదువుకుని, సమాజాన్ని అవగాహన చేసుకొని, భవిష్యత్తులో సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
Wednesday, 15 October 2025
Dr. APJ Abdul Kalam 's 94th birth anniversary celebrations 2025
ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమం:
ఈ రోజు ఉదయం 10:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ , చందన, సంగీత లు అబ్దుల్ కలాం గారు మన దేశానికి చేసిన సేవలను గురించి వివరిస్తూ వారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో 1931, అక్టోబర్ 15న జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. తల్లి ఆషియమ్మ గృహిణి వాళ్ళ నాన్న జైనులబ్దీన్ పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లో పనిచేసి, 1980లో ఎస్ఎల్వి 3 ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. దేశ రక్షణ వ్యవస్థకు ఎన్నో మిసైల్ లను అభివృద్ధి చేసి అందించారు. 1998 సం.లో పోక్రాన్ అను పరీక్షలు విజయవంతంగా నిర్వహించి భారత దేశాన్ని రక్షణ రంగంలో పఠిష్ట పరిచారు. 11వ భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. షిల్లాంగ్ లో 2015, జూలై 27న యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన జీవితాంతం దేశానికి సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారు పేద కుటుంబంలో జన్మించినప్పటికి బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగారు కాబట్టి విద్యార్థులు కూడా కలాం గారి స్పూర్తితో బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Friday, 10 October 2025
Uppununthala Complex HM Srinivas Reddy sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించి అభినందించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి:
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. స్పోకెన్ ఇంగ్లీష్ ను విద్యార్థులు చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, వారికి తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ఏం రోజు పాఠం ఆ రోజు నేర్చుకోవాలని, నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని, చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను, పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు, విద్యార్థులకు అందిస్తున్న రాగి జావను పరిశీలించారు.
Saturday, 20 September 2025
Parent Teacher Meeting & Bathukamma Celebrations 2025
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆకట్టుకున్న పప్పెట్రీ ప్రదర్శన:
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ దసరా సెలవుల్లో పిల్లలతో తల్లిదండ్రులు తగిన సమయాన్ని గడపాలని, విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ ఒక గంట చదువుకునేలా చూడాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకునే విధంగా వారికి స్ఫూర్తివంతమైన వ్యక్తుల గురించి, కథలు చెప్పాలని, కుటుంబ విలువల గురించి వివరించాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిర్వహిస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు.ఈ సమావేశంలో విద్యార్థులు ప్రదర్శించిన పప్పెట్రీ ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం విద్యార్థులు వివిధ పూలను సేకరించి బతుకమ్మను పేర్చి , బతుకమ్మ పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Wednesday, 17 September 2025
Telangana People's Governance Day 2025 celebrations at MPPS Uppununthala Boys
Monday, 15 September 2025
Grand welcome and felicitation to venkatesh sir for Successfully completed National Level Educational Training at CCRT Udaipur, Rajasthan State
Monday, 25 August 2025
Our School Teacher has been selected for National Level Educational Training
Saturday, 23 August 2025
National Space Day Celebrations 2025 - Rocket Experiment at MPPS Uppununthala Boys
Friday, 22 August 2025
Students play chess game at MPPS Uppununthala Boys
బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాలమూరు ఎఆర్ఐ ఫోరం వారు అందించిన చదరంగం బోర్డులతో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అవగాహన కల్పిస్తూ చదరంగం ఆట పైన ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులు చదరంగం ఆడటం వల్ల వారిలో మేధో వికాసం అభివృద్ధి చెందుతుందని, ఆట నియమాలు తెలుసుకొని, క్రమశిక్షణతో గెలవడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషించడం, ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం, వేగంగా ఖచ్చితత్వంతో ఆలోచించడం, విజయం కోసం ఓపికతో వ్యవహరించడం, గెలుపు ఓటముల ను సమానంగా స్వీకరించడం ద్వారా వారు విద్యలో కూడా రాణిస్తారని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ చదరంగం బోర్డులు అందజేసిన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకులు రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Tuesday, 12 August 2025
Uppununthala MEO Chandra Shekhar sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కూడా చెప్పలేని విధంగా ఈ 4,5 తరగతుల విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ను చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, ఈ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నందున మరొక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఎం.ఈ.వో గారిని కోరడం జరిగింది.
Monday, 11 August 2025
National Deworming Day Programme at MPPS Uppununthala Boys
Tuesday, 5 August 2025
91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir
ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు.
బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tuesday, 29 July 2025
RBSK team visit and screen all the students and give medicine at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 11 గం.లకు రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమంల(RBSK) లో భాగంగా డాక్టర్ మంగ, డాక్టర్ మహేశ్వర్, ఫార్మసిస్ట్ రాజు, ఏ.ఎన్,యం రేణమ్మ లు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల, ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆటలు ఆడాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు అని తెలియజేశారు. వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Saturday, 19 July 2025
Shoes and School Bags free distribution by Maryada Foundation 2025 at MPPS Uppununthala Boys
విద్యార్థులకు బూట్లు & స్కూల్ బ్యాగ్ ల పంపిణీ:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు, ఉదయం 11 గం.లకు బాలికల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు మర్యాద ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారు బూట్లు, స్కూల్ బ్యాగ్ లు అతిథులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన మండల నాయకులు అనంత రెడ్డి గారు, ఎం.ఈ.వో చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్యాద రుక్మ రెడ్డి గారు మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. విద్య ద్వారానే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని తాను చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా విద్యార్థులకు 70 వేలతో 166 జతల బూట్లు, 70 స్కూల్ బ్యాగ్ లను ఉచితంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందజేయడం ప్రశంసనీయం అని వారి సేవలను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మర్యాద ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువ నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత రామచంద్ర రెడ్డి, లక్ష్మీ, జయప్రద, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
మర్యాద ఫౌండేషన్ వారు ఉచితంగా పంపిణీ చేసిన బూట్లు & స్కూల్ బ్యాగ్ లతో విద్యార్థులు
మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారిని అతిథులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.
Friday, 11 July 2025
Free Notebooks distribution 2025 at MPPS Uppununthala Boys
Thursday, 10 July 2025
Guru Purnima Celebrations 2025 at MPPS Uppununthala Boys
Tuesday, 8 July 2025
Parent Teacher Meeting on Parents as Partners at MPPS Uppununthala Boys
ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ డిజిటల్ లెర్నింగ్ గురించి వివరించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం నెలకు ఒక రోజు నిర్వహించే ఈ సమావేశంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొని వారి ప్రగతిని తెలుసుకొని పాఠశాల అభివృద్ధికి, ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల కంటే ఈ పాఠశాలలో బాగా చదవు చెప్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
Friday, 20 June 2025
11th International Yoga Day Celebrations at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ యోగా ప్రత్యేకతను, ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరవని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.




























































