Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Tuesday, 23 December 2025

5th Gurukula Entrance Material Distribution on the occasion of National Farmer's Day 2025 at MPPS Uppununthala Boys

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ వితరణ: 

 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ రైతు దినోత్సవాన్ని సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంగీత మాట్లాడుతూ రైతు నాయకులు, దేశ 5వ ప్రధాని చరణ్ సింగ్ గారు రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని అందుకే ఆయన పుట్టిన రోజున జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, రైతులు ఎన్నో కష్టనష్టాలను, కన్నీళ్ళను ఎదుర్కొని పంటలు పండించడం ద్వారా మనకు ఆహారం లభిస్తుందని, వారి గొప్ప సేవలు, త్యాగాలు దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ ప్రజల ఆకలి తీర్చడంలో వెలకట్టలేనివని, మా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు అందరూ రైతులే అని వారి కృషి వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నామని అందుకే రైతులను మనందరం గౌరవించాలని, వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టీచర్ విజయ్ కుమార్ సార్ అందించిన గురుకుల మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. సార్ కి కృతజ్ఞతలు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని గురుకుల సీట్లు సాధించాలని కోరారు.

National Mathematics Day 2025 Programme at MPPS Uppununthala Boys

 ఘనంగా జాతీయ గణిత దినోత్సవం: 

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో గొప్ప గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రామానుజన్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు, అనంతరం ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు చందన లు మాట్లాడుతూ రామానుజన్ గారు గణితం పైన మక్కువతో సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, గణిత విశ్లేషణ వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచారు, 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించారు, కానీ 1729 వంటి సంఖ్యల ద్వారా చిరస్మరణీయులయ్యారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల పైనా నేటికీ ఎందరో పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వారి స్పూర్తితో విద్యార్థులు గణితం తో పాటు అన్ని విషయాలు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Saturday, 20 December 2025

International Meditation Day Programme 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవం:

డిసెంబర్ 21 రేపు ఆదివారం కావడంతో ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా మనస్సు ను అదుపు చేయవచ్చు అని, తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది అని, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత ఏర్పడి సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుందని, ప్రశాంతత ఏర్పడుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయాలని తద్వారా ఏకాగ్రత పెరిగి చదువు లో రాణించవచ్చు అని తెలియజేశారు. ధ్యానంతో నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది అని, మన బలాలు, బలహీనతలు తెలుసుకొని, చెడు అలవాట్లు దూరం చేసుకొని మంచి వ్యక్తిగా మారుతారని ఇన్ని ప్రయోజనాలు ఉన్న ధ్యానం ను అందరూ ఆచరించాలని సూచించారు. విద్యార్థులు పాల్గొన్నారు.


 

Nutritious Food Festival at MPPS Uppununthala Boys in the PTM

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా పోషక ఆహారోత్సవం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పిటిఎం) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేయడానికి పోషక ఆహారోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పౌష్టికాహారం అందించాలని, పౌష్టికాహారం అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే పదార్థాలు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. స్థూల పోషకాలు అయిన పిండి పదార్థాలు 60%, మాంసకృత్తులు 15%, క్రొవ్వులు 25% తీసుకోవాలని, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి అని తెలియజేశారు. దీన్నే సమతుల ఆహారంగా చెప్తారు. పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలకు వారానికి మూడు గుడ్లు, రాగి జావ, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు జంక్ ఫుడ్ తినకుండా, ఇంట్లో చేసిన తాజా ఆహారం తీసుకోవాలి అని సూచించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేసుకొని వచ్చిన పోషకాలు కలిగిన, రుచికరమైన వంటకాలను ప్రదర్శించి,వాటి తయారీ విధానం, ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Saturday, 6 December 2025

Babasaheb Dr BR Ambedkar's 69th death anniversary programme at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగీత అంబేద్కర్ గారు విద్యా గొప్ప స్థాయికి ఎదిగిన తీరును, వారు దేశానికి చేసిన సేవలను వివరిస్తూ అంబేద్కర్ గారిని బడిలోకి రానివ్వకున్న గుమ్మం బయట కూర్చోని ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో శ్రద్ధగా చదువుకుని, విదేశాలకు వెళ్ళి ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లలో చదువుకుని ప్రపంచ మేధావిగా ఎదిగి భారత రాజ్యాంగం రాసి అందులో భరత దేశ ప్రజలు అందరూ ఎదిగే విధంగా అందరికీ అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండే విధంగా అవకాశాలను, హక్కులను కల్పించి నా లాంటి కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Thursday, 4 December 2025

Indian Navi Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా భారతదేశ నౌకాదళ దినోత్సవం:

ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అద్యక్షతన భారత దేశ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ భారత దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలైన సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళాల్లో నావికా దళం ప్రధానమైనదని ఇది భారత దేశ తీర ప్రాంతం గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 11 వేల 98 కిలోమీటర్ల మేర దేశాన్ని శత్రు దేశాల నుంచి నిత్యం కాపాడుతుంది అని భారత దేశ పటాన్ని చూపిస్తూ వివరించడం జరిగింది.



పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విజయం సాధించడంలో 1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణ కోసం నావికా దళంలో పనిచేసిన సైనికుల త్యాగాలను గౌరవించాలని సూచించారు. వారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Wednesday, 3 December 2025

World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం:

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.

బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సాధారణ పిల్లలవలె సాధారణ పాఠశాలలో చదువుకునే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు.అనంతరం ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు కడుకుంట్ల రాజవర్ధన్ రెడ్డి మరియు సంగీత , విజయ్ కుమార్ లు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం విద్యాపరంగా కల్పిస్తున్న సౌకర్యాలను మరియు రాయితీల గురించి తెలిపారు. అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్ గారు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మరియు ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు రాజవర్ధన్ రెడ్డి, సంగీత, ఐఈఆర్ పి విజయ్ కుమార్, చందన, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ తిరుపతి, సి ఆర్ పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 2 December 2025

National Pollution Control Day 2025 at MPPS Uppununthala Boys

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఉపాధ్యాయులు & విద్యార్థులు:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు పాఠశాల ప్రహరీ గోడ వెంబడి మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తరగతి వారిగా విద్యార్థులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మూడు రకాల కాలుష్యాలు వాటి నియంత్రణ మార్గాలను విద్యార్థులకు వివరిస్తూ భూమి కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాయు కాలుష్య నివారణకు మొక్కలు పెంచాలని, జల కాలుష్య నివారణకు వ్యర్థ పదార్థాలను నీటిలో కలుపొద్దని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని మనకు అవసరం అయ్యే ఆక్సిజన్ ను ఇస్తాయని, వర్షాలు కురవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయని వివరించారు. అందుకే చెట్లను నరుకొద్దని, వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలియజేశారు. కాలుష్యం నుంచి ప్రకృతి ని రక్షించి భావి తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని, అందరూ పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.



Saturday, 29 November 2025

Spell bee competition conducts on 29/11/2025, Saturday

ఇంగ్లీష్ భాషాభివృద్ధి కోసం స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఆలూరి శ్రీజ గ్రూప్ సభ్యులు బొల్లె చక్రవర్తి, మధనాగుల ప్రవీణ్, మధనాగుల మీనాక్షి, మధనాగుల శ్రుతి, బొల్గం మినీశ్వర్, పాత్కుల ఆర్య మొదటి బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అభినందనలు తెలియజేసి, పెన్సిల్ లు బహుమతిగా అందజేశారు. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Friday, 28 November 2025

Mahathma Jyothi Rao Phule's 135th death anniversary programme at MPPS Uppununthala Boys

 విద్యా వ్యాప్తికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే గారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి కి చదువు నేర్పి, ఆమెతో కలిసి 1848 వ సంవత్సరం నుంచి బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి, ఎన్నో అవమానాలను, అడ్డంకులను, కుట్రలను ఎదుర్కొని విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, వారు 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని, గులాం గిరీ పుస్తకం రచించి అత్యధిక ప్రజలు మానసిక బానిసత్వం నుండి విముక్తి కావాలని అందుకు విద్యను ఆయుధంగా తీసుకోవాలి అన్నారు. వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Tuesday, 25 November 2025

Constitution Day 2025 Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం:

ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి రాజ్యాంగ పీఠిక ను పఠనం చేయడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 2 సం.రాల 11 నెలల 18 రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించడం జరిగిందని, ఇది నవంబర్ 26, 1949 లో ఆమోదించడం జరిగిందని, ఆ సందర్భంగా ఈ రోజు రాజ్రాయాంగం దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు. అదేవిధంగా రాజ్యంగ పీఠిక లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, జాతీయ సమగ్రత పదాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా దేశ పౌరులు అందరూ సమానంగా ఎదిగే విధంగా, సమాన గౌరవం పొందే విధంగా అన్ని రంగాల్లో అందరూ భాగస్వామ్యం అయ్యే విధంగా భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కులు, దేశ భక్తి ని, దేశాభివృద్ధి లో పౌరుల భాద్యతలను తెలిపే ప్రాధమిక విధులను, అందరికీ ఆర్థికంగా, సామాజిక న్యాయం అందించడానికి ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగిందని, ప్రస్తుతం రాజ్యాంగం మొత్తం 470 ఆర్టికల్ లు, 12 షెడ్యూల్, 25 భాగాలుగా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది అని తెలియజేశారు. రాజ్యాంగం స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని హక్కులు ఉపయోగించుకొని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

Monday, 17 November 2025

Dual desks donation to MPPS Uppununthala Boys by Tr. Vijay Kumar sir, BTF state leader

మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల కు  డ్యుయల్ డెస్క్ లు వితరణ:


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలకు బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు టీచర్ విజయ్ కుమార్ గారు రూ. 30 వేల విలువైన డ్యుయల్ డెస్క్ లు అందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ డ్యుయల్ డెస్క్ లు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, తద్వారా విద్యార్థులు పాఠాలను ఆసక్తిగా, శ్రద్ధగా విని నేర్చుకుంటారని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే డ్యుయల్ డెస్క్ లు అందించిన విజయ్ కుమార్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేసి వారిని శాలువాతో సన్మానించారు.

డ్యుయల్ డెస్క్ లు అందించిన విజయ్ కుమార్ సార్ కి సన్మానం

Friday, 14 November 2025

PTM and National Children's Day 2025 celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం & బాల దినోత్సవం: 

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీతలు మాట్లాడుతూ పిల్లలంటే అమితమైన ఇష్టం కలిగిన మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆయన పిల్లలే దేశ భవిష్యత్తు అని పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి సాధించబడుతుందని వారికోసం ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ,వర్కు పుస్తకాలు, కృత్రిమ మేదతో డిజిటల్ తరగతులు మొ.న అంశాలను వివరించారు .

అనంతరం ఆనందకరమైన బాల్యాన్ని అందించడం అనే అంశం పైన చర్చించడం జరిగింది. పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు, నైతిక విలువలు అందించే కథలు అంటే చాలా ఇష్టం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వేచ్ఛపూరిత వాతావరణంలో, భయం లేకుండా ఆనందకరమైన బాల్యాన్ని గడిపిన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఉత్తమ పౌరులుగా తమ బాధ్యతను నిర్వహిస్తారు కాబట్టి వారి బాల్యాన్ని ఆనందకరంగా తీర్చిదిద్ది వారికి భరోసానిస్తూ వారు సంపూర్ణ మూర్తిమత్వ వికాసం పొందే లాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం కృషి చేయాలని సూచించారు. చాచా నెహ్రూ గారి జీవితాన్ని పూర్తిగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 



అనంతరం కేక్ కోసీ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, ఏఏపిసీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు , విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

Tuesday, 11 November 2025

National Education Day Celebrations 2025

 ఘనంగా జాతియ విద్యా దినోత్సవం:

ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, సంగీత లు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి జైలు జీవితం కూడా గడిపారని, స్వాతంత్య్ర భారత దేశంలో మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా 11 సం.రాలు పని చేసి అందరికీ విద్యను అందించడానికి, విద్యా వ్యాప్తికి విశిష్ట సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్య మనిషికి మూడో నేత్రం లాంటిది. ప్రతి వ్యక్తి విద్య ద్వారానే జ్ఞానాన్ని పొందుతాడని, వాస్తవాలను తెలుసుకోవడం, విషయ పరిజ్ఞానం, విలువలు, విజ్ఞానం వల్ల వ్యక్తిలోని అజ్ఞానం, మూఢనమ్మకాలు తొలగిపోయి పరిపూర్ణ వ్యక్తిగా మారుతారని, సమాజాన్ని సరైన విధంగా అవగాహన చేసుకొంటారని, జీవితంలో సౌకర్యవంతమైన గొప్ప స్థాయికి ఎదుగుతారని, సమాజంలో గౌరవం పొందుతారని తెలియజేశారు.

Condolences Programme of great Poet and write Ande Sri 2025

తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ గారికి ఘనమైన నివాళులు:

అందెశ్రీ గారి మృతికి సంతాపంగా ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ముందుగా వారికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 ని.లు విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారని, సమాజంలోని విషయాలు, ప్రకృతిలోని విషయాలపైన ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నో పాటలు రాశారని, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఇటీవల రూ.కోటి పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య, ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట అని, 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వచ్చిందని, 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారని, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్న అందెశ్రీ

ఉదయం 7:25 గం.లకి గాంధీ ఆసుపత్రిలో అమరుడైనారని తెలియజేశారు. ఆయన మన నుంచి భౌతికంగా దూరమైనా ఆయన రచనలు, పాటలు మనల్ని నిత్యం చైతన్యం చేస్తాయని వారి స్పుర్థితో బాగా చదువుకుని, సమాజాన్ని అవగాహన చేసుకొని, భవిష్యత్తులో సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

Wednesday, 15 October 2025

Dr. APJ Abdul Kalam 's 94th birth anniversary celebrations 2025

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమం:

ఈ రోజు ఉదయం 10:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ , చందన, సంగీత లు అబ్దుల్ కలాం గారు మన దేశానికి చేసిన సేవలను గురించి వివరిస్తూ వారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో 1931, అక్టోబర్ 15న జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. తల్లి ఆషియమ్మ గృహిణి వాళ్ళ నాన్న జైనులబ్దీన్ పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లో పనిచేసి, 1980లో ఎస్ఎల్వి 3 ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. దేశ రక్షణ వ్యవస్థకు ఎన్నో మిసైల్ లను అభివృద్ధి చేసి అందించారు. 1998 సం.లో పోక్రాన్ అను పరీక్షలు విజయవంతంగా నిర్వహించి భారత దేశాన్ని రక్షణ రంగంలో పఠిష్ట పరిచారు. 11వ భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. షిల్లాంగ్ లో 2015, జూలై 27న యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన జీవితాంతం దేశానికి సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారు పేద కుటుంబంలో జన్మించినప్పటికి బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగారు కాబట్టి విద్యార్థులు కూడా కలాం గారి స్పూర్తితో బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Friday, 10 October 2025

Uppununthala Complex HM Srinivas Reddy sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించి అభినందించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. స్పోకెన్ ఇంగ్లీష్ ను విద్యార్థులు చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, వారికి తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ఏం రోజు పాఠం ఆ రోజు నేర్చుకోవాలని, నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని, చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను, పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు, విద్యార్థులకు అందిస్తున్న రాగి జావను పరిశీలించారు.

Saturday, 20 September 2025

Parent Teacher Meeting & Bathukamma Celebrations 2025

 

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆకట్టుకున్న పప్పెట్రీ ప్రదర్శన:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ దసరా సెలవుల్లో పిల్లలతో తల్లిదండ్రులు తగిన సమయాన్ని గడపాలని, విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ ఒక గంట చదువుకునేలా చూడాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకునే విధంగా వారికి స్ఫూర్తివంతమైన వ్యక్తుల గురించి, కథలు చెప్పాలని, కుటుంబ విలువల గురించి వివరించాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిర్వహిస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు.ఈ సమావేశంలో విద్యార్థులు ప్రదర్శించిన పప్పెట్రీ ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం విద్యార్థులు వివిధ పూలను సేకరించి బతుకమ్మను పేర్చి , బతుకమ్మ పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Wednesday, 17 September 2025

Telangana People's Governance Day 2025 celebrations at MPPS Uppununthala Boys


Telangana People's Governance Day Celebrations at MPPS Uppununthala Boys. In this occasion Our respected Headmaster Sreenivasulu sir unfurled the national flag. HM and Teachers explained importance of this day including Telangana Armed Struggle and Operation Polo.

Monday, 15 September 2025

Grand welcome and felicitation to venkatesh sir for Successfully completed National Level Educational Training at CCRT Udaipur, Rajasthan State

ఉపాధ్యాయునికిి ఘన స్వాగతం పలికి అభినందించిన ఉపాధ్యాయులు మరియువిద్యార్థులు:

బాలల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గాజుల వెంకటేష్ తెలంగాణ రాష్ట్రం తరపున బెస్ట్ ప్రాక్టీస్ విభాగంలో తెలంగాణ ఎస్సీఈఆర్టీ చేత ఎంపికై రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ సిసిఆర్టీ లో నూతన విద్యా విధానం 2020 లో భాగంగా బోధనను ఆసక్తిగా మార్చుటకు విద్యలో పప్పెట్రి/బొమ్మల పాత్ర అనే అంశము పైన 15 రోజుల పాటు జాతీయ విద్యా శిక్షణా కార్యక్రమానికి హాజరై అక్కడ ఉత్తమ ప్రతిభను కనబరిచి అందరి మన్ననలు పొంది విజయవంతంగా ముగించుకొని తిరిగి ఈ రోజు పాఠశాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ ని విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లు ఘనంగా పూలతో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ 15 రోజుల పాటు పప్పెట్రీ పైన  వెంకటేష్ సార్ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని సురక్షితంగా పాఠశాలకు చేరుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. అక్కడ మీరు నేర్చుకొన్న విషయాలు పాఠశాలలో అమలు పరిచి విద్యార్థుల ప్రగతికి కృషి చేయాలని కోరారు. వెంకటేష్ మాట్లాడుతూ పప్పెట్రీ/బొమ్మలతో బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టడం ద్వారా విద్యార్థులు ఆహ్లాదకరమైన సహజసిద్ధమైన స్వేచ్ఛ పూరిత వాతావరణంలో ఆసక్తిగా, చురుకుగా పాల్గొని భయం లేకుండా బట్టీ పట్టకుండా సులభంగా విషయావగహన చేసుకొంటారని, సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని తెలియజేశారు.

Monday, 25 August 2025

Our School Teacher has been selected for National Level Educational Training

జాతీయ స్థాయి విద్యా శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయున్ని అభినందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు:

 ఈ రోజు ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్, సిసిఆర్టీ లో జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా బోధనను ఆసక్తిగా మార్చుటకు విద్యలో పప్పెట్రి పాత్ర అనే అంశము పైన ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10 వరకు 15 రోజుల పాటు జాతీయ స్థాయి విద్యా శిక్షణకు వెల్లడానికి పాఠశాల నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గాజుల వెంకటేష్ ను పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ జాతీయ విద్యా శిక్షణ కార్యక్రమానికి మా పాఠశాల నుంచి వెంకటేష్ సార్ వెళ్ళడం మాకు గర్వంగా ఉందని తెలియజేశారు. వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ శిక్షణ కార్యక్రమానికి 10 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారని, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారుల సమావేశంలో బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ పైన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నదో వివరిస్తానని, ఇక్కడ అమలు పరుస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు భోధనోపకరణాలతో మరియు ఐసిటి టూల్స్ ఉపయోగించి కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన, కృత్రిమ మేధ/ఏఐ తో డిజిటల్ తరగతులు, 5వ తరగతి గురుకుల ప్రవేశాలకు ప్రత్యేక తరగతులు, ఉచిత ఆన్లైన్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు, ప్రత్యేక దినోత్సవాలు, బాలల సభ, ప్రయోగాలు, పాఠశాలకు వనరులను సమకూర్చడంలో దాతలు, తల్లిదండ్రుల సహకారం, వీటి కోసం సోషల్ మీడియా ను ఉపయోగించడం, పాఠశాల వెబ్సైట్, యూట్యూబ్ చానల్, వాట్సప్ గ్రూపు మొ.న అన్ని అంశాలను జాతీయ స్థాయి వేదికపైన వివరిస్తానని, అదేవిధంగా ఈ శిక్షణలో బోధనను ఆసక్తిగా మార్చుటకు పప్పెట్రీ/బొమ్మల పాత్ర, మెలకువలు, బోధనా పద్ధతుల గురించి తెలుసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు.


Saturday, 23 August 2025

National Space Day Celebrations 2025 - Rocket Experiment at MPPS Uppununthala Boys

ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం - బాటిల్ రాకెట్ ప్రయోగం:



 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2023న చంద్రయాన్ -3 ద్వారా చంద్రుని దక్షిణ ధృవం లో విజయవంతంగా ల్యాండింగ్ కావడానికి గుర్తుగా 2024 సం నుంచి జరుపుకొంటున్నామని, భారత దేశం అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్పగా రాణిస్తుందని, మనం అనుభవిస్తున్న అన్ని ఆధునిక సౌకర్యాల వెనకాల శాస్త్రజ్ఞుల కృషి ఎంతో ఉందని తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు రాకేట్ లతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఎన్నో రంగాల్లో అవి సమాచారాన్ని ఇస్తూ దేశానికి, ప్రజలకు సేవలు అందిస్తున్నవని వివరించారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని, అది 65 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని అందుకే ఏం వస్తువును పైకి విసిరినా అది కిందికి వస్తుందని దీన్ని దాటాలంటే అంతరిక్షంలోకి రాకెట్లను సెకను కు 11.2 కి.మీ వేగంతో పంపించాలన్నారు. ఈ రాకెట్లు న్యూటన్ 3వ నియమం చర్యకు ప్రతిచర్య ఆధారంగా పైకి వెళ్తాయని బాటిల్ రాకెట్ ప్రయోగం ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు బాటిల్ రాకెట్ పైకి వెళ్ళడం చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని విద్యార్థులు ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి నిర్దారణ చేసుకొని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

బాటిల్ రాకెట్ ప్రయోగం:


Friday, 22 August 2025

Students play chess game at MPPS Uppununthala Boys

చదరంగం ఆటతో విద్యార్థుల్లో మేధో వికాసం!

 చదరంగం ఆటతో విద్యార్థుల్లో మేధో వికాసం!

బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాలమూరు ఎఆర్ఐ ఫోరం వారు అందించిన చదరంగం బోర్డులతో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అవగాహన కల్పిస్తూ చదరంగం ఆట పైన ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులు చదరంగం ఆడటం వల్ల వారిలో మేధో వికాసం అభివృద్ధి చెందుతుందని, ఆట నియమాలు తెలుసుకొని, క్రమశిక్షణతో గెలవడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషించడం, ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం, వేగంగా ఖచ్చితత్వంతో ఆలోచించడం, విజయం కోసం ఓపికతో వ్యవహరించడం, గెలుపు ఓటముల ను సమానంగా స్వీకరించడం ద్వారా వారు విద్యలో కూడా రాణిస్తారని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ చదరంగం బోర్డులు అందజేసిన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకులు రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Tuesday, 12 August 2025

Uppununthala MEO Chandra Shekhar sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించి అభినందించిన ఎం.ఈ.వో చంద్రశేఖర్ సార్:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కూడా చెప్పలేని విధంగా ఈ 4,5 తరగతుల విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ను చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, ఈ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నందున మరొక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఎం.ఈ.వో గారిని కోరడం జరిగింది.




Monday, 11 August 2025

National Deworming Day Programme at MPPS Uppununthala Boys

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసిన డాక్టర్ స్వప్న:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైద్య అధికారి స్వప్న గారు కార్యక్రమం ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారము, ఈగలు వాలిన తినుబండారాలు దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన ద్వారా, కాళ్ళకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వ్యాప్తి చెందుతాయి. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా వుండుట వల్ల పిల్లలు అందులో ఆడుకొనుట వల్ల అందులోని నులిపురుగులు వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వలన వ్యాప్తి చెందుతాయి. కావున చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. జంక్ ఫుడ్ తినొద్దని, తాజ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణిస్తారు కాబట్టి ఈ జాగ్రత్తలు విద్యార్థులు అందరూ పాటించాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, హెల్త్ అసిస్టెంట్ డి. శ్రీనివాసులు, ఎ.ఎన్.ఎంలు దేవి, వీణ, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tuesday, 5 August 2025

91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tuesday, 29 July 2025

RBSK team visit and screen all the students and give medicine at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు:

ఈ రోజు ఉదయం 11 గం.లకు రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమంల(RBSK) లో భాగంగా డాక్టర్ మంగ, డాక్టర్ మహేశ్వర్, ఫార్మసిస్ట్ రాజు, ఏ.ఎన్,యం రేణమ్మ లు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల, ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆటలు ఆడాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు అని తెలియజేశారు. వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday, 19 July 2025

Shoes and School Bags free distribution by Maryada Foundation 2025 at MPPS Uppununthala Boys

విద్యార్థులకు బూట్లు & స్కూల్ బ్యాగ్ ల పంపిణీ:


ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు, ఉదయం 11 గం.లకు బాలికల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు మర్యాద ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారు బూట్లు, స్కూల్ బ్యాగ్ లు అతిథులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన మండల నాయకులు అనంత రెడ్డి గారు, ఎం.ఈ.వో చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్యాద రుక్మ రెడ్డి గారు మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. విద్య ద్వారానే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని తాను చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా విద్యార్థులకు 70 వేలతో 166 జతల బూట్లు, 70 స్కూల్ బ్యాగ్ లను ఉచితంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందజేయడం ప్రశంసనీయం అని వారి సేవలను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మర్యాద ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువ నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత రామచంద్ర రెడ్డి, లక్ష్మీ, జయప్రద, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

మర్యాద ఫౌండేషన్ వారు ఉచితంగా పంపిణీ చేసిన బూట్లు & స్కూల్ బ్యాగ్ లతో విద్యార్థులు

మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారిని అతిథులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.

Friday, 11 July 2025

Free Notebooks distribution 2025 at MPPS Uppununthala Boys

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ:


ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. సబ్జెక్టుకు ఒకటి చొప్పున 1వ, 2వ తరగతి విద్యార్థులకు 3 నోటు పుస్తకాలు; 3వ, 4వ మరియు 5వ తరగతి విద్యార్థులకు 4 నోటు పుస్తకాలు  ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉచిత పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా నోటు పుస్తకాలు ఇవ్వడం విద్యాభివృద్ధికి ఎంతో సహాయంగా ఉంటుంది అన్నారు. విద్యార్థులు ఈ నోటు పుస్తకాలలో పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాసి వాటిని నేర్చుకోవాలని సూచించారు. రాయడం అనేది ఒక నైపుణ్యం అని విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను, తమ భావాలను తెలియజేయడానికి అక్షరాలను గుండ్రంగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాయాలని సూచించారు. పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్య మంత్రి, విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తు లో టై, బెల్ట్, బూట్లు, బ్యాగ్ తో సహా అన్ని కలిపి ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Thursday, 10 July 2025

Guru Purnima Celebrations 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ గురుపౌర్ణమి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పౌర్ణమి కి ప్రత్యేకత ఉందని, అజ్ఞానం అనే అంధకారాన్ని, చీకటిని పారద్రోలే పౌర్ణమి రోజు ఉండే నిండు వెన్నెల వెలుతురు జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారని తెలియజేశారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు తదాగత బుద్ధుడు జ్ఞానోదయం పొంది దుఃఖం నివారణ మార్గాన్ని తన ఐదుగురు శిష్యులకు బోధించాడని, దీన్నే ధర్మ చక్ర ప్రవర్తన అంటారని తెలియజేశారు. ఇదే రోజు వేద జ్ఞానాన్ని అందించిన వ్యాసమహర్షి జన్మించారని తెలియజేశారు. ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా జ్ఞానాన్ని పొంది, నైతిక విలువలను తెలుసుకొని, సత్ప్రవర్తనతో మెలిగి సత్కార్యాలు చేసి తాము ఎదుగుతూ, సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జ్ఞానాన్ని అందించిన వారికి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉంటూ వారిని గౌరవించాలన్నారు.


Tuesday, 8 July 2025

Parent Teacher Meeting on Parents as Partners at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం(పి.టి.ఎం) నిర్వహణ: పాఠశాల అభివృద్ధిలో, పిల్లల అభ్యసన అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి!

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ డిజిటల్ లెర్నింగ్ గురించి వివరించారు.

ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం నెలకు ఒక రోజు నిర్వహించే ఈ సమావేశంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొని వారి ప్రగతిని తెలుసుకొని పాఠశాల అభివృద్ధికి, ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల కంటే ఈ పాఠశాలలో బాగా చదవు చెప్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.




Friday, 20 June 2025

11th International Yoga Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ యోగా ప్రత్యేకతను, ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరవని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.