Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Friday, 14 November 2025

PTM and National Children's Day 2025 celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం & బాల దినోత్సవం: 

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీతలు మాట్లాడుతూ పిల్లలంటే అమితమైన ఇష్టం కలిగిన మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆయన పిల్లలే దేశ భవిష్యత్తు అని పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి సాధించబడుతుందని వారికోసం ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ,వర్కు పుస్తకాలు, కృత్రిమ మేదతో డిజిటల్ తరగతులు మొ.న అంశాలను వివరించారు .

అనంతరం ఆనందకరమైన బాల్యాన్ని అందించడం అనే అంశం పైన చర్చించడం జరిగింది. పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు, నైతిక విలువలు అందించే కథలు అంటే చాలా ఇష్టం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వేచ్ఛపూరిత వాతావరణంలో, భయం లేకుండా ఆనందకరమైన బాల్యాన్ని గడిపిన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఉత్తమ పౌరులుగా తమ బాధ్యతను నిర్వహిస్తారు కాబట్టి వారి బాల్యాన్ని ఆనందకరంగా తీర్చిదిద్ది వారికి భరోసానిస్తూ వారు సంపూర్ణ మూర్తిమత్వ వికాసం పొందే లాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం కృషి చేయాలని సూచించారు. చాచా నెహ్రూ గారి జీవితాన్ని పూర్తిగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 



అనంతరం కేక్ కోసీ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, ఏఏపిసీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు , విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

Tuesday, 11 November 2025

National Education Day Celebrations 2025

 ఘనంగా జాతియ విద్యా దినోత్సవం:

ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, సంగీత లు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి జైలు జీవితం కూడా గడిపారని, స్వాతంత్య్ర భారత దేశంలో మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా 11 సం.రాలు పని చేసి అందరికీ విద్యను అందించడానికి, విద్యా వ్యాప్తికి విశిష్ట సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్య మనిషికి మూడో నేత్రం లాంటిది. ప్రతి వ్యక్తి విద్య ద్వారానే జ్ఞానాన్ని పొందుతాడని, వాస్తవాలను తెలుసుకోవడం, విషయ పరిజ్ఞానం, విలువలు, విజ్ఞానం వల్ల వ్యక్తిలోని అజ్ఞానం, మూఢనమ్మకాలు తొలగిపోయి పరిపూర్ణ వ్యక్తిగా మారుతారని, సమాజాన్ని సరైన విధంగా అవగాహన చేసుకొంటారని, జీవితంలో సౌకర్యవంతమైన గొప్ప స్థాయికి ఎదుగుతారని, సమాజంలో గౌరవం పొందుతారని తెలియజేశారు.

Condolences Programme of great Poet and write Ande Sri 2025

తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ గారికి ఘనమైన నివాళులు:

అందెశ్రీ గారి మృతికి సంతాపంగా ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ముందుగా వారికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 ని.లు విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారని, సమాజంలోని విషయాలు, ప్రకృతిలోని విషయాలపైన ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నో పాటలు రాశారని, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఇటీవల రూ.కోటి పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య, ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట అని, 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వచ్చిందని, 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారని, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్న అందెశ్రీ

ఉదయం 7:25 గం.లకి గాంధీ ఆసుపత్రిలో అమరుడైనారని తెలియజేశారు. ఆయన మన నుంచి భౌతికంగా దూరమైనా ఆయన రచనలు, పాటలు మనల్ని నిత్యం చైతన్యం చేస్తాయని వారి స్పుర్థితో బాగా చదువుకుని, సమాజాన్ని అవగాహన చేసుకొని, భవిష్యత్తులో సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

Wednesday, 15 October 2025

Dr. APJ Abdul Kalam 's 94th birth anniversary celebrations 2025

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమం:

ఈ రోజు ఉదయం 10:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ , చందన, సంగీత లు అబ్దుల్ కలాం గారు మన దేశానికి చేసిన సేవలను గురించి వివరిస్తూ వారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో 1931, అక్టోబర్ 15న జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. తల్లి ఆషియమ్మ గృహిణి వాళ్ళ నాన్న జైనులబ్దీన్ పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లో పనిచేసి, 1980లో ఎస్ఎల్వి 3 ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. దేశ రక్షణ వ్యవస్థకు ఎన్నో మిసైల్ లను అభివృద్ధి చేసి అందించారు. 1998 సం.లో పోక్రాన్ అను పరీక్షలు విజయవంతంగా నిర్వహించి భారత దేశాన్ని రక్షణ రంగంలో పఠిష్ట పరిచారు. 11వ భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. షిల్లాంగ్ లో 2015, జూలై 27న యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన జీవితాంతం దేశానికి సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారు పేద కుటుంబంలో జన్మించినప్పటికి బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగారు కాబట్టి విద్యార్థులు కూడా కలాం గారి స్పూర్తితో బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Friday, 10 October 2025

Uppununthala Complex HM Srinivas Reddy sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించి అభినందించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. స్పోకెన్ ఇంగ్లీష్ ను విద్యార్థులు చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, వారికి తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ఏం రోజు పాఠం ఆ రోజు నేర్చుకోవాలని, నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని, చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను, పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు, విద్యార్థులకు అందిస్తున్న రాగి జావను పరిశీలించారు.

Saturday, 20 September 2025

Parent Teacher Meeting & Bathukamma Celebrations 2025

 

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆకట్టుకున్న పప్పెట్రీ ప్రదర్శన:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ దసరా సెలవుల్లో పిల్లలతో తల్లిదండ్రులు తగిన సమయాన్ని గడపాలని, విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ ఒక గంట చదువుకునేలా చూడాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకునే విధంగా వారికి స్ఫూర్తివంతమైన వ్యక్తుల గురించి, కథలు చెప్పాలని, కుటుంబ విలువల గురించి వివరించాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిర్వహిస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు.ఈ సమావేశంలో విద్యార్థులు ప్రదర్శించిన పప్పెట్రీ ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం విద్యార్థులు వివిధ పూలను సేకరించి బతుకమ్మను పేర్చి , బతుకమ్మ పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Wednesday, 17 September 2025

Telangana People's Governance Day 2025 celebrations at MPPS Uppununthala Boys


Telangana People's Governance Day Celebrations at MPPS Uppununthala Boys. In this occasion Our respected Headmaster Sreenivasulu sir unfurled the national flag. HM and Teachers explained importance of this day including Telangana Armed Struggle and Operation Polo.

Monday, 15 September 2025

Grand welcome and felicitation to venkatesh sir for Successfully completed National Level Educational Training at CCRT Udaipur, Rajasthan State

ఉపాధ్యాయునికిి ఘన స్వాగతం పలికి అభినందించిన ఉపాధ్యాయులు మరియువిద్యార్థులు:

బాలల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గాజుల వెంకటేష్ తెలంగాణ రాష్ట్రం తరపున బెస్ట్ ప్రాక్టీస్ విభాగంలో తెలంగాణ ఎస్సీఈఆర్టీ చేత ఎంపికై రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ సిసిఆర్టీ లో నూతన విద్యా విధానం 2020 లో భాగంగా బోధనను ఆసక్తిగా మార్చుటకు విద్యలో పప్పెట్రి/బొమ్మల పాత్ర అనే అంశము పైన 15 రోజుల పాటు జాతీయ విద్యా శిక్షణా కార్యక్రమానికి హాజరై అక్కడ ఉత్తమ ప్రతిభను కనబరిచి అందరి మన్ననలు పొంది విజయవంతంగా ముగించుకొని తిరిగి ఈ రోజు పాఠశాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ ని విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లు ఘనంగా పూలతో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ 15 రోజుల పాటు పప్పెట్రీ పైన  వెంకటేష్ సార్ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని సురక్షితంగా పాఠశాలకు చేరుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. అక్కడ మీరు నేర్చుకొన్న విషయాలు పాఠశాలలో అమలు పరిచి విద్యార్థుల ప్రగతికి కృషి చేయాలని కోరారు. వెంకటేష్ మాట్లాడుతూ పప్పెట్రీ/బొమ్మలతో బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టడం ద్వారా విద్యార్థులు ఆహ్లాదకరమైన సహజసిద్ధమైన స్వేచ్ఛ పూరిత వాతావరణంలో ఆసక్తిగా, చురుకుగా పాల్గొని భయం లేకుండా బట్టీ పట్టకుండా సులభంగా విషయావగహన చేసుకొంటారని, సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని తెలియజేశారు.

Monday, 25 August 2025

Our School Teacher has been selected for National Level Educational Training

జాతీయ స్థాయి విద్యా శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయున్ని అభినందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు:

 ఈ రోజు ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్, సిసిఆర్టీ లో జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా బోధనను ఆసక్తిగా మార్చుటకు విద్యలో పప్పెట్రి పాత్ర అనే అంశము పైన ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10 వరకు 15 రోజుల పాటు జాతీయ స్థాయి విద్యా శిక్షణకు వెల్లడానికి పాఠశాల నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గాజుల వెంకటేష్ ను పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ జాతీయ విద్యా శిక్షణ కార్యక్రమానికి మా పాఠశాల నుంచి వెంకటేష్ సార్ వెళ్ళడం మాకు గర్వంగా ఉందని తెలియజేశారు. వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ శిక్షణ కార్యక్రమానికి 10 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారని, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారుల సమావేశంలో బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ పైన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నదో వివరిస్తానని, ఇక్కడ అమలు పరుస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు భోధనోపకరణాలతో మరియు ఐసిటి టూల్స్ ఉపయోగించి కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన, కృత్రిమ మేధ/ఏఐ తో డిజిటల్ తరగతులు, 5వ తరగతి గురుకుల ప్రవేశాలకు ప్రత్యేక తరగతులు, ఉచిత ఆన్లైన్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు, ప్రత్యేక దినోత్సవాలు, బాలల సభ, ప్రయోగాలు, పాఠశాలకు వనరులను సమకూర్చడంలో దాతలు, తల్లిదండ్రుల సహకారం, వీటి కోసం సోషల్ మీడియా ను ఉపయోగించడం, పాఠశాల వెబ్సైట్, యూట్యూబ్ చానల్, వాట్సప్ గ్రూపు మొ.న అన్ని అంశాలను జాతీయ స్థాయి వేదికపైన వివరిస్తానని, అదేవిధంగా ఈ శిక్షణలో బోధనను ఆసక్తిగా మార్చుటకు పప్పెట్రీ/బొమ్మల పాత్ర, మెలకువలు, బోధనా పద్ధతుల గురించి తెలుసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు.


Saturday, 23 August 2025

National Space Day Celebrations 2025 - Rocket Experiment at MPPS Uppununthala Boys

ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం - బాటిల్ రాకెట్ ప్రయోగం:



 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2023న చంద్రయాన్ -3 ద్వారా చంద్రుని దక్షిణ ధృవం లో విజయవంతంగా ల్యాండింగ్ కావడానికి గుర్తుగా 2024 సం నుంచి జరుపుకొంటున్నామని, భారత దేశం అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్పగా రాణిస్తుందని, మనం అనుభవిస్తున్న అన్ని ఆధునిక సౌకర్యాల వెనకాల శాస్త్రజ్ఞుల కృషి ఎంతో ఉందని తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు రాకేట్ లతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఎన్నో రంగాల్లో అవి సమాచారాన్ని ఇస్తూ దేశానికి, ప్రజలకు సేవలు అందిస్తున్నవని వివరించారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని, అది 65 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని అందుకే ఏం వస్తువును పైకి విసిరినా అది కిందికి వస్తుందని దీన్ని దాటాలంటే అంతరిక్షంలోకి రాకెట్లను సెకను కు 11.2 కి.మీ వేగంతో పంపించాలన్నారు. ఈ రాకెట్లు న్యూటన్ 3వ నియమం చర్యకు ప్రతిచర్య ఆధారంగా పైకి వెళ్తాయని బాటిల్ రాకెట్ ప్రయోగం ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు బాటిల్ రాకెట్ పైకి వెళ్ళడం చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని విద్యార్థులు ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి నిర్దారణ చేసుకొని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

బాటిల్ రాకెట్ ప్రయోగం:


Friday, 22 August 2025

Students play chess game at MPPS Uppununthala Boys

చదరంగం ఆటతో విద్యార్థుల్లో మేధో వికాసం!

 చదరంగం ఆటతో విద్యార్థుల్లో మేధో వికాసం!

బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాలమూరు ఎఆర్ఐ ఫోరం వారు అందించిన చదరంగం బోర్డులతో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అవగాహన కల్పిస్తూ చదరంగం ఆట పైన ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులు చదరంగం ఆడటం వల్ల వారిలో మేధో వికాసం అభివృద్ధి చెందుతుందని, ఆట నియమాలు తెలుసుకొని, క్రమశిక్షణతో గెలవడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషించడం, ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం, వేగంగా ఖచ్చితత్వంతో ఆలోచించడం, విజయం కోసం ఓపికతో వ్యవహరించడం, గెలుపు ఓటముల ను సమానంగా స్వీకరించడం ద్వారా వారు విద్యలో కూడా రాణిస్తారని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ చదరంగం బోర్డులు అందజేసిన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకులు రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Tuesday, 12 August 2025

Uppununthala MEO Chandra Shekhar sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించి అభినందించిన ఎం.ఈ.వో చంద్రశేఖర్ సార్:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కూడా చెప్పలేని విధంగా ఈ 4,5 తరగతుల విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ను చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, ఈ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నందున మరొక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఎం.ఈ.వో గారిని కోరడం జరిగింది.




Monday, 11 August 2025

National Deworming Day Programme at MPPS Uppununthala Boys

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసిన డాక్టర్ స్వప్న:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైద్య అధికారి స్వప్న గారు కార్యక్రమం ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారము, ఈగలు వాలిన తినుబండారాలు దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన ద్వారా, కాళ్ళకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వ్యాప్తి చెందుతాయి. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా వుండుట వల్ల పిల్లలు అందులో ఆడుకొనుట వల్ల అందులోని నులిపురుగులు వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వలన వ్యాప్తి చెందుతాయి. కావున చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. జంక్ ఫుడ్ తినొద్దని, తాజ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణిస్తారు కాబట్టి ఈ జాగ్రత్తలు విద్యార్థులు అందరూ పాటించాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, హెల్త్ అసిస్టెంట్ డి. శ్రీనివాసులు, ఎ.ఎన్.ఎంలు దేవి, వీణ, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tuesday, 5 August 2025

91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Tuesday, 29 July 2025

RBSK team visit and screen all the students and give medicine at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు:

ఈ రోజు ఉదయం 11 గం.లకు రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమంల(RBSK) లో భాగంగా డాక్టర్ మంగ, డాక్టర్ మహేశ్వర్, ఫార్మసిస్ట్ రాజు, ఏ.ఎన్,యం రేణమ్మ లు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల, ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆటలు ఆడాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు అని తెలియజేశారు. వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday, 19 July 2025

Shoes and School Bags free distribution by Maryada Foundation 2025 at MPPS Uppununthala Boys

విద్యార్థులకు బూట్లు & స్కూల్ బ్యాగ్ ల పంపిణీ:


ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు, ఉదయం 11 గం.లకు బాలికల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు మర్యాద ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారు బూట్లు, స్కూల్ బ్యాగ్ లు అతిథులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన మండల నాయకులు అనంత రెడ్డి గారు, ఎం.ఈ.వో చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్యాద రుక్మ రెడ్డి గారు మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. విద్య ద్వారానే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని తాను చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా విద్యార్థులకు 70 వేలతో 166 జతల బూట్లు, 70 స్కూల్ బ్యాగ్ లను ఉచితంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందజేయడం ప్రశంసనీయం అని వారి సేవలను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మర్యాద ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువ నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత రామచంద్ర రెడ్డి, లక్ష్మీ, జయప్రద, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

మర్యాద ఫౌండేషన్ వారు ఉచితంగా పంపిణీ చేసిన బూట్లు & స్కూల్ బ్యాగ్ లతో విద్యార్థులు

మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారిని అతిథులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.

Friday, 11 July 2025

Free Notebooks distribution 2025 at MPPS Uppununthala Boys

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ:


ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. సబ్జెక్టుకు ఒకటి చొప్పున 1వ, 2వ తరగతి విద్యార్థులకు 3 నోటు పుస్తకాలు; 3వ, 4వ మరియు 5వ తరగతి విద్యార్థులకు 4 నోటు పుస్తకాలు  ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉచిత పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా నోటు పుస్తకాలు ఇవ్వడం విద్యాభివృద్ధికి ఎంతో సహాయంగా ఉంటుంది అన్నారు. విద్యార్థులు ఈ నోటు పుస్తకాలలో పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాసి వాటిని నేర్చుకోవాలని సూచించారు. రాయడం అనేది ఒక నైపుణ్యం అని విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను, తమ భావాలను తెలియజేయడానికి అక్షరాలను గుండ్రంగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాయాలని సూచించారు. పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్య మంత్రి, విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తు లో టై, బెల్ట్, బూట్లు, బ్యాగ్ తో సహా అన్ని కలిపి ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Thursday, 10 July 2025

Guru Purnima Celebrations 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ గురుపౌర్ణమి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పౌర్ణమి కి ప్రత్యేకత ఉందని, అజ్ఞానం అనే అంధకారాన్ని, చీకటిని పారద్రోలే పౌర్ణమి రోజు ఉండే నిండు వెన్నెల వెలుతురు జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారని తెలియజేశారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు తదాగత బుద్ధుడు జ్ఞానోదయం పొంది దుఃఖం నివారణ మార్గాన్ని తన ఐదుగురు శిష్యులకు బోధించాడని, దీన్నే ధర్మ చక్ర ప్రవర్తన అంటారని తెలియజేశారు. ఇదే రోజు వేద జ్ఞానాన్ని అందించిన వ్యాసమహర్షి జన్మించారని తెలియజేశారు. ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా జ్ఞానాన్ని పొంది, నైతిక విలువలను తెలుసుకొని, సత్ప్రవర్తనతో మెలిగి సత్కార్యాలు చేసి తాము ఎదుగుతూ, సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జ్ఞానాన్ని అందించిన వారికి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉంటూ వారిని గౌరవించాలన్నారు.


Tuesday, 8 July 2025

Parent Teacher Meeting on Parents as Partners at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం(పి.టి.ఎం) నిర్వహణ: పాఠశాల అభివృద్ధిలో, పిల్లల అభ్యసన అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి!

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ డిజిటల్ లెర్నింగ్ గురించి వివరించారు.

ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం నెలకు ఒక రోజు నిర్వహించే ఈ సమావేశంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొని వారి ప్రగతిని తెలుసుకొని పాఠశాల అభివృద్ధికి, ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల కంటే ఈ పాఠశాలలో బాగా చదవు చెప్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.




Friday, 20 June 2025

11th International Yoga Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ యోగా ప్రత్యేకతను, ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరవని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.

Thursday, 19 June 2025

Sports Day Celebrations at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహణ: 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు , ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన సంగీత లు మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు  కాబట్టి పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు కాబట్టి వారిని ఆడుకోనివ్వాలన్నారు.



Wednesday, 18 June 2025

Awareness programme on AI based digital classes at MPPS Uppununthala Boys

ఏఐ ఆధారిత డిజిటల్ తరగతుల పైన అవగాహన:

 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మధ్యాహ్నం 2 గం.లకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏఐ ఆధారిత డిజిటల్ తరగతుల పైన అవగాహన కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ట్యాబ్ ద్వారా ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ వెబ్సైట్ లో విద్యార్థులు తమ యొక్క పెన్ నెంబర్ ను ఎంటర్ చేసి ఏ విధంగా లాగిన్ కావాలి, తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం లకు సంబంధించిన అసెస్మెంట్ ఎలా పూర్తి చేయాలి, అసెస్మెంట్ పూర్తి చేసిన అనంతరం విద్యార్థుల స్థాయిని ఈ ఏఐ నిర్ధారించి వారికి అనుగుణమైన అభ్యసన కృత్యాలను, వీడియో పాఠాలను అందజేస్తుందని, వీటిని పూర్తి చేయడం ద్వారా విద్యార్థులు అభ్యసనం లో ప్రగతి సాధిస్తారని వివరించడం జరిగింది. అదేవిధంగా జాలి ఫోనిక్స్ యాప్ ద్వారా విద్యార్థులు ఇంగ్లీష్ లో రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, నెంబర్ కిడ్స్, మ్యాత్ కిడ్స్, మ్యాత్ గేమ్స్ యాప్ ల ద్వారా గణిత భావనలు సంఖ్యలు, వాటిని పోల్చడం, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం మొ.నవి ఎలా నేర్చుకోవాలి, పాఠ్య పుస్తకాలలో ఉన్న క్యూఆర్ కోడ్ ల ఆధారంగా డిజిటల్ తరగతులు ఎలా చూడాలి అనేది విద్యార్థులకు వివరించడం జరిగింది. సాంకేతికతను విద్యా రంగంలో, బోధనలో ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లు విద్యార్థులకు తెలియజేశారు.


Monday, 16 June 2025

FLN Quiz has been conducted at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme 2025

విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ - విజేతలు బహుమతులు:

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ లో విద్యార్థులను ఐదు గ్రూపులుగా చేసి  తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. విద్యార్థులందరూ ఈ క్విజ్ లో చాలా ఆసక్తిగా, చురుకుగా పాల్గొని సమాధానాలు చెప్పారు. ఈ క్విజ్ లో ఎక్కువ పాయింట్లు సాధించిన గ్రూపు సభ్యులు యశ్వంత్, అశ్విని, భాను ప్రసాద్, అఖిల్, మనస్వి, శ్రవణ్ కుమార్ లకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెన్నులు బహుమతులుగా అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఈ క్విజ్ ల ద్వారా విద్యార్థుల్లో గెలవాలనే పోటీతత్వం, పట్టుదల, విషయ పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి, సమిష్టి కృషి మొదలైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మిగతా విద్యార్థులు తర్వాత చేపట్టబోయే క్విజ్ లో విజయం సాధించేలా బాగా చదవాలని సూచించారు.

Friday, 13 June 2025

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం 2025

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆద్వర్యంలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ అక్షరాలు అనేవి ఏ భాషకైనా ప్రాథమికమైనవని, అక్షరాలతో పదాలు, వాక్యాలు, పేరాలు తయారు అవుతాయని అందుకే విద్యార్థులకు అక్షరాలను, వాటి శబ్దాలను అర్థవంతమైన కృత్యాధార పద్దతిలో ఆట పాటలతో నేర్పిస్తున్నామని, చదవడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని, రాయడం ద్వారా భావ వ్యక్తీకరణ చేయొచ్చని, విద్య మనిషిని మహోన్నతుడిని చేస్తుందన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువజన నాయకులు మేడమోని భాస్కర్, మాజీ యంపిటిసి పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థులకు పలకలు అందించిన ఆలూరి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు చెవ్వ పద్మ, విద్యార్థుల తల్లిదండ్రులు బాజ కోటేశు, మస్కూరి మల్లేష్, పాత్కుల కొండలు, సున్నం కుర్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.



Thursday, 12 June 2025

Welcoming students on reopening day in Grand PTM in the part of Pro Jayashankar Badi Bata programme 2025

పాఠశాల పునః ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు & విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ:

ఈ రోజు ఉదయం 9 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాఠశాల పునః ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించడం జరిగింది, విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బడి ఈడు పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడం గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో అర్థవంతమైన కృత్యాధార భోధనతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. అతిథులుగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని అందుకు నిదర్శనం 49 గురుకుల సీట్లు సాధించడమే అన్నారు. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 10 June 2025

Huge response for Door to door campaign for enrollment of school age children in our school MPPS Uppununthala Boys

ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన:

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, ఇప్పటివరకు 49 గురుకుల సీట్లు సాధించడం, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, వెంకటేష్ సార్ బాబు ఇదే పాఠశాలలో చదువుతుండటం, FLN విధానంలో ఎస్సీఈఆర్టీ వారు రూపొందించిన పాఠ్య ప్రణాళికల ఆధారంగా బోధనోపకరణాలతో ఐదు రోజులు అర్థవంతమైన బోధన, ఒక రోజు మదింపు, ప్రతి రోజూ వర్క్ బుక్ అభ్యాసం, అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల, క్విజ్, స్పెల్ బీ కాంపిటీషన్స్, నో బ్యాగ్ డే, ప్రతి నెల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలు, ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈ రోజు 20 మంది విద్యార్థులతో ఇప్పటి వరకు మొత్తం 80 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. ఈ ప్రచారంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, 9 June 2025

Door to door campaign for enrollment of school age children in the part of Badi Bata programme 2025-26

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారం: అన్ని ప్రభుత్వ బడిలో ఉండగా-ప్రైవేటు బడికి ఎందుకు దండుగా

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణలింగమయ్య గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈ రోజు 25 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది. ఈ ప్రచారంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Pro Jayashankar Badi bata programme at fields 2025 for enrollment of school age children

పంట పొలాలకి వెళ్ళి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్:

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఏఐ ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి మీ పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. ఈ రోజు 15 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది.అనంతరం గాజుల వెంకటేష్ సమీప పంట పొలాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడి మా బాబు రాహుల్ ఈ బడిలోనే చదువుతున్నాడని, మీ పిల్లలను కూడా మన బడిలో చేర్పించాలని కోరడం జరిగింది.ఉపాధ్యాయులు చందన, సంగీత, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Saturday, 7 June 2025

Door to Door survey in the part of Pro Jayashankar Badi Bata programme at Uppununthala

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఆద్వర్యంలో బడి బాట కార్యక్రమం: 20 మంది విద్యార్థులు చేరిక
ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. ఈ రోజు 20 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది. ఈ సర్వే లో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Friday, 6 June 2025

Grama Sabha at Uppununthala on the occasion of Pro Jayashankar Badi Bata programme







ఈ రోజు ఉదయం 9 గం.లకు ఉప్పునుంతల మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి నారుమోళ్ళ వెంకటేష్ గారి ఆద్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి సంవత్సరం విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలను గ్రామ ప్రజలకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల రాజస్వ ప్రధానోపాధ్యాయులు& కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి సార్ వివరిస్తూ గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మన పాఠశాల నుంచి 563 మార్కులతో ఎ.నందిని మండలంలో మొదటి ర్యాంకు సాధించిందని, 25 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారని, 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్ లు, సుదీర్ఘ అనుభవం కలిగిన, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, 2 జతల ఏకరూప దుస్తులు, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు. బాలికల ప్రాథమిక పాఠశాల ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ సార్, బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు భోధనోపకరణాలతో, కంప్యూటర్, ప్రొజెక్టర్, ట్యాబ్ , కృత్రిమ మేధాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన చేస్తున్నామని, కంప్యూటర్ విద్యను, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని తెలియజేశారు. బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు హాజరైన వారందరితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని బడిబాట ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, యువకులు ఆలూరి వెంకటేష్ లు మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారని విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం అన్నారు. పంచాయతీ కార్యదర్శి పాఠశాలల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Wednesday, 4 June 2025

Felicitation on Selection of Best Practices School MPPS Uppununthala Boys

బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక: ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ ఉపాధ్యాయుల కు సన్మానం 

 తెలంగాణ ఎస్సీఈఆర్టీ వారు బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలల ఎంపిక కోసం గత నెలలో ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మొత్తం 78 పాఠశాలల వారు దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గారి నేతృత్వంలోని కమిటీ 3 పాఠశాలలోను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేసి ఎస్సీఈఆర్టీ వారికి పంపించడం జరుగింది. అందులో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక కావడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో, ఐసిటీ తో అర్థవంతమైన బోధన చేయడం, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందించడంతో ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారు, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల కృషిని తెలుసుకుని దాతలు ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ లు, స్టడీ మెటీరియల్, స్కూల్ బ్యాగ్ లు మొదలైనవి అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ తన పిల్లలను ఇదే పాఠశాలలో చదివించడం. ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను గత ఏడు సంవత్సరాల్లో 20 నుంచి 73 కి పెంచడం జరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ పాఠశాలను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేశారు. ఈ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ రేపు హైదరాబాద్ లో జరిగే ఎం.ఇ.వో ల సమావేశంలో పాఠశాల అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షఫ్రోద్దీన్ గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, మండల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు మరియు సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ లను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి అభినందించారు.

12th state formation day of Telangana celebrations at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం:

ఈరోజు జూన్ 2న ఉదయం 8:45 ని.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీళ్ళు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ వివరిస్తూ సకల జనులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేదావులు, కవులు, కళాకారులు, రచయితలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. శ్రీకాంత చారి లాంటి ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 న ఏర్పాటు కావడం జరిగింది. 12 సం.రాల స్వరాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Thursday, 29 May 2025

PTM conducts in the part of advance Badi Baata programme on 30th May 2025

ప్రభుత్వ బడులల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన బోధన: 

ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు మర్రిపల్లి రోడ్డు కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన, యువకుల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటిపడే విధంగా ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ను ఇంగ్లీష్ ల్యాబ్ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు అనంత రెడ్డి గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన అందిస్తున్నారని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యను బోధిస్తున్నారని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికవ్వడం చాలా అభినందనీయం అని ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు బొల్లె లక్ష్మయ్య గారు, గ్రామం అధ్యక్షులు పాత్కుల కురుమయ్య గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు తన కుమారున్ని ఇదే పాఠశాలలో చదివిస్తుండటం ఆదర్శమని, మేము కూడా ఈ సంవత్సరం నుంచి మా పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తామని, గ్రామంలోని ప్రజలు అందరు కూడా తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు శ్యాం సుందర్ గౌడ్, శ్రీనివాసులు, విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ యం.పి.టి.సి సభ్యులు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, శివాజీ యూత్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్, బొల్లె పర్వతాలు, ప్రభాకర్, సుధాకర్, విద్యార్థులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 25 May 2025

PTM conducts in the part of advance Badi Bata on 25th May 2015

 ప్రభుత్వ బడులల్లో ఏఐ & టి.ఎల్.యం తో బోధన: 

ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు దుకాణ సముదాయ కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన, మహిళా సంఘాల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి కృత్రిమ మేధా (AI) ఆధారంగా విద్యాబోధన నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇంగ్లీషు మీడియంలో బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన చేస్తున్నామని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని మహిళా సంఘాలను, పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, విద్య ద్వారానే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు తన కుమారున్ని ఇదే పాఠశాలలో చదివిస్తున్నారని, కాబట్టి మన గ్రామంలోని ప్రజలు అందరు కూడా తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పద్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.