Wednesday, 3 December 2025

World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం:

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.

బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సాధారణ పిల్లలవలె సాధారణ పాఠశాలలో చదువుకునే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు.అనంతరం ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు కడుకుంట్ల రాజవర్ధన్ రెడ్డి మరియు సంగీత , విజయ్ కుమార్ లు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం విద్యాపరంగా కల్పిస్తున్న సౌకర్యాలను మరియు రాయితీల గురించి తెలిపారు. అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్ గారు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మరియు ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు రాజవర్ధన్ రెడ్డి, సంగీత, ఐఈఆర్ పి విజయ్ కుమార్, చందన, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ తిరుపతి, సి ఆర్ పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment