Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Celebrations. Show all posts
Showing posts with label Celebrations. Show all posts

Saturday, 23 August 2025

National Space Day Celebrations 2025 - Rocket Experiment at MPPS Uppununthala Boys

ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం - బాటిల్ రాకెట్ ప్రయోగం:



 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2023న చంద్రయాన్ -3 ద్వారా చంద్రుని దక్షిణ ధృవం లో విజయవంతంగా ల్యాండింగ్ కావడానికి గుర్తుగా 2024 సం నుంచి జరుపుకొంటున్నామని, భారత దేశం అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్పగా రాణిస్తుందని, మనం అనుభవిస్తున్న అన్ని ఆధునిక సౌకర్యాల వెనకాల శాస్త్రజ్ఞుల కృషి ఎంతో ఉందని తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు రాకేట్ లతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఎన్నో రంగాల్లో అవి సమాచారాన్ని ఇస్తూ దేశానికి, ప్రజలకు సేవలు అందిస్తున్నవని వివరించారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని, అది 65 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని అందుకే ఏం వస్తువును పైకి విసిరినా అది కిందికి వస్తుందని దీన్ని దాటాలంటే అంతరిక్షంలోకి రాకెట్లను సెకను కు 11.2 కి.మీ వేగంతో పంపించాలన్నారు. ఈ రాకెట్లు న్యూటన్ 3వ నియమం చర్యకు ప్రతిచర్య ఆధారంగా పైకి వెళ్తాయని బాటిల్ రాకెట్ ప్రయోగం ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు బాటిల్ రాకెట్ పైకి వెళ్ళడం చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని విద్యార్థులు ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి నిర్దారణ చేసుకొని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

బాటిల్ రాకెట్ ప్రయోగం:


Tuesday, 5 August 2025

91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Thursday, 10 July 2025

Guru Purnima Celebrations 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ గురుపౌర్ణమి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పౌర్ణమి కి ప్రత్యేకత ఉందని, అజ్ఞానం అనే అంధకారాన్ని, చీకటిని పారద్రోలే పౌర్ణమి రోజు ఉండే నిండు వెన్నెల వెలుతురు జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారని తెలియజేశారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు తదాగత బుద్ధుడు జ్ఞానోదయం పొంది దుఃఖం నివారణ మార్గాన్ని తన ఐదుగురు శిష్యులకు బోధించాడని, దీన్నే ధర్మ చక్ర ప్రవర్తన అంటారని తెలియజేశారు. ఇదే రోజు వేద జ్ఞానాన్ని అందించిన వ్యాసమహర్షి జన్మించారని తెలియజేశారు. ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా జ్ఞానాన్ని పొంది, నైతిక విలువలను తెలుసుకొని, సత్ప్రవర్తనతో మెలిగి సత్కార్యాలు చేసి తాము ఎదుగుతూ, సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జ్ఞానాన్ని అందించిన వారికి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉంటూ వారిని గౌరవించాలన్నారు.


Friday, 20 June 2025

11th International Yoga Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ యోగా ప్రత్యేకతను, ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరవని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.

Thursday, 19 June 2025

Sports Day Celebrations at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహణ: 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు , ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన సంగీత లు మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు  కాబట్టి పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు కాబట్టి వారిని ఆడుకోనివ్వాలన్నారు.



Wednesday, 4 June 2025

Felicitation on Selection of Best Practices School MPPS Uppununthala Boys

బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక: ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ ఉపాధ్యాయుల కు సన్మానం 

 తెలంగాణ ఎస్సీఈఆర్టీ వారు బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలల ఎంపిక కోసం గత నెలలో ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మొత్తం 78 పాఠశాలల వారు దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గారి నేతృత్వంలోని కమిటీ 3 పాఠశాలలోను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేసి ఎస్సీఈఆర్టీ వారికి పంపించడం జరుగింది. అందులో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక కావడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో, ఐసిటీ తో అర్థవంతమైన బోధన చేయడం, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందించడంతో ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారు, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల కృషిని తెలుసుకుని దాతలు ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ లు, స్టడీ మెటీరియల్, స్కూల్ బ్యాగ్ లు మొదలైనవి అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ తన పిల్లలను ఇదే పాఠశాలలో చదివించడం. ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను గత ఏడు సంవత్సరాల్లో 20 నుంచి 73 కి పెంచడం జరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ పాఠశాలను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేశారు. ఈ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ రేపు హైదరాబాద్ లో జరిగే ఎం.ఇ.వో ల సమావేశంలో పాఠశాల అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షఫ్రోద్దీన్ గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, మండల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు మరియు సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ లను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి అభినందించారు.

12th state formation day of Telangana celebrations at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం:

ఈరోజు జూన్ 2న ఉదయం 8:45 ని.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీళ్ళు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ వివరిస్తూ సకల జనులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేదావులు, కవులు, కళాకారులు, రచయితలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. శ్రీకాంత చారి లాంటి ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 న ఏర్పాటు కావడం జరిగింది. 12 సం.రాల స్వరాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Tuesday, 22 April 2025

Annual Day Celebrations 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా వార్షిక దినోత్సవం:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.



ఈ సమావేశానికి అతిథులుగా మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, గ్రామ పెద్దలు అనంత రెడ్డి గారు, మండల పరిషత్ అధికారి నారాయణ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, ఎల్.ఎఫ్.ఎల్. హెచ్.ఎం బిచ్యనాయక్ గారు, సన్మాన దాత పాత్కుల రామ్ చంద్రయ్య గారు, జ్ఞాపికల దాత ఎదురిశెట్టి మల్లేష్ గారు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముందుగా అతిథులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ గారు, చందన గారు, సంగీత గారు మహనీయుల చిత్ర పటాలకు పూల దండలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న విషయాలు, గురుకుల సీట్లు సాధించడానికి చేసిన కృషిని, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని, మిత్రులతో, ఉపాధ్యాయులతో వారికున్న అనుభూతులను పంచుకున్నారు. తరువాత ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను తెలియచేస్తూ ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, ఇప్పటి వరకు గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 48 గురుకుల సీట్లు విద్యార్థులు సాధించారని, వారికి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమంలో 1 నుంచి 5వ తరగతి వరకు కృత్యాధార పద్దతిలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. మన ఊరి పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. తర్వాత ఉపాధ్యాయులు వెంకటేష్ గారు మాట్లాడుతూ దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పాఠశాలకు కావాల్సిన వనరులు సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, నా రెండవ కుమారుడు రాహుల్ ని కూడా ఇదే పాఠశాలలో చదివిస్తున్నానని, ఇక్కడ సుదీర్ఘ అనుభవం, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛ పూరిత వాతావరణంలో బోధనోపకరణాలతో అర్థవంతంగా బోధించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గ్రామ విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.

అనంతరం అతిథులు గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆలూరి అక్షర, బొల్లె తన్వి, ఎదురిశెట్టి కీర్తన, ఇప్పటి భవ్య శ్రీ, ఆలూరి పూజిత, ఎదురిశెట్టి వరుణ్ తేజ్, బొల్గం మహేందర్ గౌడ్, జిల్లెల శివ లను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందచేశారు, అదేవిధంగా వార్షిక పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1వ తరగతి విద్యార్థులు మధనాగుల ప్రతిభ, మేకల భాను, 2వ తరగతి విద్యార్థులు బొల్లె చక్రవర్తి, బాజ లాస్య, పొట్టల అనన్య, 3వ తరగతి విద్యార్థులు బొడ్డుపల్లి యశ్వంత్, మధనాగుల అలేఖ్య, 4వ తరగతి విద్యార్థులు ఆలూరి శ్రీజ, సదగొండ రమేష్, 5వ తరగతి విద్యార్థులు బింగి సైదులు, మధనాగుల దివ్య లకు ఉత్తమ విద్యార్థి అవార్డులుగా జ్ఞాపికలను అందచేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించి సుమారు 50 మంది విద్యార్థులను గురుకులాలకు పంపించడం చాలా గొప్ప విషయమని, దానికి కృషి చేసిన ఉపాధ్యాయులు లను అభినందించడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను, అతిథులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల విద్యా ప్రగతికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.

అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.



ఈ కార్యక్రమంలో పాత్కుల నిరంజన్ గారు, రామలింగయ్య గారు, ఉపాధ్యాయులు కలమండల శ్రీనివాసులు గారు, వందేమాతరం ఫౌండేషన్ రజిత గారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, ఆలూరి పరమేశ్వర్ గారు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 10 April 2025

Mahatma Jyoti Rao Phule's 198th Birth Anniversary Celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి: 

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 198వ జయంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు జ్యోతిరావు ఫూలే గారి గురించి విద్యార్థులకు వివరిస్తూ వారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి ఫూలేతో కలిసి 1848 వ సంవత్సరంలో బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని వారి సేవలను కొనియాడారు. వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Saturday, 1 March 2025

Self Government Day 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠశాల విధులు నిర్వహించారు. కలెక్టర్ గా తన్వి, ఎం.ఈ.ఓ గా లోకేష్, కాంప్లెక్స్ హెచ్.ఎం గా హేమంత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు గా కీర్తన లు వ్యవహరించారు. ఛాత్రోపాధ్యాయులుగా విద్యార్థులు చేసిన బోధనా కౌశలాలను ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్ పరిశీలించి వారికి అభినందనలు తెలియజేసి మీరు ఈ రోజు పొందిన ఆనందం భవిష్యత్తులో పొందాలంటే బాగా చదువుకుని మీ లక్ష్యాలను సాధించాలని ఆశీర్వదించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు విద్యార్థులను అభినందించి, బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి శ్రీనివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Friday, 28 February 2025

National Science Day 2024 Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా సైన్స్ దినోత్సవం:
ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ భౌతిక శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న C.V రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను 1928 సం.లో ఫిబ్రవరి 28న కనుగొన్న సందర్భంగా 1987 సం నుండి ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మన దేశంలో విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జాతీయ విజ్ఞాన దినోత్సవంను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు చేసిన ఎన్నో ఆవిష్కరణల వల్లనే మనం సౌకర్యవంతంగా జీవిస్తున్నాం కాబట్టి విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని తెలుసుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని మూఢనమ్మకాలను నమ్మొద్దు అని తెలియజేశారు. విజ్ఞాన శాస్త్రం/సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించిన జ్ఞానం అని ప్రతి విషయాన్ని ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలను ఆలోచించి, పరిశోధించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రయోగాలను ప్రదర్శించి వివరించారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

Thursday, 13 February 2025

English Language Day Celebrations at MPPS Uppununthala Boys

 


English Language Day has been celebrated on the occasion of Sarojini Naidu's birth anniversary. Explained importance of English language for bright future. Spelling Bee Quiz Competition has been conducted and presented prizes to the winners Bingi Saidulu, 5th, Varum Tej Edurishetti, 4th, Chanti Aloori, 3rd, Chakravarthy Bolle, 2nd, Richanvitha Aloori, 1st. 

Sunday, 26 January 2025

76th Republic day celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు:


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేశభక్తిని చాటుతూ, రాజ్యాంగ నిర్మాతలను, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతాలు పాడుతూ విద్యార్థులు జాతీయ నాయకుల వేషాధారణలో గ్రామ వీధుల గుండా ప్రభాత భేరి నిర్వహించారు.

ఉదయం 8:30 గంటలకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్  జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు రాజ్యాంగం గొప్పతనాన్ని, పౌరులు అందరూ సమానంగా ఎదగడానికి వారికి కల్పించిన హక్కులను, విధులను వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఉపాధ్యాయురాలు సంగీత మేడం మంగలికుంటపల్లి గ్రామంలో మొదటి ప్రభుత్వ ఉద్యోగిగా నిలిచారంటే వారి కృషి, వారి తల్లిదండ్రుల సహకారం, రాజ్యాంగం కల్పించిన అవకాశం అని వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందచేశారు.



Thursday, 2 January 2025

National Women Teacher's Day Celebrations at MPPS Uppununthala Boys

 ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం - మహిళా ఉపాధ్యాయులకు సన్మానం :

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈ రోజు ఉదయం 10 గం.లకు భారత దేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 194వ జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సావిత్రి భాయి ఫూలే గారికి పూలతో నివాళులు అర్పించారు. 

అనంతరం ఆమె చేసిన సేవలు గురించి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన , సంగీత లుమాట్లాడుతూ ఎస్సీ , ఎస్టీ, బిసి మరియు మహిళలు అందరికీ విద్యను అందించడానికి 1848లో తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారితో కలిసి మొదటి పాఠశాలను స్థాపించి 1852 వరకు మొత్తం 52 పాఠశాలల ద్వారా వేల మంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతోపాటు, అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి, మూఢనమ్మకాలను, సామాజిక రుగ్మతలను రూపుమాపి కోట్లాది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలియజేశారు. ఫూలే దంపతుల స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 

అనంతరం మహిళా ఉపాధ్యాయులు చందన, సంగీత లను శాలువాతో సన్మానించారు.


Tuesday, 15 October 2024

Missile Man of the India Dr A.P.J Abdul Kalam's 93rd birth anniversary celebrations 2024 at MPPS Uppununthala Boys

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమం:

ఈ రోజు మధ్యాహ్నం 3:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటేష్ , చందన అబ్దుల్ కలాం గారు భారత దేశానికి చేసిన సేవలను గురించి విద్యార్థులకు వివరిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. వాళ్ళ నాన్న పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Thursday, 15 August 2024

78th Independence Day Celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు!
ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులు
ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులు
ఉదయం 6 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 78 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ప్రభాత భేరితో ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేశాధారణ ధరించి వీధులన్నీ తిరుగుతూ భారతీయ వీరులం భరతమాత బిడ్డలం శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం అనీ పాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గొంతెత్తి నినదిస్తూ ఉప్పొంగిన ఆనందంతో దేశంపై గౌరవాన్ని చాటారు.
జాతీయ జెండా ఎగురవేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ 
ఉదయం 8 గం.లకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి  జెండా వందనం చేశారు. మహనీయులు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు మొ.న వారి త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్ర్యం పొందినం. వారి ఆశయ సాధనకు విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు 
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
విజేతలకు బహుమతులు అందజేస్తున్న సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు 
సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tuesday, 6 August 2024

90th Birth Anniversary Celebrations of Prof Jayashankar sir

 

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్. ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ పాల్గొన్నారు. ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం బిచ్యా నాయక్ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, బాలమణి మేడం, చందన మేడం లు, ఆలూరి లింగమయ్య, జెర్మయ్య గారు జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Thursday, 20 June 2024

International Yoga Day Celebrations 2024 at MPPS Uppununthala Boys


ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈరోజు ఉదయం 9 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు బలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరావని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.



Sports Day Celebration at MPPS Uppununthala Boys


ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహణ: 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు అని ఆ సమయంలో వేరే పనులు చేయించొద్దన్నారు.

Tuesday, 18 June 2024

Digital Classes day Celebrations at MPPS Uppununthala Boys


బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవం: 

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ డిజిటల్ తరగతులు విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడతాయో వివరిస్తూ నూతన పాఠ్యపుస్తకాలు అన్నింటిలోనూ ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన క్యూ.ఆర్ కోడ్ లను ముద్రించడం జరిగిందని, క్యూ.ఆర్ కోడ్లను ఉపయోగించి మొబైల్ లేదా ట్యాబ్ లేదా కంప్యూటర్ లేదా ప్రొజెక్టర్ లలో ఏ విధంగా ఆ పాఠ్యాంశాల డిజిటల్ వీడియో పాటలను చూడాలో తెలియజేశారు. ఈ డిజిటల్ పాఠాలను ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగిన విషయ నిపుణులు తయారు చేశారని, వీటిని విద్యార్థులకు చూపించడం ద్వారా పాఠాలను సులభంగా అవగాహన చేసుకుంటారని తెలియజేశారు. మెరుగైన ఫలితాలు సాధించడం కోసం విద్యారంగంలో, బోధనలో, మూల్యాంకనంలో కూడా సాంకేతికతను, డిజిటల్ పరికరాలను ఉపయోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు బాలమణి మేడం, విద్యార్థులు పాల్గొన్నారు.