Monday, 13 April 2026
Babasaheb Dr BR Ambedkar's 135th Birth Anniversary Celebrations at MPPS Uppununthala Boys
Saturday, 11 April 2026
Jyothi Rao Phule's 199th Birth Anniversary Programme at MPPS Uppununthala Boys
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఫూలే గారి చిత్ర పటానికి పూలమాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు జ్యోతిరావు ఫూలే గారి గురించి విద్యార్థులకు వివరిస్తూ వారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి ఫూలేతో కలిసి 1848 వ సంవత్సరంలో బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని వారి సేవలను కొనియాడారు. వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Tuesday, 24 March 2026
Our students got gurukula seats in V TGCET 2026
గురుకుల ఫలితాల్లో 8 సీట్లు సాధించిన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులు:
5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2026 మొదటి విడత ఫలితాల్లో మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఎనిమిది మంది విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, పాత్కుల కౌశిక్, నడిగడ్డ విగ్నేష్, ఆలూరి చంటి, పొట్టల శ్రీనిధి, మధనాగుల అలేఖ్య, గోరటి మాధవి, ఆలూరి హర్బిక లు గురుకుల సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ , ఆంజనేయులు సార్ , చందన మేడం, సంగీత మేడం లు విద్యార్థులను అభినందించి బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు గురుకుల మెటీరియల్ అందించిన బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు టీచర్ విజయ్ కుమార్ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ లు విద్యార్థులకు అభినందనలు తెలియజేసి ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.
Wednesday, 11 March 2026
Self Government Day 2026 at MPPS Uppununthala Boys
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం:
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠశాల విధులు నిర్వహించారు. కలెక్టర్ గా వరున్ తేజ్, డీఈవో గా యశ్వంత్, ఎం.ఈ.ఓ గా అలేఖ్య, కాంప్లెక్స్ హెచ్.ఎం గా చంటి, ప్రధానోపాధ్యాయులు గా శ్రీజ లు వ్యవహరించారు. ఛాత్రోపాధ్యాయులుగా విద్యార్థులు చేసిన బోధనా కౌశలాలను ముఖ్య అతిథులుగా హాజరైన ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ పరిశీలించి వారికి అభినందనలు తెలియజేసి, మీరు ఈ రోజు పొందిన ఆనందం భవిష్యత్తులో పొందాలంటే బాగా చదువుకుని మీ లక్ష్యాలను సాధించాలని ఆశీర్వదించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఆంజనేయులు, చందన, సంగీత లు విద్యార్థులను అభినందించి, బహుమతులు అందచేశారు. జిల్లా తనిఖీ బృందం అధికారి కేతావత్ బిచ్య నాయక్, సభ్యులు రవిందర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Monday, 26 January 2026
77th Republic Day Celebrations at MPPS Uppununthala Boys
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు:
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేశభక్తిని చాటుతూ, రాజ్యాంగ నిర్మాతలను, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతాలు పాడుతూ విద్యార్థులు జాతీయ నాయకుల వేషాధారణలో గ్రామ వీధుల గుండా ప్రభాత భేరి నిర్వహించారు.
ఉదయం 8:30 గంటలకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, ఆంజనేయులు సార్, చందన మేడం, సంగీత మేడం లు రాజ్యాంగం గొప్పతనాన్ని, పౌరులు అందరూ సమానంగా ఎదగడానికి వారికి కల్పించిన హక్కులను, విధులను, సామాజిక న్యాయం, సమాజ అభివృద్ధి కోసం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలను వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన గ్రామ సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ అంతటి శైలజ వెంకటయ్య గౌడ్, వార్డు సభ్యులు జాకటి గీత, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, మాజీ యంపిటిసీ సైదమ్మ రామచంద్రయ్య, యువజన నాయకులు భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కంప్యూటర్ ల్యాబ్ లో ఇన్వర్టర్ ఏర్పాటు కోసం సర్పంచ్ శ్రీనివాసులు గారు 10 వేల రూపాయలు, మాజీ యంపిటిసీ సైదమ్మ రామచంద్రయ్య గారు 5 వేల రూపాయలు, ఉప సర్పంచ్ అంతటి శైలజ వెంకటయ్య గౌడ్ గారు 5 వేల రూపాయలు, యువజన నాయకులు భాస్కర్ గారు 10 వేల రూపాయలు ప్రకటించడం జరిగింది. వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి, అభినందించడం జరిగింది.
అనంతరం ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందచేశారు.
Tuesday, 23 December 2025
5th Gurukula Entrance Material Distribution on the occasion of National Farmer's Day 2025 at MPPS Uppununthala Boys
National Mathematics Day 2025 Programme at MPPS Uppununthala Boys
ఘనంగా జాతీయ గణిత దినోత్సవం:
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో గొప్ప గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రామానుజన్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు, అనంతరం ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు చందన లు మాట్లాడుతూ రామానుజన్ గారు గణితం పైన మక్కువతో సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, గణిత విశ్లేషణ వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచారు, 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించారు, కానీ 1729 వంటి సంఖ్యల ద్వారా చిరస్మరణీయులయ్యారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల పైనా నేటికీ ఎందరో పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వారి స్పూర్తితో విద్యార్థులు గణితం తో పాటు అన్ని విషయాలు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.





















