గురుకుల ఫలితాల్లో 8 సీట్లు సాధించిన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులు:
5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2026 మొదటి విడత ఫలితాల్లో మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఎనిమిది మంది విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, పాత్కుల కౌశిక్, నడిగడ్డ విగ్నేష్, ఆలూరి చంటి, పొట్టల శ్రీనిధి, మధనాగుల అలేఖ్య, గోరటి మాధవి, ఆలూరి హర్బిక లు గురుకుల సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ , ఆంజనేయులు సార్ , చందన మేడం, సంగీత మేడం లు విద్యార్థులను అభినందించి బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు గురుకుల మెటీరియల్ అందించిన బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు టీచర్ విజయ్ కుమార్ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ లు విద్యార్థులకు అభినందనలు తెలియజేసి ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.






















