Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Teacher's Day. Show all posts
Showing posts with label Teacher's Day. Show all posts

Wednesday, 3 January 2024

National women teacher 's day celebrations at MPPS Uppununthala Boys

 






ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 193వ జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ను ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సావిత్రి భాయి ఫూలే గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, శ్రీనివాసులు సార్, జానకి రామ్ సార్ లు మాట్లాడుతూ సావిత్రి భాయి ఫూలే గారు తన భర్త సహకారంతో చదువుకుని శూద్రుల కోసం, బాలికల కోసం 1848 సంవత్సరంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో బాలికలకు, శూద్రులకు చదువుకోవడానికి అవకాశం లేదు. అందుకే కొందరు సావిత్రి భాయి ఫూలే పైన పాఠశాలకు వెళ్ళే సమయంలో బురద నీళ్ళు చల్లుతూ, అవమానకరంగా మాట్లాడేవారు. అయినా పట్టు వదలకుండా 52 పాఠశాలలు ప్రారంభించి విద్య ను అందించారు. అనంతరం సత్య శోదక్ సమాజ్ ద్వారా మూఢనమ్మకాలు రూపుమాపడానికి కృషి చేశారు అని తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు బాలమణి మేడం, అనిత మేడం, పద్మావతి మేడం లను శాలువాతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సన్మానించారు.

Tuesday, 5 September 2023

National Teacher's day Celebrations 2023 at PS Uppununthala Boys

 






మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భముగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోనే ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన తీరుని వివరించారు. ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి చేరడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానమైనది అందుకే తల్లి తండ్రి తరువాతి స్థానం ఉపాధ్యాయులకే ఉంటుంది. కాబట్టి వారు చెప్పిన విషయాలను నిర్లక్ష్యం చేయకుండా పాటించాలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఆదర్శం గా తీసుకుని బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తరువాత తమకు నాణ్యమైన విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గత విద్యా సంవత్సరం గురుకుల సీటు సాధించిన కాలూరి ప్రజ్వ, కాలూరి శ్రీహాన్, బొల్లె ప్రవీణ, బొల్లె తన్వి మిగతా విద్యార్థులు అందరూ కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.