Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Back to School. Show all posts
Showing posts with label Back to School. Show all posts

Thursday, 12 June 2025

Welcoming students on reopening day in Grand PTM in the part of Pro Jayashankar Badi Bata programme 2025

పాఠశాల పునః ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు & విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ:

ఈ రోజు ఉదయం 9 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాఠశాల పునః ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించడం జరిగింది, విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బడి ఈడు పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడం గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో అర్థవంతమైన కృత్యాధార భోధనతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. అతిథులుగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని అందుకు నిదర్శనం 49 గురుకుల సీట్లు సాధించడమే అన్నారు. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 7 June 2025

Door to Door survey in the part of Pro Jayashankar Badi Bata programme at Uppununthala

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఆద్వర్యంలో బడి బాట కార్యక్రమం: 20 మంది విద్యార్థులు చేరిక
ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. ఈ రోజు 20 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది. ఈ సర్వే లో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Thursday, 13 June 2024

Samoohika Aksharabyasam at MPPS Uppununthala Boys| బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం:

ఈరోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలతో ఉపాధ్యాయులు,విద్యార్థులు నివాళులర్పించడం జరిగింది. పాఠశాలలో ఈ సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థుల పలకలపై అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు శారద, రజిత లు అక్షరాలు దిద్దించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ అక్షరాల ద్వారా, చదువు ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి, మనం పొందిన జ్ఞానాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. జ్ఞానవంతులకు సమాజంలో గౌరవం లభిస్తుంది, అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి ఉపాధ్యాయులు బోధించే విషయాలను శ్రద్ధగా విని, అవగాహన చేసుకుని వాటిని నేర్చుకొని బాగా చదువుకుంటూ భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

District Collector Uday Kumar sir, IAS visits State Best Practices School MPPS Uppununthala Boys

 
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.

రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉందయ్ కుమార్, IAS గారు:

గతంలో పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండే స్థితి నుంచి ఈ రోజు 80 మంది విద్యార్థులు పెరగడానికి చేసిన కృషిని కలెక్టర్ గారు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల సీట్లు వచ్చే లాగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని , దానితో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని, ఈ సంవత్సరం 10 సీట్లతో పాటు ఇప్పటి వరకు 40 సీట్లు సాధించారని, ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గాజుల వెంకటేష్ సార్ తన ఇద్దరి కుమారులు గౌతమ్, రాహుల్ లను ఇదే పాఠశాలలో చదివిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, గ్రామ పెద్దలు మరియు దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్ లు, ప్రింటర్, గురుకుల, నవోదయ స్టడీ మెటీరియల్ మొదలైనవాటిని సమకూర్చుకొని ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ తరగతులు, అబాకస్, చిల్డ్రన్ బ్యాంక్ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ అందరూ సమిష్టిగా, సమన్వయంతో బట్టి విధానంలో కాకుండా పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలతో కృత్యాదార బోధన చేస్తున్నారని, అదేవిధంగా వెంకటేష్ సార్ పాఠశాలకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులు అందరి నెంబర్లను యాడ్ చేయడం ద్వారా అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని, సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు చేయాల్సిన కృత్యాలను, ఇంటి పనిని వాట్సాప్ ద్వారా పంపించి, విద్యార్థులు చేసి పంపించిన వాటిని వాట్సాప్ లోనే దిద్ది విద్యార్థులకు తిరిగి పంపుతూ విద్యార్థులు నిరంతరం అభ్యసనంలో నిమగ్నం అయ్యేటట్లు చూడడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు ఒక వెబ్సైట్ ను , యూట్యూబ్ ఛానల్ తయారు చేసి అందులో విద్యార్థుల చూపిన ప్రతిభను, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను,  పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను అప్లోడ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యాశాఖ అధికారులకు, మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా పాఠశాల గురించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకొని, ఉపాధ్యాయులు కృషిని అభినందిస్తూ, పాఠశాలపై నమ్మకంతో వారి పిల్లలను ప్రైవేటు పాఠశాల నుండి తీసి మన బాలుర ప్రభుత్వ పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ వివరించారు.

అనంతరం కలెక్టర్ గారు విద్యార్థుల ప్రతిభను పరిశీలించి విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. అదేవిధంగా మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కి మంజూరైన నిధులను ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, ఉప్పునుంతల ఏఈ సందీప్ సార్, ఏం.ఐ.యస్ కోఆర్డినేటర్ తిరుపతి గారు, పత్రికా విలేకరులు మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Wednesday, 12 June 2024

World Day Against Child Labour 2024 | ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం


 ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం:

ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలు అందరూ కూడా పనుల్లో చేరకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు. బాలల విద్యాహక్కు, రక్షణ హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి హక్కులను కాపాడటం ప్రభుత్వం, సమాజంలోని వ్యక్తుల అందరి సమిష్టి బాధ్యత అని తెలియజేశారు. బాలలను పనిలో పెట్టుకోవడం నేరము. వారు శారీరకంగా మానసికంగా ఎదుగుతూ భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాలు పొందడానికి విద్యాలయాల్లో సరైన మౌళిక వసతులు అందుబాటులో ఉంచాలి. చదువు ద్వారానే జ్ఞానం, నైతిక విలువలు పొంది ఉత్తమ పౌరులుగా బాలలు తీర్చిదిద్దబడుతారు. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ బడిలో చేరేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం పాఠ్య పుస్తకాలు అందజేశారు.