Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Quiz Competitions. Show all posts
Showing posts with label Quiz Competitions. Show all posts

Monday, 16 June 2025

FLN Quiz has been conducted at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme 2025

విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ - విజేతలు బహుమతులు:

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ లో విద్యార్థులను ఐదు గ్రూపులుగా చేసి  తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. విద్యార్థులందరూ ఈ క్విజ్ లో చాలా ఆసక్తిగా, చురుకుగా పాల్గొని సమాధానాలు చెప్పారు. ఈ క్విజ్ లో ఎక్కువ పాయింట్లు సాధించిన గ్రూపు సభ్యులు యశ్వంత్, అశ్విని, భాను ప్రసాద్, అఖిల్, మనస్వి, శ్రవణ్ కుమార్ లకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెన్నులు బహుమతులుగా అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఈ క్విజ్ ల ద్వారా విద్యార్థుల్లో గెలవాలనే పోటీతత్వం, పట్టుదల, విషయ పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి, సమిష్టి కృషి మొదలైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మిగతా విద్యార్థులు తర్వాత చేపట్టబోయే క్విజ్ లో విజయం సాధించేలా బాగా చదవాలని సూచించారు.

Thursday, 13 February 2025

English Language Day Celebrations at MPPS Uppununthala Boys

 


English Language Day has been celebrated on the occasion of Sarojini Naidu's birth anniversary. Explained importance of English language for bright future. Spelling Bee Quiz Competition has been conducted and presented prizes to the winners Bingi Saidulu, 5th, Varum Tej Edurishetti, 4th, Chanti Aloori, 3rd, Chakravarthy Bolle, 2nd, Richanvitha Aloori, 1st. 

Saturday, 21 December 2024

Quiz Competition at MPPS Uppununthala Boys

 

విద్యార్దులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులుగా పెన్నులు అందించి అభినందించడం జరిగింది.

Saturday, 3 August 2024

Spelling Bee Competition at MPPS Uppununthala Boys

 

స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఎదురిశెట్టి వరున్ తేజ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు ఆలూరి అక్షర గ్రూప్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు, వీరికి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Tuesday, 29 August 2023

Telugu Language Day celebrations 2023 at PS Uppununthala Boys

💐అందరికీ తెలుసు భాషా దినోత్సవం శుభాకాంక్షలు 🌹






కవి గిడుగు రామమూర్తి జన్మ దినం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు మాతృ భాష దినోత్సవం/తెలుగు భాష దినోత్సవాన్ని మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు పద్యాల పోటీ, గేయాల పోటీ నిర్వహించడం జరిగింది.ప్రతిభ కనబరిచి విజేతలు నిలిచిన ప్రవీణ, సిరి, తన్వి, అలేఖ్య, రాహుల్, తేజ శ్రీ లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మన మాతృభాష తెలుగు గొప్పతనం గురించి మాట్లాడుతూ అమ్మ ఒళ్ళో ఉన్నప్పటి బాల్యం నుంచే మనం తెలుగును నేర్చుకోవడం జరుగుతుంది అని అందుకే మనకు మాతృభాష లోనే ఏ విషయాన్ని అయినా చాలా సులువుగా అవగాహన చేసుకుంటాము. ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని మాతృ భాషతో అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి మాతృ భాషపై పట్టు సాధిస్తేనే ఇతర ఇంగ్లీష్, హిందీ వంటి భాషలను సులభంగా నేర్చుకోగలము. కాబట్టి విద్యార్థులు అందరూ తెలుగు పాఠ్య పుస్తకాలను, గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి తెలుగు భాషలోని వ్యాకరణం, పద్యాలు, గేయాలు, పాటలు, నీతి కథలు, కవితలు చదివి తెలుగు భాషపై పట్టు సాధించాలి అని విద్యార్థులకు సూచించారు.

Saturday, 5 August 2023

Spell Bee Competition at PS Uppununthala Boys

స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

 మొదటి బహుమతి విజేతలు: 











రెండవ బహుమతి విజేతలు:









ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఆరు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన గాజుల గౌతమ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు నడిగడ్డ కిరణ్ గ్రూప్ రెండవ బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా  ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ ని బాగా నేర్చుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Thursday, 23 February 2023

Spell bee competition at PS Uppununthala Boys


ఫిబ్రవరి 10,2023న మధ్యాహ్నం 2 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను 5 గ్రూపులుగా చేసి ఆంగ్ల పదాల స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన అంపటి భార్గవి గ్రూప్ సభ్యులకి పెన్నులు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత కోర్సులు చేసి, ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆంగ్ల భాష పై పట్టు సాధించాలన్నారు. అందుకోసం ఆంగ్ల పదజాలం అభివృద్ధి పరుచుకోవాలని దాని కోసం స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ తోడ్పడుతుందని తెలియజేశారు. విద్యార్థులు అందరూ ఆంగ్ల పాఠ్య పుస్తకాల చివరి పేజిల్లో ఉన్న కామన్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లను చదివి వాటి అర్థాలు తెలుసుకొని రోజూ వాటిని ఉపయోగిస్తుంటే మరిచిపోకుండా గుర్తుంచుకుంటారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఇంగ్లీష్ మీడియంలోకి మారినందున ఇంగ్లీష్ భాష వస్తేనే మిగిలిన విషయాలు అవగాహన చేసుకుంటారు కాబట్టి విద్యార్థులు అందరూ ఆంగ్ల భాష పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.