Saturday, 3 August 2024

Spelling Bee Competition at MPPS Uppununthala Boys

 

స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఎదురిశెట్టి వరున్ తేజ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు ఆలూరి అక్షర గ్రూప్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు, వీరికి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

0 comments:

Post a Comment