Tuesday, 6 August 2024

Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమాన్ని హెచ్.ఎం శ్రీనివాసులు సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి సార్, పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, పి.ఆర్.టి.యు రాష్ట్ర నాయకులు బిచ్యా నాయక్ సార్, ఎ.ఎ.పి.సి చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి పదోన్నతిపై వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు  బాలమణి మేడంను శాలువ, పూలదండతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి ప్రతి సంవత్సరము గురుకుల సీట్లు వచ్చేలా కృషి చేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 85 కి పెంచారని వివరించారు. అదేవిధంగా బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు చందన మేడంను శాలువ, పూలదండతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు గారు, జెర్మయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నాగరాజు గారు, ఆర్.కృష్ణ గారు, రతన్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment