Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Puppetry. Show all posts
Showing posts with label Puppetry. Show all posts

Saturday, 20 September 2025

Parent Teacher Meeting & Bathukamma Celebrations 2025

 

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆకట్టుకున్న పప్పెట్రీ ప్రదర్శన:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ దసరా సెలవుల్లో పిల్లలతో తల్లిదండ్రులు తగిన సమయాన్ని గడపాలని, విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ ఒక గంట చదువుకునేలా చూడాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకునే విధంగా వారికి స్ఫూర్తివంతమైన వ్యక్తుల గురించి, కథలు చెప్పాలని, కుటుంబ విలువల గురించి వివరించాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిర్వహిస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు.ఈ సమావేశంలో విద్యార్థులు ప్రదర్శించిన పప్పెట్రీ ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం విద్యార్థులు వివిధ పూలను సేకరించి బతుకమ్మను పేర్చి , బతుకమ్మ పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Monday, 15 September 2025

Grand welcome and felicitation to venkatesh sir for Successfully completed National Level Educational Training at CCRT Udaipur, Rajasthan State

ఉపాధ్యాయునికిి ఘన స్వాగతం పలికి అభినందించిన ఉపాధ్యాయులు మరియువిద్యార్థులు:

బాలల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గాజుల వెంకటేష్ తెలంగాణ రాష్ట్రం తరపున బెస్ట్ ప్రాక్టీస్ విభాగంలో తెలంగాణ ఎస్సీఈఆర్టీ చేత ఎంపికై రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ సిసిఆర్టీ లో నూతన విద్యా విధానం 2020 లో భాగంగా బోధనను ఆసక్తిగా మార్చుటకు విద్యలో పప్పెట్రి/బొమ్మల పాత్ర అనే అంశము పైన 15 రోజుల పాటు జాతీయ విద్యా శిక్షణా కార్యక్రమానికి హాజరై అక్కడ ఉత్తమ ప్రతిభను కనబరిచి అందరి మన్ననలు పొంది విజయవంతంగా ముగించుకొని తిరిగి ఈ రోజు పాఠశాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ ని విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లు ఘనంగా పూలతో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ 15 రోజుల పాటు పప్పెట్రీ పైన  వెంకటేష్ సార్ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని సురక్షితంగా పాఠశాలకు చేరుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. అక్కడ మీరు నేర్చుకొన్న విషయాలు పాఠశాలలో అమలు పరిచి విద్యార్థుల ప్రగతికి కృషి చేయాలని కోరారు. వెంకటేష్ మాట్లాడుతూ పప్పెట్రీ/బొమ్మలతో బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టడం ద్వారా విద్యార్థులు ఆహ్లాదకరమైన సహజసిద్ధమైన స్వేచ్ఛ పూరిత వాతావరణంలో ఆసక్తిగా, చురుకుగా పాల్గొని భయం లేకుండా బట్టీ పట్టకుండా సులభంగా విషయావగహన చేసుకొంటారని, సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని తెలియజేశారు.