ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం:
ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఆంజనేయులు, చందన లు మాట్లాడుతూ అంబేద్కర్ గారు విద్య ద్వారా గొప్ప స్థాయికి ఎదిగిన తీరును, వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు . అంబేద్కర్ గారిని బడిలోకి రానివ్వకున్న గుమ్మం బయట కూర్చోని ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో శ్రద్ధగా చదువుకుని, విదేశాలకు వెళ్ళి ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లలో ఉన్నతంగా చదువుకుని ప్రపంచ మేధావిగా ఎదిగి భారత దేశంలోని కుల వివక్షతకు, లింగ వివక్షతకు, అసమానతలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి, రాజ్యాంగం ద్వారా భరత దేశ ప్రజలు అందరూ ఎదిగే విధంగా అందరికీ అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండే విధంగా అవకాశాలను, హక్కులను కల్పించి కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు.







0 comments:
Post a Comment