Tuesday, 23 December 2025

5th Gurukula Entrance Material Distribution on the occasion of National Farmer's Day 2025 at MPPS Uppununthala Boys

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ వితరణ: 

 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ రైతు దినోత్సవాన్ని సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంగీత మాట్లాడుతూ రైతు నాయకులు, దేశ 5వ ప్రధాని చరణ్ సింగ్ గారు రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని అందుకే ఆయన పుట్టిన రోజున జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, రైతులు ఎన్నో కష్టనష్టాలను, కన్నీళ్ళను ఎదుర్కొని పంటలు పండించడం ద్వారా మనకు ఆహారం లభిస్తుందని, వారి గొప్ప సేవలు, త్యాగాలు దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ ప్రజల ఆకలి తీర్చడంలో వెలకట్టలేనివని, మా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు అందరూ రైతులే అని వారి కృషి వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నామని అందుకే రైతులను మనందరం గౌరవించాలని, వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టీచర్ విజయ్ కుమార్ సార్ అందించిన గురుకుల మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. సార్ కి కృతజ్ఞతలు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని గురుకుల సీట్లు సాధించాలని కోరారు.

0 comments:

Post a Comment