Tuesday, 2 December 2025

National Pollution Control Day 2025 at MPPS Uppununthala Boys

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఉపాధ్యాయులు & విద్యార్థులు:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు పాఠశాల ప్రహరీ గోడ వెంబడి మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తరగతి వారిగా విద్యార్థులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మూడు రకాల కాలుష్యాలు వాటి నియంత్రణ మార్గాలను విద్యార్థులకు వివరిస్తూ భూమి కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాయు కాలుష్య నివారణకు మొక్కలు పెంచాలని, జల కాలుష్య నివారణకు వ్యర్థ పదార్థాలను నీటిలో కలుపొద్దని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని మనకు అవసరం అయ్యే ఆక్సిజన్ ను ఇస్తాయని, వర్షాలు కురవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయని వివరించారు. అందుకే చెట్లను నరుకొద్దని, వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలియజేశారు. కాలుష్యం నుంచి ప్రకృతి ని రక్షించి భావి తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని, అందరూ పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.



0 comments:

Post a Comment