Saturday, 20 December 2025

Nutritious Food Festival at MPPS Uppununthala Boys in the PTM

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా పోషక ఆహారోత్సవం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పిటిఎం) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేయడానికి పోషక ఆహారోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పౌష్టికాహారం అందించాలని, పౌష్టికాహారం అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే పదార్థాలు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. స్థూల పోషకాలు అయిన పిండి పదార్థాలు 60%, మాంసకృత్తులు 15%, క్రొవ్వులు 25% తీసుకోవాలని, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి అని తెలియజేశారు. దీన్నే సమతుల ఆహారంగా చెప్తారు. పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలకు వారానికి మూడు గుడ్లు, రాగి జావ, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు జంక్ ఫుడ్ తినకుండా, ఇంట్లో చేసిన తాజా ఆహారం తీసుకోవాలి అని సూచించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేసుకొని వచ్చిన పోషకాలు కలిగిన, రుచికరమైన వంటకాలను ప్రదర్శించి,వాటి తయారీ విధానం, ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment