బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవం:
డిసెంబర్ 21 రేపు ఆదివారం కావడంతో ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా మనస్సు ను అదుపు చేయవచ్చు అని, తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది అని, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత ఏర్పడి సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుందని, ప్రశాంతత ఏర్పడుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయాలని తద్వారా ఏకాగ్రత పెరిగి చదువు లో రాణించవచ్చు అని తెలియజేశారు. ధ్యానంతో నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది అని, మన బలాలు, బలహీనతలు తెలుసుకొని, చెడు అలవాట్లు దూరం చేసుకొని మంచి వ్యక్తిగా మారుతారని ఇన్ని ప్రయోజనాలు ఉన్న ధ్యానం ను అందరూ ఆచరించాలని సూచించారు. విద్యార్థులు పాల్గొన్నారు.








0 comments:
Post a Comment