Friday, 28 November 2025

Mahathma Jyothi Rao Phule's 135th death anniversary programme at MPPS Uppununthala Boys

 విద్యా వ్యాప్తికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే గారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి కి చదువు నేర్పి, ఆమెతో కలిసి 1848 వ సంవత్సరం నుంచి బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి, ఎన్నో అవమానాలను, అడ్డంకులను, కుట్రలను ఎదుర్కొని విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, వారు 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని, గులాం గిరీ పుస్తకం రచించి అత్యధిక ప్రజలు మానసిక బానిసత్వం నుండి విముక్తి కావాలని అందుకు విద్యను ఆయుధంగా తీసుకోవాలి అన్నారు. వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

0 comments:

Post a Comment