Tuesday, 25 November 2025

Constitution Day 2025 Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం:

ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి రాజ్యాంగ పీఠిక ను పఠనం చేయడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 2 సం.రాల 11 నెలల 18 రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించడం జరిగిందని, ఇది నవంబర్ 26, 1949 లో ఆమోదించడం జరిగిందని, ఆ సందర్భంగా ఈ రోజు రాజ్రాయాంగం దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు. అదేవిధంగా రాజ్యంగ పీఠిక లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, జాతీయ సమగ్రత పదాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా దేశ పౌరులు అందరూ సమానంగా ఎదిగే విధంగా, సమాన గౌరవం పొందే విధంగా అన్ని రంగాల్లో అందరూ భాగస్వామ్యం అయ్యే విధంగా భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కులు, దేశ భక్తి ని, దేశాభివృద్ధి లో పౌరుల భాద్యతలను తెలిపే ప్రాధమిక విధులను, అందరికీ ఆర్థికంగా, సామాజిక న్యాయం అందించడానికి ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగిందని, ప్రస్తుతం రాజ్యాంగం మొత్తం 470 ఆర్టికల్ లు, 12 షెడ్యూల్, 25 భాగాలుగా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది అని తెలియజేశారు. రాజ్యాంగం స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని హక్కులు ఉపయోగించుకొని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

0 comments:

Post a Comment