Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Saturday, 21 December 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys on 21/12/2024

 ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM): 


ఈ రోజు ఉదయం 9:30 గం.లకు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ర్ అద్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆహారోత్సవం నిర్వహించి పోషక విలువల గురించి చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, ఆకు కూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లతో తయారు చేసిన ఆహార పదార్థాలు , మొలకెత్తిన గింజలు పిల్లలకు అందించాలని సూచించడం జరిగింది. పోషక విలువలు గల ఆహారం పిల్లలకు అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని, ఏకాగ్రతతో బాగా చదువుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది.

అనంతరం విద్యార్థులు తెచ్చిన ఆహా పదార్థాలను ప్రదర్శించడం జరిగింది.



Quiz Competition at MPPS Uppununthala Boys

 

విద్యార్దులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులుగా పెన్నులు అందించి అభినందించడం జరిగింది.

Friday, 20 December 2024

Word Meditation Day Programme at MPPS Uppununthala Boys

ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం:


ఈ రోజు ఉదయం 9:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ ధ్యాన దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మంచి అలవాట్లు అలవడుతాయని, మనస్సును అదుపులో ఉండి ఏకాగ్రత ఏర్పడుతుందని తద్వారా చేసే పనిలో విజయం సాధిస్తారని, విద్యార్థులు చదివింది అర్థం చేసుకొని ప్రగతి సాధిస్తారని, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. అందుకే ప్రతి ఒక్కరూ రోజు కొద్ది సమయం ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో ధ్యానం చేయించడం జరిగింది.

Thursday, 5 December 2024

Babasaheb Dr.B.R Ambedkar's 68th Death Anniversary Programme

బాలుర ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు:







 
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి అందరూ పూలతో నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా బాగా చదువుకుని కుల, లింగ వివక్షతలకు, బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని స్వాతంత్ర్యం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారని, రాజ్యాంగం ద్వారా కులాలకు , మతాలకు అతీతంగా బాలబాలికలు అందరూ అభివృద్ధి సాధించడానికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ లు, అవకాశాలు, హక్కులు కల్పించారని వివరించారు. అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిత్ర లేఖనంలో ప్రతిభ కనబరిచిన లోకేష్, ప్రశాంత్, సైదులు, వరుణ్ తేజ్ లకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి అభినందించడం జరిగింది.


Tuesday, 29 October 2024

Felicitation and Welcome to Megavath Srinu sir on the occasion of joining in our school

🌹💐🌹📖✍️డిఎస్సీ 2024 ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికైన మెగావత్ శ్రీను సార్ మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో చేరిన సందర్భంగా శాలువాతో సన్మానించి, ఘనంగా స్వాగతం పలికి, హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు🌹💐🌹

 

Tuesday, 15 October 2024

Missile Man of the India Dr A.P.J Abdul Kalam's 93rd birth anniversary celebrations 2024 at MPPS Uppununthala Boys

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమం:

ఈ రోజు మధ్యాహ్నం 3:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటేష్ , చందన అబ్దుల్ కలాం గారు భారత దేశానికి చేసిన సేవలను గురించి విద్యార్థులకు వివరిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. వాళ్ళ నాన్న పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Saturday, 21 September 2024

Parent Teacher Meeting for September 2024 at MPPS Uppununthala Boys

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి సారి ఒక విషయం పైన చర్చించడం జరుగుతుంది అని ఈ సారి జ్వరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్ ను ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన  వివరిస్తూ 1. ఇంటి పక్కల నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలని, 2. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, 3. శుభ్రమైన నీరు తాగాలని, 4. జ్వరం వచ్చిన వారు మాస్క్ ను ధరించాలని, 5. తేలికపాటి ఆహారం తీసుకోవాలని, 6. డాక్టర్ ను సంప్రదించాలని తగు జాగ్రత్తలు తీసుకోని విద్యార్థులు రోగాల భారిన పడకుండా చూసుకొని వారిని ఆరోగ్యంగా ఉంచుతూ క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని అప్పుడే విద్గయార్థులు బాగా చదువుకుంటారని తెలియజేయటం జరిగింది. అనంతరం విద్యార్థుల పనితీరును తరగతుల వారిగా విషయాల వారీగా ప్రదర్శింప చేయటం జరిగింది . ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను తల్అలిదండ్రులు భినందించారు. అభ్యాసనలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సహకారం అవసరం కాబట్టి వారిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ప్రగతికి కృషి చేయాలని కోరడం జరిగింది. ఇంగ్లీష్ లోని 26 అక్షరాల 44 శబ్దాలను నేర్చుకోవడానికి Jolly Phonics వారు రూపొందించిన విధానం లో సులభంగా చదవడం, రాయడం నేర్పడం జరుగుతుందని Jolly Phonics యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించడం జరిగింది.

ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Saturday, 17 August 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys for August 2024

 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి సారి ఒక విషయం పైన చర్చించడం జరుగుతుంది అని ఈ సారి భాద్యత గల పౌరులను తయారు చేయడం గురించి వివరిస్తూ విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు తెలుసుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని పాటించాలని వారిని చూసి విద్యార్థులు నేర్చుకుంటారన్నారు. ముఖ్యంగా స్వేచ్ఛ, బాధ్యత, గౌరవం, దయ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. వీటిని తల్లిదండ్రులు కూడా పాటించాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని వివిధ విషయాల్లో తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

Thursday, 15 August 2024

78th Independence Day Celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు!
ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులు
ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులు
ఉదయం 6 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 78 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ప్రభాత భేరితో ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేశాధారణ ధరించి వీధులన్నీ తిరుగుతూ భారతీయ వీరులం భరతమాత బిడ్డలం శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం అనీ పాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గొంతెత్తి నినదిస్తూ ఉప్పొంగిన ఆనందంతో దేశంపై గౌరవాన్ని చాటారు.
జాతీయ జెండా ఎగురవేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ 
ఉదయం 8 గం.లకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి  జెండా వందనం చేశారు. మహనీయులు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు మొ.న వారి త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్ర్యం పొందినం. వారి ఆశయ సాధనకు విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు 
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
విజేతలకు బహుమతులు అందజేస్తున్న సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు 
సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tuesday, 6 August 2024

90th Birth Anniversary Celebrations of Prof Jayashankar sir

 

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్. ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ పాల్గొన్నారు. ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం బిచ్యా నాయక్ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, బాలమణి మేడం, చందన మేడం లు, ఆలూరి లింగమయ్య, జెర్మయ్య గారు జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమాన్ని హెచ్.ఎం శ్రీనివాసులు సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి సార్, పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, పి.ఆర్.టి.యు రాష్ట్ర నాయకులు బిచ్యా నాయక్ సార్, ఎ.ఎ.పి.సి చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి పదోన్నతిపై వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు  బాలమణి మేడంను శాలువ, పూలదండతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి ప్రతి సంవత్సరము గురుకుల సీట్లు వచ్చేలా కృషి చేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 85 కి పెంచారని వివరించారు. అదేవిధంగా బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు చందన మేడంను శాలువ, పూలదండతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు గారు, జెర్మయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నాగరాజు గారు, ఆర్.కృష్ణ గారు, రతన్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 3 August 2024

Spelling Bee Competition at MPPS Uppununthala Boys

 

స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఎదురిశెట్టి వరున్ తేజ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు ఆలూరి అక్షర గ్రూప్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు, వీరికి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Saturday, 20 July 2024

Parent Teacher Meeting has been conducted at MPPS Uppununthala Boys

 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. పాఠశాల అవసరాలను తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి లింగమయ్య, బొల్లె పర్వతాలు, ఆలూరి తిరుపతయ్య, సున్నం కురుమయ్య,మల్లయ్య, సునిత, శారద, శిరీష, లలిత, కల్పన, యాదమ్మ, వెంకటమ్మ, చంద్రకళ, శ్రీలత, అనిత, సైదమ్మ, శైలజ, రాధ, బాలమ్మ, విజయ, బి.అనిత, సుహాసిని, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 18 July 2024

Navodaya Classes Start at MPPS Uppununthala Boys

 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నవోదయ తరగతులు ప్రారంభం:

నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందని, పరీక్ష జనవరి 18, 2025 న నిర్వహిస్తారని, ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నవోదయ తరగతులు ఈ రోజు నుండి మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం తెలియజేశారు. అదేవిధంగా మన పాఠశాలలో సైనిక్ పాఠశాలల్లో, గురకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార బోధన చేస్తున్నామని, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వం కోసం అహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, బాలురకు హాస్టల్ వసతి ఉన్నందున ఈ గ్రామం విద్యార్థులతో పాటు, పరిసర గ్రామాల విద్యార్థులు మన పాఠశాలలో ప్రవేశం పొంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ తెలియజేశారు.

Friday, 12 July 2024

Teacher's Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి బదిలీ పైన వెళ్లిన ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ ను, ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, పద్మావతి మేడం లను శాలువాలతో, పూల దండలతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 81 కి పెంచడం జరిగిందని వివరించారు. అదేవిధంగా వారి స్థానంలో బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయురాలు చందన మేడం లను శాలువాలతో, పూల దండలతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య గారు, డి.టి.ఎఫ్ నాయకులు రామస్వామి సార్, సమీప పాఠశాలల ఉపాధ్యాయులు జానకి రాములు సార్, శ్రీనివాసులు సార్, విద్యార్థుల తల్లిదండ్రులు బొల్లె పర్వతాలు, ఆలూరి వెంకటేష్, కాలూరి భారతి, భాజ అనిత, ఆలూరి సుహాసిని, మధనాగుల కవిత మరియు విద్యార్థులు పాల్గొని సన్మానించారు.

Saturday, 22 June 2024

School bags distributes by Mr. Maryada Rukma Reddy to MPPS Uppununthala Boys

 
విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ!

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు ఇదే పాఠశాలలో చదివి అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి మర్యాద రుక్మా రెడ్డి గారు, తన సోదరుడు మర్యాద కృష్ణ రెడ్డి గారితో స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేయించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాల సాధించిన ప్రగతిని, విద్యార్థులు సాధించిన గురుకుల సీట్ల వివరాలను, పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు, గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు, టి.ఎల్.ఎం తో కృత్యాధార అర్థవంతమైన బోధన వివరాలను తెలియజేసి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ రెడ్డి గారు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ మేము కూడా ఇదే పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకొన్నామని, పాఠ్యపుస్తకాలను భద్రపరచుకోవడాని ఉపయోగపడే స్కూల్ బ్యాగ్ లను పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా ఇవ్వడం సంతోషంగా ఉందని, మీరు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. పేరెంట్ రాంచంద్రయ్య , బాలికల పాఠశాల ఉప్పునుంతల హెచ్.ఎం నరసింహ రెడ్డి పాల్గొన్నారు.

Thursday, 20 June 2024

International Yoga Day Celebrations 2024 at MPPS Uppununthala Boys


ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈరోజు ఉదయం 9 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు బలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరావని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.



National Deworming Day at MPPS Uppununthala Boys

 

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం: 

ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పునుంతల వైద్య సిబ్బంది విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ లను వేశారు. వారు మాట్లాడుతూ 2015 లో పిల్లలలో నులిపురుగుల ప్రివలెన్స్ రేట్- 60% నుండి 2023 లో పిల్లలలో నులిపురుగుల ప్రివలెన్స్ రేట్-01% కు తగ్గిందని,

ఇంతటి ప్రగతి సాధించడం ఉపాధ్యాయుల సహాయ సహకారాల వల్లనే సాధ్యమైందన్నారు. అదేవిధంగా నులిపురుగుల నివారణ ఆవశ్యకత గురించి వివరిస్తూ పిల్లల్లో నులి పురుగులు ఉంటే వారు బలహీనంగా ఉండి వయస్సుకు తగిన విధంగా ఎదుగుదల ఉండదు అన్నారు. అందుకే విద్యార్థినీ విద్యార్థులు అందరూ నులిపురుగుల నుండి విముక్తి పొందడానికి ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పునుంతల వైద్య సిబ్బంది దేవి, శ్రీనివాసులు, వీణ పాల్గొన్నారు.

Sports Day Celebration at MPPS Uppununthala Boys


ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహణ: 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు అని ఆ సమయంలో వేరే పనులు చేయించొద్దన్నారు.

Tuesday, 18 June 2024

Digital Classes day Celebrations at MPPS Uppununthala Boys


బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవం: 

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ డిజిటల్ తరగతులు విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడతాయో వివరిస్తూ నూతన పాఠ్యపుస్తకాలు అన్నింటిలోనూ ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన క్యూ.ఆర్ కోడ్ లను ముద్రించడం జరిగిందని, క్యూ.ఆర్ కోడ్లను ఉపయోగించి మొబైల్ లేదా ట్యాబ్ లేదా కంప్యూటర్ లేదా ప్రొజెక్టర్ లలో ఏ విధంగా ఆ పాఠ్యాంశాల డిజిటల్ వీడియో పాటలను చూడాలో తెలియజేశారు. ఈ డిజిటల్ పాఠాలను ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగిన విషయ నిపుణులు తయారు చేశారని, వీటిని విద్యార్థులకు చూపించడం ద్వారా పాఠాలను సులభంగా అవగాహన చేసుకుంటారని తెలియజేశారు. మెరుగైన ఫలితాలు సాధించడం కోసం విద్యారంగంలో, బోధనలో, మూల్యాంకనంలో కూడా సాంకేతికతను, డిజిటల్ పరికరాలను ఉపయోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు బాలమణి మేడం, విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday, 15 June 2024

Free Textbooks, Workbooks and Uniforms distribution at MPPS Uppununthala Boys

 

విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు పాఠ్యపుస్తకాల పంపిణీ:

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, అభ్యాస పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ఈ నూతన పాఠ్యపుస్తకాలు విద్యార్థుల వికాసానికి ఎంతో తోడ్పడుతాయన్నారు. వీటిని విషయ నిపుణులు, ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగిన వారు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా, విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి కృత్యాల రూపంలో తయారు చేయడం జరిగిందని వివరించారు. ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠ్యపుస్తకాలలోని విషయాలను ఏ విధంగా బోధించాలో కూడా హ్యాండ్ బుక్ లను ప్రతి ఉపాధ్యాయునికి అందించడం జరిగిందని, వీటిలో సూచించిన విధంగా ప్రతి పీరియడ్ ను బోధించాల్సి ఉంటుందని, వెంటనే ఆ పీరియడ్ లో నేర్చుకున్న విషయాన్ని అభ్యాసం చేయడానికి అభ్యాస పుస్తకంలో కృత్యాలు ఇవ్వడం జరిగిందని, 5+1 విధానంలో 5 రోజులు బోధన 6వ రోజు అసెస్మెంట్ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి స్థాయికనుగుణంగా భోధన చేస్తామన్నారు.

Thursday, 13 June 2024

Samoohika Aksharabyasam at MPPS Uppununthala Boys| బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం:

ఈరోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలతో ఉపాధ్యాయులు,విద్యార్థులు నివాళులర్పించడం జరిగింది. పాఠశాలలో ఈ సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థుల పలకలపై అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు శారద, రజిత లు అక్షరాలు దిద్దించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ అక్షరాల ద్వారా, చదువు ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి, మనం పొందిన జ్ఞానాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. జ్ఞానవంతులకు సమాజంలో గౌరవం లభిస్తుంది, అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి ఉపాధ్యాయులు బోధించే విషయాలను శ్రద్ధగా విని, అవగాహన చేసుకుని వాటిని నేర్చుకొని బాగా చదువుకుంటూ భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

District Collector Uday Kumar sir, IAS visits State Best Practices School MPPS Uppununthala Boys

 
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.

రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉందయ్ కుమార్, IAS గారు:

గతంలో పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండే స్థితి నుంచి ఈ రోజు 80 మంది విద్యార్థులు పెరగడానికి చేసిన కృషిని కలెక్టర్ గారు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల సీట్లు వచ్చే లాగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని , దానితో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని, ఈ సంవత్సరం 10 సీట్లతో పాటు ఇప్పటి వరకు 40 సీట్లు సాధించారని, ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గాజుల వెంకటేష్ సార్ తన ఇద్దరి కుమారులు గౌతమ్, రాహుల్ లను ఇదే పాఠశాలలో చదివిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, గ్రామ పెద్దలు మరియు దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్ లు, ప్రింటర్, గురుకుల, నవోదయ స్టడీ మెటీరియల్ మొదలైనవాటిని సమకూర్చుకొని ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ తరగతులు, అబాకస్, చిల్డ్రన్ బ్యాంక్ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ అందరూ సమిష్టిగా, సమన్వయంతో బట్టి విధానంలో కాకుండా పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలతో కృత్యాదార బోధన చేస్తున్నారని, అదేవిధంగా వెంకటేష్ సార్ పాఠశాలకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులు అందరి నెంబర్లను యాడ్ చేయడం ద్వారా అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని, సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు చేయాల్సిన కృత్యాలను, ఇంటి పనిని వాట్సాప్ ద్వారా పంపించి, విద్యార్థులు చేసి పంపించిన వాటిని వాట్సాప్ లోనే దిద్ది విద్యార్థులకు తిరిగి పంపుతూ విద్యార్థులు నిరంతరం అభ్యసనంలో నిమగ్నం అయ్యేటట్లు చూడడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు ఒక వెబ్సైట్ ను , యూట్యూబ్ ఛానల్ తయారు చేసి అందులో విద్యార్థుల చూపిన ప్రతిభను, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను,  పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను అప్లోడ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యాశాఖ అధికారులకు, మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా పాఠశాల గురించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకొని, ఉపాధ్యాయులు కృషిని అభినందిస్తూ, పాఠశాలపై నమ్మకంతో వారి పిల్లలను ప్రైవేటు పాఠశాల నుండి తీసి మన బాలుర ప్రభుత్వ పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ వివరించారు.

అనంతరం కలెక్టర్ గారు విద్యార్థుల ప్రతిభను పరిశీలించి విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. అదేవిధంగా మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కి మంజూరైన నిధులను ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, ఉప్పునుంతల ఏఈ సందీప్ సార్, ఏం.ఐ.యస్ కోఆర్డినేటర్ తిరుపతి గారు, పత్రికా విలేకరులు మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Wednesday, 12 June 2024

World Day Against Child Labour 2024 | ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం


 ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం:

ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలు అందరూ కూడా పనుల్లో చేరకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు. బాలల విద్యాహక్కు, రక్షణ హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి హక్కులను కాపాడటం ప్రభుత్వం, సమాజంలోని వ్యక్తుల అందరి సమిష్టి బాధ్యత అని తెలియజేశారు. బాలలను పనిలో పెట్టుకోవడం నేరము. వారు శారీరకంగా మానసికంగా ఎదుగుతూ భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాలు పొందడానికి విద్యాలయాల్లో సరైన మౌళిక వసతులు అందుబాటులో ఉంచాలి. చదువు ద్వారానే జ్ఞానం, నైతిక విలువలు పొంది ఉత్తమ పౌరులుగా బాలలు తీర్చిదిద్దబడుతారు. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ బడిలో చేరేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం పాఠ్య పుస్తకాలు అందజేశారు.

Tuesday, 23 April 2024

Annual Day Celebrations 2024 at MPPS Uppununthala Boys



ఘనంగా నిర్వహించిన వార్షిక దినోత్సవం: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన వార్షిక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, పాఠశాల AAPC చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు ఈ సంవత్సరం పాఠశాల సాధించిన అభివృద్ధిని, విద్యార్థుల ప్రతిభను, పాఠశాలలో చేపడుతున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దాతలు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, EX MPTC గారు అందించిన రూ. 8000 లతో మరియు యం. నారాయణ, MPO, ఉప్పునుంతల గారు అందించిన రూ. 2000 లతో గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆడేపు మురళి, మస్కూరి అరవింద్, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి, మేకల అక్షర లను శాలువాలతో సన్మానించి, తరగతి వారిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి అవార్డు మెమొంటో లతో పాటు నగదు బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వీయ అభ్యసనానికి తగిన సూచనలు ఇచ్చారు.

నూతనంగా ఎన్నికైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారిని, దాత పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య గారిని, గతంలో పాఠశాలకు 10 కుర్చీలను వితరణ చేసిన దాత పాత్కుల నిరంజన్ గారిని ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Congratulations to students who got 5th gurukula seats in V TGCET 2024



5వ తరగతి గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు: 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా  మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆడేపు మురళి - అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మస్కూరి అరవింద్ - లింగాల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, మేకల అక్షర - వంగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు విద్యార్థులను అభినందించడం జరిగింది. బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి చంద్రశేఖర్ సార్ లు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

Friday, 9 February 2024

V TGCET 2024 Model test has been conducted at MPPS Uppununthala Boys

 








గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మాదిరి పరీక్ష నిర్వహణ: రేపు ఉదయం 11 గం.లకు తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2024 (V TGCET 2024) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సన్నద్దం కావడం కోసం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ విద్యార్థులకు పరీక్ష గురించి ప్రొజెక్టర్ పైన వివరించడం జరిగింది. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను & పరీక్ష ప్యాడ్ తీసుకుని ఒక గంట ముందే అనగా ఉదయం 10 గం.లకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ లో ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న నాలుగు ఆప్షన్ లలో సరైన సమాధానం ఉన్న వృత్తాన్ని పెన్నుతో నల్లగా దిద్దాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు అభ్యాసం కోసం మాదిరి ప్రశ్నాపత్రం&ఓఎంఆర్ షీట్ లను ఇచ్చి మాదిరి పరీక్షను నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, పద్మావతి మేడం లు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్ష బాగా రాసి సీట్లు సాధించాలని ఆకాంక్షించారు.









ప్రొజెక్టర్ పైన విద్యార్థులకు V TGCET 2024 పరీక్ష గురించి వివరిస్తున్న Tr. గాజుల వెంకటేష్ సార్.

Wednesday, 24 January 2024

National Girl Child Day 2024 celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం: ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ మహిళలు నేడు చాలా రంగాల్లో రాణిస్తున్నారని, గొప్ప స్థాయికి చెరుకున్న మహిళల గురించి వివరించారు. పూర్వం నుంచి ఇప్పటివరకు బాలికల పట్ల, మహిళల పట్ల లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆధునిక కాలంలో మహిళలు చాలా రంగాల్లో గొప్ప స్థాయికి చేరుకున్నప్పటికీ, శాస్త్రసాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇంకా బాలికల పట్ల వివక్షత తో భృణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు చిన్నప్పటి నుంచే బాలుర తో సమానంగా చదివించి సమాన అవకాశాలు కల్పిస్తే వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి బాలికలు బాగా చదువుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Tuesday, 23 January 2024

127th Birth Anniversary Celebrations of Subhas Chandra Bose at MPPS Uppununthala Boys

 







ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారు 1897 సంవత్సరంలో జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జానకినాథ్ బోస్, ప్రభావతి లకు జన్మించారని, బాగా చదువుకుని 1920లో భారతీయ సివిల్ సర్వీసు లో 4వ ర్యాంకు సాధించి ఒక సంవత్సరం ఉన్నత ఉద్యోగం చేసి, బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేక రాజీనామా చేసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా కృషి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసి సాయుధ పోరాటం ద్వారానే భారత స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మి దానికి కూడా రాజినామా చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్యం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారు అని వారి సేవలను విద్యార్థులకు వివరించడం జరిగింది. నేతాజీ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Wednesday, 3 January 2024

National women teacher 's day celebrations at MPPS Uppununthala Boys

 






ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 193వ జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ను ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సావిత్రి భాయి ఫూలే గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, శ్రీనివాసులు సార్, జానకి రామ్ సార్ లు మాట్లాడుతూ సావిత్రి భాయి ఫూలే గారు తన భర్త సహకారంతో చదువుకుని శూద్రుల కోసం, బాలికల కోసం 1848 సంవత్సరంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో బాలికలకు, శూద్రులకు చదువుకోవడానికి అవకాశం లేదు. అందుకే కొందరు సావిత్రి భాయి ఫూలే పైన పాఠశాలకు వెళ్ళే సమయంలో బురద నీళ్ళు చల్లుతూ, అవమానకరంగా మాట్లాడేవారు. అయినా పట్టు వదలకుండా 52 పాఠశాలలు ప్రారంభించి విద్య ను అందించారు. అనంతరం సత్య శోదక్ సమాజ్ ద్వారా మూఢనమ్మకాలు రూపుమాపడానికి కృషి చేశారు అని తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు బాలమణి మేడం, అనిత మేడం, పద్మావతి మేడం లను శాలువాతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సన్మానించారు.