Monday, 9 June 2025

Pro Jayashankar Badi bata programme at fields 2025 for enrollment of school age children

పంట పొలాలకి వెళ్ళి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్:

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఏఐ ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి మీ పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. ఈ రోజు 15 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది.అనంతరం గాజుల వెంకటేష్ సమీప పంట పొలాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడి మా బాబు రాహుల్ ఈ బడిలోనే చదువుతున్నాడని, మీ పిల్లలను కూడా మన బడిలో చేర్పించాలని కోరడం జరిగింది.ఉపాధ్యాయులు చందన, సంగీత, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



0 comments:

Post a Comment