Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Friday, 14 November 2025

PTM and National Children's Day 2025 celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం & బాల దినోత్సవం: 

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీతలు మాట్లాడుతూ పిల్లలంటే అమితమైన ఇష్టం కలిగిన మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆయన పిల్లలే దేశ భవిష్యత్తు అని పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి సాధించబడుతుందని వారికోసం ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ,వర్కు పుస్తకాలు, కృత్రిమ మేదతో డిజిటల్ తరగతులు మొ.న అంశాలను వివరించారు .

అనంతరం ఆనందకరమైన బాల్యాన్ని అందించడం అనే అంశం పైన చర్చించడం జరిగింది. పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు, నైతిక విలువలు అందించే కథలు అంటే చాలా ఇష్టం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వేచ్ఛపూరిత వాతావరణంలో, భయం లేకుండా ఆనందకరమైన బాల్యాన్ని గడిపిన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఉత్తమ పౌరులుగా తమ బాధ్యతను నిర్వహిస్తారు కాబట్టి వారి బాల్యాన్ని ఆనందకరంగా తీర్చిదిద్ది వారికి భరోసానిస్తూ వారు సంపూర్ణ మూర్తిమత్వ వికాసం పొందే లాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం కృషి చేయాలని సూచించారు. చాచా నెహ్రూ గారి జీవితాన్ని పూర్తిగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 



అనంతరం కేక్ కోసీ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, ఏఏపిసీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు , విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

Tuesday, 11 November 2025

National Education Day Celebrations 2025

 ఘనంగా జాతియ విద్యా దినోత్సవం:

ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, సంగీత లు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి జైలు జీవితం కూడా గడిపారని, స్వాతంత్య్ర భారత దేశంలో మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా 11 సం.రాలు పని చేసి అందరికీ విద్యను అందించడానికి, విద్యా వ్యాప్తికి విశిష్ట సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్య మనిషికి మూడో నేత్రం లాంటిది. ప్రతి వ్యక్తి విద్య ద్వారానే జ్ఞానాన్ని పొందుతాడని, వాస్తవాలను తెలుసుకోవడం, విషయ పరిజ్ఞానం, విలువలు, విజ్ఞానం వల్ల వ్యక్తిలోని అజ్ఞానం, మూఢనమ్మకాలు తొలగిపోయి పరిపూర్ణ వ్యక్తిగా మారుతారని, సమాజాన్ని సరైన విధంగా అవగాహన చేసుకొంటారని, జీవితంలో సౌకర్యవంతమైన గొప్ప స్థాయికి ఎదుగుతారని, సమాజంలో గౌరవం పొందుతారని తెలియజేశారు.

Condolences Programme of great Poet and write Ande Sri 2025

తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ గారికి ఘనమైన నివాళులు:

అందెశ్రీ గారి మృతికి సంతాపంగా ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ముందుగా వారికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 ని.లు విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ మాట్లాడుతూ ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారని, సమాజంలోని విషయాలు, ప్రకృతిలోని విషయాలపైన ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నో పాటలు రాశారని, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఇటీవల రూ.కోటి పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య, ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట అని, 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వచ్చిందని, 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారని, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్న అందెశ్రీ

ఉదయం 7:25 గం.లకి గాంధీ ఆసుపత్రిలో అమరుడైనారని తెలియజేశారు. ఆయన మన నుంచి భౌతికంగా దూరమైనా ఆయన రచనలు, పాటలు మనల్ని నిత్యం చైతన్యం చేస్తాయని వారి స్పుర్థితో బాగా చదువుకుని, సమాజాన్ని అవగాహన చేసుకొని, భవిష్యత్తులో సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.