ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను 5 గ్రూపులుగా చేసి జనరల్ నాలెడ్జ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన మధనాగుల ప్రణవి గ్రూప్ సభ్యులకి పెన్నులు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి జనరల్ నాలెడ్జ్ పై పట్టు సాధించాలన్నారు. సమాజాన్ని అవగాహన చేసుకుంటేనే భవిష్యత్తులో భావి భారత ఉత్తమ పౌరులుగా తయారవుతారు. దీని వల్ల భవిష్యత్తులో రాబోయే అన్ని పోటీ పరీక్షలకు కావలసిన ప్రాథమిక సమాచారం తెలుస్తోంది, ఇలాంటి క్విజ్ ల వల్ల విద్యార్థుల్లో పోటి తత్వం పెరిగి జ్ఞాన సముపార్జనకు సంసిద్ధులు అవుతారు.దానితో పాటు పుస్తక పఠనం అలవడుతుంది, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. గ్రూప్ లలో చర్చిస్తారు కాబట్టి సహకారం అలవడుతుంది.కాబట్టి విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే జనరల్ నాలెడ్జ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
0 comments:
Post a Comment