Saturday, 6 December 2025
Babasaheb Dr BR Ambedkar's 69th death anniversary programme at MPPS Uppununthala Boys
Thursday, 4 December 2025
Indian Navi Day Celebrations at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అద్యక్షతన భారత దేశ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ భారత దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలైన సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళాల్లో నావికా దళం ప్రధానమైనదని ఇది భారత దేశ తీర ప్రాంతం గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 11 వేల 98 కిలోమీటర్ల మేర దేశాన్ని శత్రు దేశాల నుంచి నిత్యం కాపాడుతుంది అని భారత దేశ పటాన్ని చూపిస్తూ వివరించడం జరిగింది.
పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విజయం సాధించడంలో 1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణ కోసం నావికా దళంలో పనిచేసిన సైనికుల త్యాగాలను గౌరవించాలని సూచించారు. వారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Wednesday, 3 December 2025
World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.
బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Tuesday, 2 December 2025
National Pollution Control Day 2025 at MPPS Uppununthala Boys
ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు పాఠశాల ప్రహరీ గోడ వెంబడి మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తరగతి వారిగా విద్యార్థులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మూడు రకాల కాలుష్యాలు వాటి నియంత్రణ మార్గాలను విద్యార్థులకు వివరిస్తూ భూమి కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాయు కాలుష్య నివారణకు మొక్కలు పెంచాలని, జల కాలుష్య నివారణకు వ్యర్థ పదార్థాలను నీటిలో కలుపొద్దని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని మనకు అవసరం అయ్యే ఆక్సిజన్ ను ఇస్తాయని, వర్షాలు కురవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయని వివరించారు. అందుకే చెట్లను నరుకొద్దని, వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలియజేశారు. కాలుష్యం నుంచి ప్రకృతి ని రక్షించి భావి తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని, అందరూ పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.


















