Saturday, 6 December 2025
Babasaheb Dr BR Ambedkar's 69th death anniversary programme at MPPS Uppununthala Boys
Thursday, 4 December 2025
Indian Navi Day Celebrations at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అద్యక్షతన భారత దేశ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ భారత దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలైన సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళాల్లో నావికా దళం ప్రధానమైనదని ఇది భారత దేశ తీర ప్రాంతం గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 11 వేల 98 కిలోమీటర్ల మేర దేశాన్ని శత్రు దేశాల నుంచి నిత్యం కాపాడుతుంది అని భారత దేశ పటాన్ని చూపిస్తూ వివరించడం జరిగింది.
పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విజయం సాధించడంలో 1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణ కోసం నావికా దళంలో పనిచేసిన సైనికుల త్యాగాలను గౌరవించాలని సూచించారు. వారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Wednesday, 3 December 2025
World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.
బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Tuesday, 2 December 2025
National Pollution Control Day 2025 at MPPS Uppununthala Boys
ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు పాఠశాల ప్రహరీ గోడ వెంబడి మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తరగతి వారిగా విద్యార్థులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మూడు రకాల కాలుష్యాలు వాటి నియంత్రణ మార్గాలను విద్యార్థులకు వివరిస్తూ భూమి కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాయు కాలుష్య నివారణకు మొక్కలు పెంచాలని, జల కాలుష్య నివారణకు వ్యర్థ పదార్థాలను నీటిలో కలుపొద్దని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని మనకు అవసరం అయ్యే ఆక్సిజన్ ను ఇస్తాయని, వర్షాలు కురవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయని వివరించారు. అందుకే చెట్లను నరుకొద్దని, వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలియజేశారు. కాలుష్యం నుంచి ప్రకృతి ని రక్షించి భావి తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని, అందరూ పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
Saturday, 29 November 2025
Spell bee competition conducts on 29/11/2025, Saturday
ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఆలూరి శ్రీజ గ్రూప్ సభ్యులు బొల్లె చక్రవర్తి, మధనాగుల ప్రవీణ్, మధనాగుల మీనాక్షి, మధనాగుల శ్రుతి, బొల్గం మినీశ్వర్, పాత్కుల ఆర్య మొదటి బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అభినందనలు తెలియజేసి, పెన్సిల్ లు బహుమతిగా అందజేశారు. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Friday, 28 November 2025
Mahathma Jyothi Rao Phule's 135th death anniversary programme at MPPS Uppununthala Boys
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే గారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి కి చదువు నేర్పి, ఆమెతో కలిసి 1848 వ సంవత్సరం నుంచి బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి, ఎన్నో అవమానాలను, అడ్డంకులను, కుట్రలను ఎదుర్కొని విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, వారు 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని, గులాం గిరీ పుస్తకం రచించి అత్యధిక ప్రజలు మానసిక బానిసత్వం నుండి విముక్తి కావాలని అందుకు విద్యను ఆయుధంగా తీసుకోవాలి అన్నారు. వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Tuesday, 25 November 2025
Constitution Day 2025 Celebrations at MPPS Uppununthala Boys
ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి రాజ్యాంగ పీఠిక ను పఠనం చేయడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 2 సం.రాల 11 నెలల 18 రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించడం జరిగిందని, ఇది నవంబర్ 26, 1949 లో ఆమోదించడం జరిగిందని, ఆ సందర్భంగా ఈ రోజు రాజ్రాయాంగం దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు. అదేవిధంగా రాజ్యంగ పీఠిక లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, జాతీయ సమగ్రత పదాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా దేశ పౌరులు అందరూ సమానంగా ఎదిగే విధంగా, సమాన గౌరవం పొందే విధంగా అన్ని రంగాల్లో అందరూ భాగస్వామ్యం అయ్యే విధంగా భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కులు, దేశ భక్తి ని, దేశాభివృద్ధి లో పౌరుల భాద్యతలను తెలిపే ప్రాధమిక విధులను, అందరికీ ఆర్థికంగా, సామాజిక న్యాయం అందించడానికి ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగిందని, ప్రస్తుతం రాజ్యాంగం మొత్తం 470 ఆర్టికల్ లు, 12 షెడ్యూల్, 25 భాగాలుగా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది అని తెలియజేశారు. రాజ్యాంగం స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని హక్కులు ఉపయోగించుకొని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.





















