ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమం:
ఈ రోజు ఉదయం 10:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ , చందన, సంగీత లు అబ్దుల్ కలాం గారు మన దేశానికి చేసిన సేవలను గురించి వివరిస్తూ వారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో 1931, అక్టోబర్ 15న జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. తల్లి ఆషియమ్మ గృహిణి వాళ్ళ నాన్న జైనులబ్దీన్ పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లో పనిచేసి, 1980లో ఎస్ఎల్వి 3 ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. దేశ రక్షణ వ్యవస్థకు ఎన్నో మిసైల్ లను అభివృద్ధి చేసి అందించారు. 1998 సం.లో పోక్రాన్ అను పరీక్షలు విజయవంతంగా నిర్వహించి భారత దేశాన్ని రక్షణ రంగంలో పఠిష్ట పరిచారు. 11వ భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. షిల్లాంగ్ లో 2015, జూలై 27న యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన జీవితాంతం దేశానికి సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారు పేద కుటుంబంలో జన్మించినప్పటికి బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగారు కాబట్టి విద్యార్థులు కూడా కలాం గారి స్పూర్తితో బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.