Monday, 25 August 2025
Our School Teacher has been selected for National Level Educational Training
Saturday, 23 August 2025
National Space Day Celebrations 2025 - Rocket Experiment at MPPS Uppununthala Boys
Friday, 22 August 2025
Students play chess game at MPPS Uppununthala Boys
బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాలమూరు ఎఆర్ఐ ఫోరం వారు అందించిన చదరంగం బోర్డులతో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అవగాహన కల్పిస్తూ చదరంగం ఆట పైన ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులు చదరంగం ఆడటం వల్ల వారిలో మేధో వికాసం అభివృద్ధి చెందుతుందని, ఆట నియమాలు తెలుసుకొని, క్రమశిక్షణతో గెలవడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషించడం, ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం, వేగంగా ఖచ్చితత్వంతో ఆలోచించడం, విజయం కోసం ఓపికతో వ్యవహరించడం, గెలుపు ఓటముల ను సమానంగా స్వీకరించడం ద్వారా వారు విద్యలో కూడా రాణిస్తారని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ చదరంగం బోర్డులు అందజేసిన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకులు రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Tuesday, 12 August 2025
Uppununthala MEO Chandra Shekhar sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కూడా చెప్పలేని విధంగా ఈ 4,5 తరగతుల విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ను చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, ఈ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నందున మరొక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఎం.ఈ.వో గారిని కోరడం జరిగింది.
Monday, 11 August 2025
National Deworming Day Programme at MPPS Uppununthala Boys
Tuesday, 5 August 2025
91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir
ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు.
బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tuesday, 29 July 2025
RBSK team visit and screen all the students and give medicine at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 11 గం.లకు రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమంల(RBSK) లో భాగంగా డాక్టర్ మంగ, డాక్టర్ మహేశ్వర్, ఫార్మసిస్ట్ రాజు, ఏ.ఎన్,యం రేణమ్మ లు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల, ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆటలు ఆడాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు అని తెలియజేశారు. వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.