Tuesday, 23 December 2025
5th Gurukula Entrance Material Distribution on the occasion of National Farmer's Day 2025 at MPPS Uppununthala Boys
National Mathematics Day 2025 Programme at MPPS Uppununthala Boys
ఘనంగా జాతీయ గణిత దినోత్సవం:
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో గొప్ప గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రామానుజన్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు, అనంతరం ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు చందన లు మాట్లాడుతూ రామానుజన్ గారు గణితం పైన మక్కువతో సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, గణిత విశ్లేషణ వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచారు, 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించారు, కానీ 1729 వంటి సంఖ్యల ద్వారా చిరస్మరణీయులయ్యారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల పైనా నేటికీ ఎందరో పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వారి స్పూర్తితో విద్యార్థులు గణితం తో పాటు అన్ని విషయాలు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
Saturday, 20 December 2025
International Meditation Day Programme 2025 at MPPS Uppununthala Boys
డిసెంబర్ 21 రేపు ఆదివారం కావడంతో ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
Nutritious Food Festival at MPPS Uppununthala Boys in the PTM
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పిటిఎం) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేయడానికి పోషక ఆహారోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పౌష్టికాహారం అందించాలని, పౌష్టికాహారం అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే పదార్థాలు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. స్థూల పోషకాలు అయిన పిండి పదార్థాలు 60%, మాంసకృత్తులు 15%, క్రొవ్వులు 25% తీసుకోవాలని, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి అని తెలియజేశారు. దీన్నే సమతుల ఆహారంగా చెప్తారు. పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలకు వారానికి మూడు గుడ్లు, రాగి జావ, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు జంక్ ఫుడ్ తినకుండా, ఇంట్లో చేసిన తాజా ఆహారం తీసుకోవాలి అని సూచించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేసుకొని వచ్చిన పోషకాలు కలిగిన, రుచికరమైన వంటకాలను ప్రదర్శించి,వాటి తయారీ విధానం, ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Saturday, 6 December 2025
Babasaheb Dr BR Ambedkar's 69th death anniversary programme at MPPS Uppununthala Boys
Thursday, 4 December 2025
Indian Navi Day Celebrations at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అద్యక్షతన భారత దేశ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ భారత దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలైన సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళాల్లో నావికా దళం ప్రధానమైనదని ఇది భారత దేశ తీర ప్రాంతం గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 11 వేల 98 కిలోమీటర్ల మేర దేశాన్ని శత్రు దేశాల నుంచి నిత్యం కాపాడుతుంది అని భారత దేశ పటాన్ని చూపిస్తూ వివరించడం జరిగింది.
పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విజయం సాధించడంలో 1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణ కోసం నావికా దళంలో పనిచేసిన సైనికుల త్యాగాలను గౌరవించాలని సూచించారు. వారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Wednesday, 3 December 2025
World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.
బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.





















