Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Tuesday, 23 December 2025

5th Gurukula Entrance Material Distribution on the occasion of National Farmer's Day 2025 at MPPS Uppununthala Boys

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ వితరణ: 

 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ రైతు దినోత్సవాన్ని సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంగీత మాట్లాడుతూ రైతు నాయకులు, దేశ 5వ ప్రధాని చరణ్ సింగ్ గారు రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని అందుకే ఆయన పుట్టిన రోజున జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, రైతులు ఎన్నో కష్టనష్టాలను, కన్నీళ్ళను ఎదుర్కొని పంటలు పండించడం ద్వారా మనకు ఆహారం లభిస్తుందని, వారి గొప్ప సేవలు, త్యాగాలు దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ ప్రజల ఆకలి తీర్చడంలో వెలకట్టలేనివని, మా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు అందరూ రైతులే అని వారి కృషి వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నామని అందుకే రైతులను మనందరం గౌరవించాలని, వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టీచర్ విజయ్ కుమార్ సార్ అందించిన గురుకుల మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. సార్ కి కృతజ్ఞతలు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని గురుకుల సీట్లు సాధించాలని కోరారు.

National Mathematics Day 2025 Programme at MPPS Uppununthala Boys

 ఘనంగా జాతీయ గణిత దినోత్సవం: 

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో గొప్ప గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రామానుజన్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు, అనంతరం ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు చందన లు మాట్లాడుతూ రామానుజన్ గారు గణితం పైన మక్కువతో సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, గణిత విశ్లేషణ వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచారు, 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించారు, కానీ 1729 వంటి సంఖ్యల ద్వారా చిరస్మరణీయులయ్యారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల పైనా నేటికీ ఎందరో పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వారి స్పూర్తితో విద్యార్థులు గణితం తో పాటు అన్ని విషయాలు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Saturday, 20 December 2025

International Meditation Day Programme 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవం:

డిసెంబర్ 21 రేపు ఆదివారం కావడంతో ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా మనస్సు ను అదుపు చేయవచ్చు అని, తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది అని, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత ఏర్పడి సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుందని, ప్రశాంతత ఏర్పడుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయాలని తద్వారా ఏకాగ్రత పెరిగి చదువు లో రాణించవచ్చు అని తెలియజేశారు. ధ్యానంతో నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది అని, మన బలాలు, బలహీనతలు తెలుసుకొని, చెడు అలవాట్లు దూరం చేసుకొని మంచి వ్యక్తిగా మారుతారని ఇన్ని ప్రయోజనాలు ఉన్న ధ్యానం ను అందరూ ఆచరించాలని సూచించారు. విద్యార్థులు పాల్గొన్నారు.


 

Nutritious Food Festival at MPPS Uppununthala Boys in the PTM

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా పోషక ఆహారోత్సవం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పిటిఎం) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేయడానికి పోషక ఆహారోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పౌష్టికాహారం అందించాలని, పౌష్టికాహారం అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే పదార్థాలు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. స్థూల పోషకాలు అయిన పిండి పదార్థాలు 60%, మాంసకృత్తులు 15%, క్రొవ్వులు 25% తీసుకోవాలని, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి అని తెలియజేశారు. దీన్నే సమతుల ఆహారంగా చెప్తారు. పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలకు వారానికి మూడు గుడ్లు, రాగి జావ, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు జంక్ ఫుడ్ తినకుండా, ఇంట్లో చేసిన తాజా ఆహారం తీసుకోవాలి అని సూచించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేసుకొని వచ్చిన పోషకాలు కలిగిన, రుచికరమైన వంటకాలను ప్రదర్శించి,వాటి తయారీ విధానం, ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Saturday, 6 December 2025

Babasaheb Dr BR Ambedkar's 69th death anniversary programme at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగీత అంబేద్కర్ గారు విద్యా గొప్ప స్థాయికి ఎదిగిన తీరును, వారు దేశానికి చేసిన సేవలను వివరిస్తూ అంబేద్కర్ గారిని బడిలోకి రానివ్వకున్న గుమ్మం బయట కూర్చోని ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో శ్రద్ధగా చదువుకుని, విదేశాలకు వెళ్ళి ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లలో చదువుకుని ప్రపంచ మేధావిగా ఎదిగి భారత రాజ్యాంగం రాసి అందులో భరత దేశ ప్రజలు అందరూ ఎదిగే విధంగా అందరికీ అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండే విధంగా అవకాశాలను, హక్కులను కల్పించి నా లాంటి కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Thursday, 4 December 2025

Indian Navi Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా భారతదేశ నౌకాదళ దినోత్సవం:

ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అద్యక్షతన భారత దేశ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ భారత దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలైన సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళాల్లో నావికా దళం ప్రధానమైనదని ఇది భారత దేశ తీర ప్రాంతం గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 11 వేల 98 కిలోమీటర్ల మేర దేశాన్ని శత్రు దేశాల నుంచి నిత్యం కాపాడుతుంది అని భారత దేశ పటాన్ని చూపిస్తూ వివరించడం జరిగింది.



పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విజయం సాధించడంలో 1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణ కోసం నావికా దళంలో పనిచేసిన సైనికుల త్యాగాలను గౌరవించాలని సూచించారు. వారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Wednesday, 3 December 2025

World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం:

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.

బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సాధారణ పిల్లలవలె సాధారణ పాఠశాలలో చదువుకునే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు.అనంతరం ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు కడుకుంట్ల రాజవర్ధన్ రెడ్డి మరియు సంగీత , విజయ్ కుమార్ లు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం విద్యాపరంగా కల్పిస్తున్న సౌకర్యాలను మరియు రాయితీల గురించి తెలిపారు. అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్ గారు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మరియు ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు రాజవర్ధన్ రెడ్డి, సంగీత, ఐఈఆర్ పి విజయ్ కుమార్, చందన, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ తిరుపతి, సి ఆర్ పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.