Wednesday, 11 March 2026

Self Government Day 2026 at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం:


ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠశాల విధులు నిర్వహించారు. కలెక్టర్ గా వరున్ తేజ్, డీఈవో గా యశ్వంత్, ఎం.ఈ.ఓ గా అలేఖ్య, కాంప్లెక్స్ హెచ్.ఎం గా చంటి, ప్రధానోపాధ్యాయులు గా శ్రీజ లు వ్యవహరించారు. ఛాత్రోపాధ్యాయులుగా విద్యార్థులు చేసిన బోధనా కౌశలాలను ముఖ్య అతిథులుగా హాజరైన ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ పరిశీలించి వారికి అభినందనలు తెలియజేసి, మీరు ఈ రోజు పొందిన ఆనందం భవిష్యత్తులో పొందాలంటే బాగా చదువుకుని మీ లక్ష్యాలను సాధించాలని ఆశీర్వదించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఆంజనేయులు, చందన, సంగీత లు విద్యార్థులను అభినందించి, బహుమతులు అందచేశారు. జిల్లా తనిఖీ బృందం అధికారి కేతావత్ బిచ్య నాయక్, సభ్యులు రవిందర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment