Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Saturday, 17 August 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys for August 2024

 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి సారి ఒక విషయం పైన చర్చించడం జరుగుతుంది అని ఈ సారి భాద్యత గల పౌరులను తయారు చేయడం గురించి వివరిస్తూ విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు తెలుసుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని పాటించాలని వారిని చూసి విద్యార్థులు నేర్చుకుంటారన్నారు. ముఖ్యంగా స్వేచ్ఛ, బాధ్యత, గౌరవం, దయ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. వీటిని తల్లిదండ్రులు కూడా పాటించాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని వివిధ విషయాల్లో తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

Thursday, 15 August 2024

78th Independence Day Celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు!
ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులు
ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులు
ఉదయం 6 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 78 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ప్రభాత భేరితో ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేశాధారణ ధరించి వీధులన్నీ తిరుగుతూ భారతీయ వీరులం భరతమాత బిడ్డలం శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం అనీ పాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గొంతెత్తి నినదిస్తూ ఉప్పొంగిన ఆనందంతో దేశంపై గౌరవాన్ని చాటారు.
జాతీయ జెండా ఎగురవేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ 
ఉదయం 8 గం.లకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి  జెండా వందనం చేశారు. మహనీయులు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు మొ.న వారి త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్ర్యం పొందినం. వారి ఆశయ సాధనకు విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు 
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
విజేతలకు బహుమతులు అందజేస్తున్న సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు 
సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tuesday, 6 August 2024

90th Birth Anniversary Celebrations of Prof Jayashankar sir

 

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్. ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ పాల్గొన్నారు. ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం బిచ్యా నాయక్ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, బాలమణి మేడం, చందన మేడం లు, ఆలూరి లింగమయ్య, జెర్మయ్య గారు జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమాన్ని హెచ్.ఎం శ్రీనివాసులు సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి సార్, పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, పి.ఆర్.టి.యు రాష్ట్ర నాయకులు బిచ్యా నాయక్ సార్, ఎ.ఎ.పి.సి చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి పదోన్నతిపై వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు  బాలమణి మేడంను శాలువ, పూలదండతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి ప్రతి సంవత్సరము గురుకుల సీట్లు వచ్చేలా కృషి చేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 85 కి పెంచారని వివరించారు. అదేవిధంగా బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు చందన మేడంను శాలువ, పూలదండతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు గారు, జెర్మయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నాగరాజు గారు, ఆర్.కృష్ణ గారు, రతన్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 3 August 2024

Spelling Bee Competition at MPPS Uppununthala Boys

 

స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఎదురిశెట్టి వరున్ తేజ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు ఆలూరి అక్షర గ్రూప్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు, వీరికి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.