Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Saturday, 20 July 2024

Parent Teacher Meeting has been conducted at MPPS Uppununthala Boys

 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. పాఠశాల అవసరాలను తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి లింగమయ్య, బొల్లె పర్వతాలు, ఆలూరి తిరుపతయ్య, సున్నం కురుమయ్య,మల్లయ్య, సునిత, శారద, శిరీష, లలిత, కల్పన, యాదమ్మ, వెంకటమ్మ, చంద్రకళ, శ్రీలత, అనిత, సైదమ్మ, శైలజ, రాధ, బాలమ్మ, విజయ, బి.అనిత, సుహాసిని, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 18 July 2024

Navodaya Classes Start at MPPS Uppununthala Boys

 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నవోదయ తరగతులు ప్రారంభం:

నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందని, పరీక్ష జనవరి 18, 2025 న నిర్వహిస్తారని, ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నవోదయ తరగతులు ఈ రోజు నుండి మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం తెలియజేశారు. అదేవిధంగా మన పాఠశాలలో సైనిక్ పాఠశాలల్లో, గురకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార బోధన చేస్తున్నామని, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వం కోసం అహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, బాలురకు హాస్టల్ వసతి ఉన్నందున ఈ గ్రామం విద్యార్థులతో పాటు, పరిసర గ్రామాల విద్యార్థులు మన పాఠశాలలో ప్రవేశం పొంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ తెలియజేశారు.

Friday, 12 July 2024

Teacher's Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి బదిలీ పైన వెళ్లిన ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ ను, ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, పద్మావతి మేడం లను శాలువాలతో, పూల దండలతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 81 కి పెంచడం జరిగిందని వివరించారు. అదేవిధంగా వారి స్థానంలో బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయురాలు చందన మేడం లను శాలువాలతో, పూల దండలతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య గారు, డి.టి.ఎఫ్ నాయకులు రామస్వామి సార్, సమీప పాఠశాలల ఉపాధ్యాయులు జానకి రాములు సార్, శ్రీనివాసులు సార్, విద్యార్థుల తల్లిదండ్రులు బొల్లె పర్వతాలు, ఆలూరి వెంకటేష్, కాలూరి భారతి, భాజ అనిత, ఆలూరి సుహాసిని, మధనాగుల కవిత మరియు విద్యార్థులు పాల్గొని సన్మానించారు.