గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు:
5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2025 మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాల్లో మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆలూరి అక్షర, బొల్లె తన్వి, ఆలూరి పూజిత లు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, ఎదురిశెట్టి కీర్తన - మహాత్మా జ్యోతిబాఫూలే బి.సీ గురుకుల పాఠశాల వెల్లూరులో, ఇప్పటి భవ్య శ్రీ - సాధారణ గురుకుల పాఠశాల బోరబండలో, ఎదురిశెట్టి వరున్ తేజ్ - సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల అచ్చంపేటలో, బొల్గం మహెందర్ గౌడ్ - మహాత్మ జ్యోతిబాఫూలే బి.సి గురుకుల పాఠశాల కేశంపేటలో సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడంలు విద్యార్థులను అభినందించి బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ లు ఉపాధ్యాయుల సేవలను అభినందించారు.
0 comments:
Post a Comment