Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Wednesday, 15 October 2025

Dr. APJ Abdul Kalam 's 94th birth anniversary celebrations 2025

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమం:

ఈ రోజు ఉదయం 10:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 94 జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ , చందన, సంగీత లు అబ్దుల్ కలాం గారు మన దేశానికి చేసిన సేవలను గురించి వివరిస్తూ వారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో 1931, అక్టోబర్ 15న జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. తల్లి ఆషియమ్మ గృహిణి వాళ్ళ నాన్న జైనులబ్దీన్ పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లో పనిచేసి, 1980లో ఎస్ఎల్వి 3 ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించారు. దేశ రక్షణ వ్యవస్థకు ఎన్నో మిసైల్ లను అభివృద్ధి చేసి అందించారు. 1998 సం.లో పోక్రాన్ అను పరీక్షలు విజయవంతంగా నిర్వహించి భారత దేశాన్ని రక్షణ రంగంలో పఠిష్ట పరిచారు. 11వ భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. షిల్లాంగ్ లో 2015, జూలై 27న యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన జీవితాంతం దేశానికి సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారు పేద కుటుంబంలో జన్మించినప్పటికి బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగారు కాబట్టి విద్యార్థులు కూడా కలాం గారి స్పూర్తితో బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Friday, 10 October 2025

Uppununthala Complex HM Srinivas Reddy sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరిశీలించి అభినందించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి:

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. స్పోకెన్ ఇంగ్లీష్ ను విద్యార్థులు చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, వారికి తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ఏం రోజు పాఠం ఆ రోజు నేర్చుకోవాలని, నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని, చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను, పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు, విద్యార్థులకు అందిస్తున్న రాగి జావను పరిశీలించారు.