ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం: ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ మహిళలు నేడు చాలా రంగాల్లో రాణిస్తున్నారని, గొప్ప స్థాయికి చెరుకున్న మహిళల గురించి వివరించారు. పూర్వం నుంచి ఇప్పటివరకు బాలికల పట్ల, మహిళల పట్ల లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆధునిక కాలంలో మహిళలు చాలా రంగాల్లో గొప్ప స్థాయికి చేరుకున్నప్పటికీ, శాస్త్రసాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇంకా బాలికల పట్ల వివక్షత తో భృణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు చిన్నప్పటి నుంచే బాలుర తో సమానంగా చదివించి సమాన అవకాశాలు కల్పిస్తే వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి బాలికలు బాగా చదువుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
0 comments:
Post a Comment