Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Tuesday 29 August 2023

Telugu Language Day celebrations 2023 at PS Uppununthala Boys

💐అందరికీ తెలుసు భాషా దినోత్సవం శుభాకాంక్షలు 🌹






కవి గిడుగు రామమూర్తి జన్మ దినం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు మాతృ భాష దినోత్సవం/తెలుగు భాష దినోత్సవాన్ని మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు పద్యాల పోటీ, గేయాల పోటీ నిర్వహించడం జరిగింది.ప్రతిభ కనబరిచి విజేతలు నిలిచిన ప్రవీణ, సిరి, తన్వి, అలేఖ్య, రాహుల్, తేజ శ్రీ లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మన మాతృభాష తెలుగు గొప్పతనం గురించి మాట్లాడుతూ అమ్మ ఒళ్ళో ఉన్నప్పటి బాల్యం నుంచే మనం తెలుగును నేర్చుకోవడం జరుగుతుంది అని అందుకే మనకు మాతృభాష లోనే ఏ విషయాన్ని అయినా చాలా సులువుగా అవగాహన చేసుకుంటాము. ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని మాతృ భాషతో అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి మాతృ భాషపై పట్టు సాధిస్తేనే ఇతర ఇంగ్లీష్, హిందీ వంటి భాషలను సులభంగా నేర్చుకోగలము. కాబట్టి విద్యార్థులు అందరూ తెలుగు పాఠ్య పుస్తకాలను, గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి తెలుగు భాషలోని వ్యాకరణం, పద్యాలు, గేయాలు, పాటలు, నీతి కథలు, కవితలు చదివి తెలుగు భాషపై పట్టు సాధించాలి అని విద్యార్థులకు సూచించారు.

Thursday 24 August 2023

Chandrayan-3 landing on moon has been shown to PS Uppununthala Boys students

Chandrayan-3 landing on moon has been shown to PS Uppununthala Boys students:


















🚀👌👍చంద్రయాన్-3 ల్యాండింగ్ ను విద్యార్థులకు ప్రొజెక్టర్ స్క్రీన్ పై చూపించడం జరిగింది అదేవిధంగా చంద్రయాన్-3 గురించి వివరించి, విద్యార్థులు అందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి సూచించి, ISRO శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.🌹💐🌹👍

Saturday 19 August 2023

Two computers donate to PS Uppununthala Boys by Emmadi Saidulu sir, Software Employee & Motamari Madhu sir, Professor, PU

 











తేది. 19-08-2023 ఉదయం 10 గం.లకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (Parent Teacher Meeting) లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు, PU ప్రొఫెసర్ మోటమారి మధు గారు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 30వేల రూపాయలతో 2 కంప్యూటర్లను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు దాతలను ఘనంగా శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కాంప్లెక్స్ హెచ్ఎం హన్మంతు రెడ్డి సార్, హెచ్ఎం లక్ష్మీ నారాయణ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాతలు సైదులు గారు, మధు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే  పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్లను ఇస్తున్నామని, తాము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి చేరుకొన్నామని విద్యార్థులు కూడా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


ఈ సమావేశంలో సైదులు గారి శ్రీమతి భారతి గారు, పి.హెచ్.డి స్కాలర్ మహదేవ్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీను గారు, మల్లేష్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Saturday 5 August 2023

Spell Bee Competition at PS Uppununthala Boys

స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

 మొదటి బహుమతి విజేతలు: 











రెండవ బహుమతి విజేతలు:









ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఆరు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన గాజుల గౌతమ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు నడిగడ్డ కిరణ్ గ్రూప్ రెండవ బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా  ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ ని బాగా నేర్చుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.