Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Saturday 30 December 2023

New year celebrations 2024 at MPPS Uppununthala Boys | Goodbye 2023 and Welcome 2024










2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం: ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో కేకు కోసి 2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సంవత్సరంలో పాఠశాలలో జరిగిన వివిధ సంఘటనలను నెమరు వేసుకోవడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ ఈ ఒక్క రోజుకే సంతోషం పరిమితం కాకుండా అందరూ విద్యార్థులు గత సంవత్సరం చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలని, ఓటములనే విజయానికి మెట్లుగా మలుచుకోవాలని, వచ్చే సంవత్సరం చెడు అలవాట్లు వదులుకుని, మంచి అలవాట్లు అలవర్చుకొని, పరిశుభ్రత పాటిస్తూ, సత్ప్రవర్తనతో, లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి కృషి చేస్తూ, బాగా చదువుకొంటూ, ఆటపాటలతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరమేష్ గారు, స్వర్ణ గారు, అనిత గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Saturday 23 December 2023

Navodaya and Gurukula Schools Entrance study material distribution by Saidulu Emmadi, Soft. Emp

 






విద్యార్థులకు నవోదయ, గురుకుల స్టడీ మెటీరియల్ పంపిణీ:ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల 4వ తరగతి విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్, 5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ లను మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు తన మాతృ మూర్తి సరస్వతమ్మ గారితో కలిసి అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో దాత సైదులు గారు మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ స్థాయికి చేరుకున్న కాబట్టి పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగపడే ఈ స్టడీ మెటీరియల్ అందిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని నవోదయ, గురుకుల సీట్లు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని మీరు కూడా పేద వారికి సహాయం చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు, విద్యార్థులు దాత సైదులు గారికి, సరస్వతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతలను శాలువాతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో PHD స్కాలర్ మహదేవ్,కుర్మయ్య, పరిమేష్ పాల్గొన్నారు.

Friday 22 December 2023

National Mathematics Day celebrations 2023 | Mathematics TLM Mela

 

BPS ఉప్పునుంతల పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం నిర్వహణ:
భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకుని బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈ రోజు మధ్యాహ్నం 3గం.లకు గణిత బోధనోపకరణాల మేలా(Mathematics TLM Mela)ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మేలాకు ముఖ్య అతిథులుగా పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ హాజరై, గణితం అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిదని గణితం ఉపయోగించకుంటే ఆ విషయంలో పరిపూర్ణత ఉండదు కాబట్టి అంతా ప్రాధాన్యత ఉన్న గణితాన్ని TLM ఉపయోగించి ఆసక్తితో నేర్చుకోవాలని, గణిత ప్రాముఖ్యతను వివరించారు. గణిత ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, పద్మావతి మేడం లు మాట్లాడుతూ అమూర్థమైన గణితాన్ని విద్యార్థులు అర్థం చేసులేక గణితం అంటే భయపడుతుంటారు. కొందరు విద్యార్థులు గణితం అర్థం చేసుకోలేక గణితం అంటే అనాసక్తి ఏర్పడి చదువు మధ్యలో ఆపేస్తుంటారు. అలాంటి గణిత భావనలను ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవగాహన చేయించాలంటే బోధన అభ్యసన ప్రక్రియలో భోధనోపకరణాలు/TLM వినియోగించాలి. బట్టి విధానం కాకుండా కృత్యాధార బోధన పద్దతిలో భోధనోపకరణాలు ఉపయోగించి కృత్యాల ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, చేయడం ద్వారా అభ్యసనం వల్ల విద్యార్థులు భయం లేకుండా స్వేచ్ఛగా చాలా ఆసక్తిగా కృత్యాలలో పాల్గొని, ఇష్టంగా గణిత భావనలు సులువుగా అవగాహన చేసుకుంటారు, అంతేకాకుండా వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు అని వివరించారు. సంఖ్యలను పోల్చడం, చతుర్విధ ప్రక్రియలు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారంలను, ఎక్కాలు, భిన్నాలు, పొడవు, బరువు, పరిమాణం, కాలం, వివిధ ఆకారాలు, వాటి చుట్టు కొలత, వైశాల్యం లను కనుగొనడం లాంటి గణిత భావనలను TLM సహాయంతో చూస్తూ, చేస్తూ సులువుగా నేర్చుకోవచ్చు అని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను గణితం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు బాలమణి మేడం లు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గారు 33 సం.రాల తక్కువ జీవిత కాలంలోనే గణిత శాస్త్రంలో విశేష కృషి చేసి గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్దాంతం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలకు సంబంధించి 3900 సూత్రాలు కనిపెట్టి గణిత మేధావి గా ప్రశంసలు పొందారు. కాబట్టి రామానుజన్ గారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు గణితంలో, చదువులో రాణించాలని సూచించారు. ఈ గణిత మేలాలో పొరుగు పాఠశాలల HM లు విజయ్ కుమార్ సార్, నరసింహ రెడ్డి సార్, ఉపాధ్యాయులు అమీర్ పాషా సార్, భాస్కర్ సార్, CRP నరేష్ సార్ మరియు విద్యార్థులు పాల్గొని వివిధ TLMలను చూసి వాటి గురించి తెలుసుకున్నారు.





Tuesday 5 September 2023

National Teacher's day Celebrations 2023 at PS Uppununthala Boys

 






మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భముగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోనే ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన తీరుని వివరించారు. ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి చేరడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానమైనది అందుకే తల్లి తండ్రి తరువాతి స్థానం ఉపాధ్యాయులకే ఉంటుంది. కాబట్టి వారు చెప్పిన విషయాలను నిర్లక్ష్యం చేయకుండా పాటించాలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఆదర్శం గా తీసుకుని బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తరువాత తమకు నాణ్యమైన విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గత విద్యా సంవత్సరం గురుకుల సీటు సాధించిన కాలూరి ప్రజ్వ, కాలూరి శ్రీహాన్, బొల్లె ప్రవీణ, బొల్లె తన్వి మిగతా విద్యార్థులు అందరూ కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Tuesday 29 August 2023

Telugu Language Day celebrations 2023 at PS Uppununthala Boys

💐అందరికీ తెలుసు భాషా దినోత్సవం శుభాకాంక్షలు 🌹






కవి గిడుగు రామమూర్తి జన్మ దినం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు మాతృ భాష దినోత్సవం/తెలుగు భాష దినోత్సవాన్ని మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు పద్యాల పోటీ, గేయాల పోటీ నిర్వహించడం జరిగింది.ప్రతిభ కనబరిచి విజేతలు నిలిచిన ప్రవీణ, సిరి, తన్వి, అలేఖ్య, రాహుల్, తేజ శ్రీ లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మన మాతృభాష తెలుగు గొప్పతనం గురించి మాట్లాడుతూ అమ్మ ఒళ్ళో ఉన్నప్పటి బాల్యం నుంచే మనం తెలుగును నేర్చుకోవడం జరుగుతుంది అని అందుకే మనకు మాతృభాష లోనే ఏ విషయాన్ని అయినా చాలా సులువుగా అవగాహన చేసుకుంటాము. ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని మాతృ భాషతో అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి మాతృ భాషపై పట్టు సాధిస్తేనే ఇతర ఇంగ్లీష్, హిందీ వంటి భాషలను సులభంగా నేర్చుకోగలము. కాబట్టి విద్యార్థులు అందరూ తెలుగు పాఠ్య పుస్తకాలను, గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి తెలుగు భాషలోని వ్యాకరణం, పద్యాలు, గేయాలు, పాటలు, నీతి కథలు, కవితలు చదివి తెలుగు భాషపై పట్టు సాధించాలి అని విద్యార్థులకు సూచించారు.

Thursday 24 August 2023

Chandrayan-3 landing on moon has been shown to PS Uppununthala Boys students

Chandrayan-3 landing on moon has been shown to PS Uppununthala Boys students:


















🚀👌👍చంద్రయాన్-3 ల్యాండింగ్ ను విద్యార్థులకు ప్రొజెక్టర్ స్క్రీన్ పై చూపించడం జరిగింది అదేవిధంగా చంద్రయాన్-3 గురించి వివరించి, విద్యార్థులు అందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి సూచించి, ISRO శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.🌹💐🌹👍

Saturday 19 August 2023

Two computers donate to PS Uppununthala Boys by Emmadi Saidulu sir, Software Employee & Motamari Madhu sir, Professor, PU

 











తేది. 19-08-2023 ఉదయం 10 గం.లకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (Parent Teacher Meeting) లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు, PU ప్రొఫెసర్ మోటమారి మధు గారు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 30వేల రూపాయలతో 2 కంప్యూటర్లను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు దాతలను ఘనంగా శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కాంప్లెక్స్ హెచ్ఎం హన్మంతు రెడ్డి సార్, హెచ్ఎం లక్ష్మీ నారాయణ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాతలు సైదులు గారు, మధు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే  పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్లను ఇస్తున్నామని, తాము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి చేరుకొన్నామని విద్యార్థులు కూడా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


ఈ సమావేశంలో సైదులు గారి శ్రీమతి భారతి గారు, పి.హెచ్.డి స్కాలర్ మహదేవ్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీను గారు, మల్లేష్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Saturday 5 August 2023

Spell Bee Competition at PS Uppununthala Boys

స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

 మొదటి బహుమతి విజేతలు: 











రెండవ బహుమతి విజేతలు:









ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఆరు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన గాజుల గౌతమ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు నడిగడ్డ కిరణ్ గ్రూప్ రెండవ బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా  ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ ని బాగా నేర్చుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Saturday 10 June 2023

Pro Jayashankar Badibata Programme 2023-24 by PS Uppununthala Boys

 


💐🌹💐ఉప్పునుంతల గ్రామ ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుభాకాంక్షలు 🌹💐🌹

🤝⚡విద్యార్థుల తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త⚡🤝

👉 ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అందించబడును.

👉 గురుకుల ప్రవేశ ఫలితాల్లో 2019 సంవత్సరంలో 4; 2020 సంవత్సరంలో 3; 2021 సంవత్సరంలో 4; 2022 సంవత్సరంలో 8; 2023 సంవత్సరంలో 8, ఇలా ప్రతి సంవత్సరం సీట్లు సాధిస్తూ గత ఐదు సంవత్సరాల్లో మొత్తం 27 గురుకుల సీట్లు సాధించిన ఘనత మన పాఠశాలది.

👉 నాణ్యమైన విద్య పొందుతూ వినయంతో గురుకుల ప్రవేశాల్లో ఘన విజయం సాధిస్తున్న మన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు🌹💐🌹.

🔥మన పాఠశాల ప్రత్యేకతలు🔥

👉 ఆహ్లాదకరమైన స్వేచ్ఛా వాతావరణంలో నిజ జీవిత సన్నివేశాలకు అన్వయిస్తూ ఆటపాటలతో బోధన.

👉 ఉన్నత విద్యావంతులు, విషయ నిపుణులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన.

👉 అన్ని తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన.

👉 తెలుగు, ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, గణిత సామర్థ్యాల అభివృద్ధి కోసం FLN ద్వారా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన.

👉 బట్టి విధానంలో కాకుండా విషయ అవగాహన కోసం CCE విధానంలో TLMతో కృత్యాధార బోధన, చేయడం ద్వారా, అనుభవాల ద్వారా అభ్యసనం.

👉 నేటి డిజిటల్ యుగంలో రాణించేలా ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ ఎడ్యుకేషన్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల నిర్వహణ.

👉 పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బిగ్ స్క్రీన్ పై ప్రొజెక్టర్ తో డిజిటల్ తరగతులు నిర్వహణ.

👉 T-Sat&Diksha Appతో మొబైల్ ద్వారా స్వీయ అభ్యసనం.

👉 నవోదయ, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణ.

👉 శారీరక, మానసిక వికాసం కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు నిర్వహణ.

👉 నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుటకు దేశ నాయకులు, మహనీయులు, శాస్త్రవేత్తల మరియు ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ.

👉 నైతిక విలువలు, పఠన నైపుణ్యాలు, సృజనాత్మకత పెంపొందించడం కోసం గ్రంథాలయం నిర్వహణ.

👉 విద్యార్థుల ప్రగతి ప్రదర్శన కోసం, పాఠశాల అభివృద్ధి కోసం ప్రతినెల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహణ.

👉 విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసం ఆరోగ్య, వ్యాయామ విద్య; కళలు, సాంస్కృతిక విద్య; పని, కంప్యూటర్ విద్య; విలువల విద్య, జీవన నైపుణ్యాల బోధన.

👉 వారానికి మూడు గుడ్లతో, సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం.

👉 ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు పంపిణీ.

👉 మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా మెరుగుపరిచిన విశాలమైన తరగతి గదులు, గ్రీన్ బోర్డులు, డ్యూయల్ డెస్క్ లు, సరైన గాలి, వెలుతురు కోసం ప్రతి తరగతి గదికి మూడు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్ లైట్లు కలవు.

👉 మంచినీటి వసతి కలదు.

👉 బాలబాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు కలవు.

👉 బాలురకు హాస్టల్ వసతి కలదు.

👉 విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ కలదు.

👉 ఇంగ్లీష్ మీడియంలో ఒకటి నుండి ఐదు తరగతులకు అడ్మిషన్లు ప్రారంభమైనవి.

👉 మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు బాగా ఆలోచించి మీ పిల్లలను మన ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని మనవి🤝🙏🤝

📱పూర్తి వివరాల కోసం సంప్రదించండి: 7989970120, 7981780531, 9505488934.

Govt Tr Venkatesh sir joins his younger son Rahul in his working BPS Uppununthala Govt School










ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తాను పనిచేస్తున్న పాఠశాలలోనే తన కుమారుడిని చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయడు: 

గాజుల వెంకటేష్ ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో 3సం.రాల క్రితం తన పెద్ద కుమారుడు గౌతమ్ ని చేర్పించారు. ఈ రోజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంతు రెడ్డి సార్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ సమక్షంలో చిన్న కుమారుడు రాహుల్ ని చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు గురుకుల సీట్లు సాధిస్తున్నారు. అహ్లాదకరమైన స్వేచ్ఛ వాతావరణంలో బట్టి విధానంలో కాకుండా కృత్యాధార బోధనా పద్దతిలో అనుభవాల ద్వారా అభ్యసనం జరుగుతుంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లీషు, ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ తరగుతులు నిర్వహిస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మౌళిక సదుపాయాలను సమకూర్చారు. పాఠ్య పుస్తకాలు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరడం జరిగింది. ఉపాధ్యాయులు బాలమణి మేడం, అజ్మతుల్లా సార్ పాల్గొన్నారు.

Dr B.R Ambedkar's life history books donates by Mekala Rama Chandraiah garu



BPS ఉప్పునుంతల విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేసిన మేకల రామచంద్రయ్య:  పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కట్ట సరిత మేడం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5వ తరగతి విద్యార్థులు పాఠశాలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సర్పంచ్ మేడం, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, దాత రామచంద్రయ్య గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పట్టుదలతో బాగా చదువుకొని ప్రపంచ మేధావిగా ఖ్యాతి గడించారని, రాజ్యాంగ రచన ద్వారా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించారని ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివి స్పూర్తి పొంది మీరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను, పెన్నులు,పెన్ను బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ భాస్కర్, నిరంజన్,శేఖర్, మల్లేష్, స్వామి, పరమేశ్ రామస్వామి, తిరుపతయ్య పాల్గొన్నారు.

Games material donates by Srikanth Bheema Garu


శ్రీకాంత్ బీమా గారు మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పును జాతులను సందర్శించి విద్యార్థులకు క్యారం బోర్డ్స్, వాలీబాల్స్, స్కిప్పింగ్ ,వైట్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్, స్లేట్స్, రింగ్ బాల్స్, క్రికెట్ బ్యాట్స్, మొదలైన ఆట వస్తువులను విద్యార్థుులకు అందజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు 🙏

Thursday 30 March 2023

A student distributes pens, pencils to the students of PS Uppununthala Boys

 


Dictionaries distribution to students of PS Uppununthala Boys by their Teacher

 


ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ తన 34వ  పుట్టిన రోజు సందర్భంగా తన పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలు, పెన్సిల్,ఎరేసర్& షార్ప్నర్ లను, అదేవిధంగా తల్లిలేని ఇద్దరు నిరుపేద విద్యార్థులకు గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా వారికి కావలసిన అన్ని నోటు పుస్తకాలు, పెన్నులు & పెన్సిల్ లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులు ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించాలంటే డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులు ఈ డిక్షనరీ ని సద్వినియోగం చేసుకోని ఇంగ్లీష్ భాషను సులభంగా అవగాహన చేసుకోవాలని వెంకటేష్ సార్ విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు ఎంతో సంతోషంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు & కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఇలా విద్యార్థులతో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Monday 6 March 2023

Requirements to PS Uppununthala Boys

Computer Lab:

నేటి సాంకేతిక యుగంలో ప్రతి రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కంప్యూటర్ వినియోగం చాలా పెరిగింది. కంప్యూటర్లను వినియోగిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను పొందుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే ప్రాథమిక స్థాయి నుండి కంప్యూటర్ విద్యను అందించాలి. అందుకోసం విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ అవసరం ఉంది.

ఐదు కంప్యూటర్లు : సుమారు ఒక లక్ష రూపాయలు

అట్టలతో లాప్టాప్ లు చేసుకుని టైపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు: 


Library Books:

విద్యార్థులు పుస్తకాలు చదవడం ద్వారా వారిలో పఠన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. పదజాల అభివృద్ధి జరుగుతుంది. ఊహ శక్తి పెరిగి సృజనాత్మకంగా ఆలోచిస్తారు. నైతిక విలువలు అలబడతాయి. ఏకాగ్రత పెరిగి విషయాలను ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటారు. జ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. స్వీయ అభ్యసనం అలవబడుతుంది. 

పుస్తకాలు: సుమారు 20 వేల రూపాయలు

Water Filter :

తగినంత వాటర్ తాగకపోవడం వల్ల విద్యార్థుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకు మినరల్ వాటర్ అందించుటకు వాటర్ ఫిల్టర్ అవసరం ఉంది. 

వాటర్ ఫిల్టర్: సుమారు 40 వేల రూపాయలు

Shoes :

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే యూనిఫాం, టై, బెల్ట్ తో పాటు బూట్లు కూడా అవసరం ఇవి విద్యార్థుల్లో క్రమశిక్షణకు తోడ్పడుతాయి.

విద్యార్థుల బూట్లకు: సుమారు 30 వేల రూపాయలు

Games Material :

సుమారు 20వేల రూపాయలు

Play Ground : 

ఆటలు విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. దాంతోపాటు నాయకత్వ లక్షణాలను, టీమ్ స్పిరిట్ పోటీ తత్వాన్ని, గెలుపోటములను సమానంగా స్వీకరించే భావోద్వేగ సమతుల్యతను కలుగజేస్తాయి. విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలకు తోడ్పడుతాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించే నైపుణ్యాన్ని ఇస్తాయి. 

ఆట స్థలం అవసరం ఉంది. 




Software Employee Emmadi Saidulu Garu donates Navodaya Vidyalaya Books to students of PS Uppununthala Boys



5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు:

ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు ఐదు వేల రూపాయలతో పంపించిన నవోదయ స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు అందజేశారు. కలర్ ప్రింటర్, నవోదయ స్టడీ మెటీరియల్ లను అందించడమే కాకుండా కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను కూడా అందజేస్తానని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న  సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో సెంట్రల్ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు IAS,IPS లాంటి ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ నవోదయ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని సీటు సాధించి, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొవాలని కోరారు.

Wednesday 1 March 2023

National Science Day Celebrations at PS Uppununthala Boys

 

ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ భౌతిక శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న C.V రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను 1928 సం.లో ఫిబ్రవరి 28న కనుగొన్న సందర్భంగా 1987 సం నుండి ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మన దేశంలో విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జాతీయ విజ్ఞాన దినోత్సవంను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు చేసిన ఎన్నో ఆవిష్కరణల వల్లనే మనం సౌకర్యవంతంగా జీవిస్తున్నాం కాబట్టి విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని తెలుసుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని మూఢనమ్మకాలను నమ్మొద్దు అని తెలియజేశారు. విజ్ఞాన శాస్త్రం/సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధించిన జ్ఞానం అని ప్రతి విషయాన్ని ఏమిటి? ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలను ఆలోచించి, పరిశోధించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. 


యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తి గురించి విద్యార్థుల స్థాయిలో ప్రయోగం ద్వారా వివరించడం జరిగింది.

Saturday 25 February 2023

Sarpanch Katta Saritha Madam inaugurates Website of PS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల పాఠశాల వెబ్సైట్ ను ప్రారంభిస్తున్న సర్పంచ్ కట్ట సరిత మేడం గారు:

ఈ రోజు ఫిబ్రవరి 25, 2023న ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల వెబ్సైట్ ను కట్ట సరిత మేడం, పెద్దలు కట్టా అనంత రెడ్డి సార్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ హన్మంతు రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గౌరవనీయులు సర్పంచ్ సరిత మేడం మరియు పెద్దలు అనంత రెడ్డి సార్ మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్య నేర్చుకోవడం ఎంతో అవసరం. ఇప్పటికే అన్ని రంగాల్లో టెక్నాలజీని కంప్యూటర్ లను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్, టెక్నాలజీ వినియోగం మరింత పెరుగుతుంది. వీటి పైన అవగాహన లేనట్లయితే ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. కాబట్టి పేద విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో కంప్యూటర్ విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. కంప్యూటర్ ల్యాబ్ కోసం మా వంతుగా 1 కంప్యూటర్ ను ఇస్తామని, ఇంకా దాతలతో మరో 2-3 కంప్యూటర్ లను ఇప్పించే ప్రయత్నం చేసి నెల రోజుల్లో విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం సర్పంచ్ మేడం గారు సహకారం అందిస్తున్నందుకు ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. 

స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ హన్మంతు రెడ్డి సార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నారు అని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు.  

Self Government Day Celebrations at PS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహణ:

ఈ రోజు ఫిబ్రవరి 25, 2023 న  బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గా గౌతమ్, DEO గా వెంకటేష్, MEO గా శివకృష్ణ, HM గా భార్గవి లు ఇలా మొత్తం 25 విద్యార్థులు ఛాత్రోపాధ్యాలుగా వ్యవహరించారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు చాలా అందంగా తయారయ్యి వచ్చి చాలా బాగా పాటాలు బోధించారు. గ్రామ సర్పంచ్ కట్ట సరిత మేడం గారు, పెద్దలు కట్టా అనంత రెడ్డి సార్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంతు రెడ్డి సార్, DTF రాష్ట్ర నాయకులు రామస్వామి సార్, SMC చైర్మన్ రాములు సార్, విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి విద్యార్థుల ప్రతిభాపాటవాలను తిలకించి వారిని అభినందించి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేడం మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, విజయ్ కుమార్ సార్ లు మాట్లాడుతూ అనుభవాన్ని మించిన అభ్యసనం లేదని మీరు ఈ రోజు స్వయంగా పాఠాలు బోధించి ఆ అనుభవాన్ని, అనుభూతి పొందారు. ఛాత్రోపాధ్యాయులుగా మీకు దక్కిన గౌరవం, అనుభూతి శాశ్వతంగా పొందాలంటే విద్యార్థులు ఏ రోజు చెప్పింది ఆ రోజు శ్రద్ధగా చదువుకోవాలని నేర్చుకొన్న విషయాలను నిజ జీవితంలో ఉపయోగించుకోవాలని సూచించారు. చదువు ఒక్కటే మన పేదరికం, అజ్ఞానం నుంచి విముక్తి ఇస్తుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఛాత్రోపాధ్యాయుల బోధనను పరిశీలిస్తున్న సర్పంచ్ మేడం, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్

సర్పంచ్ కట్ట సరిత మేడం గారితో విద్యార్థులకు బహుమతుల ప్రదానం

DTF ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు రామస్వామి సార్ తో విద్యార్థులకు బహుమతుల ప్రదానం 

Friday 24 February 2023

Projector donates by Kunda Vedavathi, Dy E.E for digital clases

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డిజిటల్ తరగతులు ప్రారంభం:

డిజిటల్ తరగతుల కోసం ప్రొజెక్టర్ ను తన నాన్న కీ.శే కుంద చెన్నకేశవులు గారి జ్ఞాపకార్థం వారి కూతురు కుంద వేద కుమారి,Dy.E.E, మాధవాని పల్లి గారు అందించారు.



ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహనీయులు బుద్దుడు, అంబేద్కర్, సావిత్రి భాయి ఫూలే, సర్వే పల్లి రాధాకృష్ణ గారి ఫోటోలకు పూలతో నివాళులు అర్పించి, క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ప్రొజెక్టర్ తో డిజిటల్ తరగతులను ముఖ్య అతిథులుగా హాజరైన ఉప్పునుంతల సర్పంచ్ కట్ట సరిత రెడ్డి మేడం గారు, మండల MEO రామారావు సార్ గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో డిజిటల్ తరగతుల ప్రాముఖ్యత పెరిగిందని వాటిని ఉపయోగించుని విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలలో 18 మంది విద్యార్థులు గురుకుల సీట్లు పొందేలా, ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. మహనీయులు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సహకరించేలా డిజిటల్ తరగతుల కోసం ప్రొజెక్టర్ అందించిన వేద కుమారి గారికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ డిజిటల్ తరగతుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు, SMC సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువకులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రొజెక్టర్ దాతకు పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో SMC ఛైర్మన్ రాములు గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం గారు, వెంకటేష్ సార్ గారు, GPS ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు నర్సింహ రెడ్డి గారు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Our PS Uppununthala Boys students gets Gurukula seats every year

Our PS Uppununthala Boys students gets Gurukula seats every year.




PS Uppununthala Boys recognised as Best Practices School by TSSCERT

 TS SCERT recognised our PS Uppununthala Boys school as Best Practices School in state level .


Thursday 23 February 2023

Spell bee competition at PS Uppununthala Boys


ఫిబ్రవరి 10,2023న మధ్యాహ్నం 2 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను 5 గ్రూపులుగా చేసి ఆంగ్ల పదాల స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన అంపటి భార్గవి గ్రూప్ సభ్యులకి పెన్నులు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత కోర్సులు చేసి, ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆంగ్ల భాష పై పట్టు సాధించాలన్నారు. అందుకోసం ఆంగ్ల పదజాలం అభివృద్ధి పరుచుకోవాలని దాని కోసం స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ తోడ్పడుతుందని తెలియజేశారు. విద్యార్థులు అందరూ ఆంగ్ల పాఠ్య పుస్తకాల చివరి పేజిల్లో ఉన్న కామన్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లను చదివి వాటి అర్థాలు తెలుసుకొని రోజూ వాటిని ఉపయోగిస్తుంటే మరిచిపోకుండా గుర్తుంచుకుంటారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఇంగ్లీష్ మీడియంలోకి మారినందున ఇంగ్లీష్ భాష వస్తేనే మిగిలిన విషయాలు అవగాహన చేసుకుంటారు కాబట్టి విద్యార్థులు అందరూ ఆంగ్ల భాష పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

Tuesday 21 February 2023

International Mother Language Day Celebrations at PS Uppununthala Boys

 


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన ప్రజ్వ, తేజ్ కుమార్, భార్గవి లకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ అమ్మ మనకు ఆది గురువు, అమ్మ నేర్పే భాషే మాతృభాష. పాఠశాలకు రాకముందే దీన్ని చాలా సహజసిద్ధంగా మన కుటుంబ సభ్యులను అనుకరిస్తూ నేర్చుకుంటాం. వినడం, మాట్లాడటం ఇంటి వద్దే నేర్చుకుంటే చదవడం, రాయడం వ్యాకరణ అంశాలు పాఠశాలలో నేర్చుకుంటాం. మాతృభాష మన సంస్కృతికి అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి దాన్ని పరిరక్షించుకుంటూనే ఇతర భాషలను నేర్చుకోవాలి. భాషా వికాసం జరిగినప్పుడే విషయావగాహన అవుతుంది. కాబట్టి మాతృభాష పై విద్యార్థులు పట్టు సాధించాలి. అప్పుడే ఇతర భాషలపై కూడా పట్టు సాధిస్తాం. విద్యార్థులు మాతృ భాషలో పుస్తకాలు చదవాలి, కవితలు, పాటలు, గేయాలు, కథలు, నాటికలు రాయాలి, వాటిని ప్రదర్శించాలని తెలియజేశారు.

Friday 17 February 2023

General Knowledge Quiz Competition at PS Uppununthala Boys

 

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను 5 గ్రూపులుగా చేసి జనరల్ నాలెడ్జ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన మధనాగుల ప్రణవి గ్రూప్ సభ్యులకి పెన్నులు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి జనరల్ నాలెడ్జ్ పై పట్టు సాధించాలన్నారు. సమాజాన్ని అవగాహన చేసుకుంటేనే భవిష్యత్తులో భావి భారత ఉత్తమ పౌరులుగా తయారవుతారు. దీని వల్ల భవిష్యత్తులో రాబోయే అన్ని పోటీ పరీక్షలకు కావలసిన ప్రాథమిక సమాచారం తెలుస్తోంది, ఇలాంటి క్విజ్ ల వల్ల విద్యార్థుల్లో పోటి తత్వం పెరిగి జ్ఞాన సముపార్జనకు సంసిద్ధులు అవుతారు.దానితో పాటు పుస్తక పఠనం అలవడుతుంది, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. గ్రూప్ లలో చర్చిస్తారు కాబట్టి సహకారం అలవడుతుంది.కాబట్టి విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే జనరల్ నాలెడ్జ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

Monday 13 February 2023

Software Employee Emmadi Saidulu garu donates Colour Printer to PS Uppununthala boys


ఈ రోజు మధ్యాహ్నం 1గం.లకు సాఫ్ట్వేర్ ఉద్యోగి మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి సైదులు గారు తన భార్య భారతి, మిత్రుడు మహదేవ్ సమక్షంలో BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 15వేల రూపాయల కలర్ ప్రింటర్ ను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ విద్యార్థులకు, పాఠశాలకు ఎంతో ఉపయోగపడే కలర్ ప్రింటర్ ను విరాళంగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రింటర్ దాత సైదులు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే  పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు ఇప్పుడు ప్రింటర్ ఇస్తున్నానని, అతి త్వరలో  కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను తన వంతు గా ఇస్తానని తెలియజేశారు. అదేవిధంగా 15 సెట్స్ నవోదయ బుక్స్ కూడా ఇస్తానని తెలియజేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్నో సమస్యల్ని అధిగమించి ఈ స్థాయికి చేరుకొన్నానని విద్యార్థులు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


నారుమొళ్ళ మహదేవ్ P.HD స్కాలర్ గారు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇప్పుడు జర్నలిజంలో PHD చేస్తున్నాను. ఈ పాఠశాలలో గురుకుల, నవోదయ పాఠశాలల ప్రవేశం కోసం ప్రత్యేక తరగతులు, డిజిటల్ బోధన, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు లాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ఉపాధ్యాయులు చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.


ఈ కార్యక్రమంలో సాయిని శ్రీనివాస్ గారు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, మధనాగుల ఆంజనేయులు గారు, అంపటి తిరుపతయ్య గారు, కాలూరి భారతి గారు,కె. రవికుమార్ గారు, పాత్కల నరేష్ గారు, బూర్సుల శీను గారు, పాత్కూల రాంప్రసాద్ గారు, మేడమోని చిన్న జంగయ్య గారు, ch. మల్లేష్ గారు తదితరులు పాల్గొన్నారు.