2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం: ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో కేకు కోసి 2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సంవత్సరంలో పాఠశాలలో జరిగిన వివిధ సంఘటనలను నెమరు వేసుకోవడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ ఈ ఒక్క రోజుకే సంతోషం పరిమితం కాకుండా అందరూ విద్యార్థులు గత సంవత్సరం చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలని, ఓటములనే విజయానికి మెట్లుగా మలుచుకోవాలని, వచ్చే సంవత్సరం చెడు అలవాట్లు వదులుకుని, మంచి అలవాట్లు అలవర్చుకొని, పరిశుభ్రత పాటిస్తూ, సత్ప్రవర్తనతో, లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి కృషి చేస్తూ, బాగా చదువుకొంటూ, ఆటపాటలతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరమేష్ గారు, స్వర్ణ గారు, అనిత గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment