Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Tuesday 23 April 2024

Annual Day Celebrations 2024 at MPPS Uppununthala Boys



ఘనంగా నిర్వహించిన వార్షిక దినోత్సవం: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన వార్షిక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, పాఠశాల AAPC చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు ఈ సంవత్సరం పాఠశాల సాధించిన అభివృద్ధిని, విద్యార్థుల ప్రతిభను, పాఠశాలలో చేపడుతున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దాతలు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, EX MPTC గారు అందించిన రూ. 8000 లతో మరియు యం. నారాయణ, MPO, ఉప్పునుంతల గారు అందించిన రూ. 2000 లతో గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆడేపు మురళి, మస్కూరి అరవింద్, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి, మేకల అక్షర లను శాలువాలతో సన్మానించి, తరగతి వారిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి అవార్డు మెమొంటో లతో పాటు నగదు బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వీయ అభ్యసనానికి తగిన సూచనలు ఇచ్చారు.

నూతనంగా ఎన్నికైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారిని, దాత పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య గారిని, గతంలో పాఠశాలకు 10 కుర్చీలను వితరణ చేసిన దాత పాత్కుల నిరంజన్ గారిని ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Congratulations to students who got 5th gurukula seats in V TGCET 2024



5వ తరగతి గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు: 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా  మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆడేపు మురళి - అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మస్కూరి అరవింద్ - లింగాల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, మేకల అక్షర - వంగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు విద్యార్థులను అభినందించడం జరిగింది. బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి చంద్రశేఖర్ సార్ లు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

Friday 9 February 2024

V TGCET 2024 Model test has been conducted at MPPS Uppununthala Boys

 








గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మాదిరి పరీక్ష నిర్వహణ: రేపు ఉదయం 11 గం.లకు తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2024 (V TGCET 2024) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సన్నద్దం కావడం కోసం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ విద్యార్థులకు పరీక్ష గురించి ప్రొజెక్టర్ పైన వివరించడం జరిగింది. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను & పరీక్ష ప్యాడ్ తీసుకుని ఒక గంట ముందే అనగా ఉదయం 10 గం.లకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ లో ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న నాలుగు ఆప్షన్ లలో సరైన సమాధానం ఉన్న వృత్తాన్ని పెన్నుతో నల్లగా దిద్దాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు అభ్యాసం కోసం మాదిరి ప్రశ్నాపత్రం&ఓఎంఆర్ షీట్ లను ఇచ్చి మాదిరి పరీక్షను నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, పద్మావతి మేడం లు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్ష బాగా రాసి సీట్లు సాధించాలని ఆకాంక్షించారు.









ప్రొజెక్టర్ పైన విద్యార్థులకు V TGCET 2024 పరీక్ష గురించి వివరిస్తున్న Tr. గాజుల వెంకటేష్ సార్.

Wednesday 24 January 2024

National Girl Child Day 2024 celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం: ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ మహిళలు నేడు చాలా రంగాల్లో రాణిస్తున్నారని, గొప్ప స్థాయికి చెరుకున్న మహిళల గురించి వివరించారు. పూర్వం నుంచి ఇప్పటివరకు బాలికల పట్ల, మహిళల పట్ల లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆధునిక కాలంలో మహిళలు చాలా రంగాల్లో గొప్ప స్థాయికి చేరుకున్నప్పటికీ, శాస్త్రసాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇంకా బాలికల పట్ల వివక్షత తో భృణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు చిన్నప్పటి నుంచే బాలుర తో సమానంగా చదివించి సమాన అవకాశాలు కల్పిస్తే వారు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి బాలికలు బాగా చదువుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Tuesday 23 January 2024

127th Birth Anniversary Celebrations of Subhas Chandra Bose at MPPS Uppununthala Boys

 







ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారు 1897 సంవత్సరంలో జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జానకినాథ్ బోస్, ప్రభావతి లకు జన్మించారని, బాగా చదువుకుని 1920లో భారతీయ సివిల్ సర్వీసు లో 4వ ర్యాంకు సాధించి ఒక సంవత్సరం ఉన్నత ఉద్యోగం చేసి, బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేక రాజీనామా చేసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా కృషి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసి సాయుధ పోరాటం ద్వారానే భారత స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మి దానికి కూడా రాజినామా చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్యం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారు అని వారి సేవలను విద్యార్థులకు వివరించడం జరిగింది. నేతాజీ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Wednesday 3 January 2024

National women teacher 's day celebrations at MPPS Uppununthala Boys

 






ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 193వ జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ను ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సావిత్రి భాయి ఫూలే గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, శ్రీనివాసులు సార్, జానకి రామ్ సార్ లు మాట్లాడుతూ సావిత్రి భాయి ఫూలే గారు తన భర్త సహకారంతో చదువుకుని శూద్రుల కోసం, బాలికల కోసం 1848 సంవత్సరంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో బాలికలకు, శూద్రులకు చదువుకోవడానికి అవకాశం లేదు. అందుకే కొందరు సావిత్రి భాయి ఫూలే పైన పాఠశాలకు వెళ్ళే సమయంలో బురద నీళ్ళు చల్లుతూ, అవమానకరంగా మాట్లాడేవారు. అయినా పట్టు వదలకుండా 52 పాఠశాలలు ప్రారంభించి విద్య ను అందించారు. అనంతరం సత్య శోదక్ సమాజ్ ద్వారా మూఢనమ్మకాలు రూపుమాపడానికి కృషి చేశారు అని తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు బాలమణి మేడం, అనిత మేడం, పద్మావతి మేడం లను శాలువాతో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సన్మానించారు.

Saturday 30 December 2023

New year celebrations 2024 at MPPS Uppununthala Boys | Goodbye 2023 and Welcome 2024










2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం: ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో కేకు కోసి 2023 సంవత్సరానికి వీడ్కోలు - 2024 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సంవత్సరంలో పాఠశాలలో జరిగిన వివిధ సంఘటనలను నెమరు వేసుకోవడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ ఈ ఒక్క రోజుకే సంతోషం పరిమితం కాకుండా అందరూ విద్యార్థులు గత సంవత్సరం చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలని, ఓటములనే విజయానికి మెట్లుగా మలుచుకోవాలని, వచ్చే సంవత్సరం చెడు అలవాట్లు వదులుకుని, మంచి అలవాట్లు అలవర్చుకొని, పరిశుభ్రత పాటిస్తూ, సత్ప్రవర్తనతో, లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి కృషి చేస్తూ, బాగా చదువుకొంటూ, ఆటపాటలతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరమేష్ గారు, స్వర్ణ గారు, అనిత గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.